సాక్షి, నంద్యాల జిల్లా: ఆళ్లగడ్డ మండలం అహోబిలంలో అపచారం జరిగింది. అహోబిలం టోల్ గేట్ దగ్గర స్వామివారి లడ్డూ ప్రసాదానికి సంబంధించిన సరుకుల వాహనాన్ని టీడీపీ ఎమ్మెల్యే అఖిలప్రియ వర్గీయులు అడ్డుకున్నారు. ఆలయ నిర్వాహకులు లడ్డూ ప్రసాదం తయారీకి సంబంధించిన సరుకులను తరలిస్తుండగా ఎమ్మెల్యే అనుచరులు అడ్డుపడ్డారు.
ప్రసాదం తయారీకి సంబంధించిన ముడి సరుకులను తమవద్దే తీసుకోవాలని టీడీపీ నాయకులు హుక్కుం జారీ చేశారు. తాము తప్ప ఎవ్వరు కూడా సరుకులను ఇవ్వకూడదంటూ అఖిలప్రియ అనుచరులు బెదిరింపులకు పాల్పడుతున్నారు. టీడీపీ నాయకులపై నంద్యాల ఎస్పీకి అహోబిలం మఠం నిర్వాహకులు ఫిర్యాదు చేశారు.


