సాక్షి, అమరావతి: ఏపీలో నిరుద్యోగులకు కూటమి ప్రభుత్వం తీరని మోసం చేసింది. నిరుద్యోగ భృతి అమలు చేయడం లేదని శాసనమండలిలో ఖరాఖండీగా తేల్చిచెప్పింది. మండలి సమావేశాల్లో నిరుద్యోగ భృతిపై కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించగా భృతి ఇచ్చేది లేదని తెలిపింది. అంతేకాకుండా అది ఎప్పటి నుంచి అమలు చేస్తారో అన్న విషయాలను సైతం కూటమిలో ప్రకటించలేదు. కాగా శాసనమండలిలో మూడోరోజు సమావేశాలు వాడివేడీగా జరిగాయి.
డీఎస్సీ అక్రమాలపై చర్చకు పట్టుబడుతూ వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు ఆందోళనకు దిగారు. డిప్యూటీ ఛైర్మన్ ఎన్నిక సమయంలోనూ సభలో కూటమి సభ్యులు సభను వీడారు. దీంతో కూటమి ఎమ్మెల్సీలు వ్యవహారిస్తున్న తీరుపై వైఎస్సార్సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.


