రాష్ట్రానికి చేరుకున్న 4 లక్షల కోవిషీల్డ్‌ డోసులు

4 lakh Covishield doses reaching to AP - Sakshi

గన్నవరం: పుణెలోని సీరం ఇన్‌స్టిట్యూట్‌ నుంచి మరో 4 లక్షల కోవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ డోసులు ఆదివారం రాష్ట్రానికి చేరుకున్నాయి. న్యూఢిల్లీ నుంచి ఎయిరిండియా విమానంలో ఈ డోసులను ఇక్కడికి తరలించారు. అనంతరం విమానాశ్రయం నుంచి కంటైనర్లలో గన్నవరంలోని రాష్ట్ర వ్యాధి నిరోధక టీకాల భవనానికి తీసుకువచ్చి భద్రపరిచారు.

మే 1 నుంచి 18 ఏళ్లు నిండిన వారికి రాష్ట్ర ప్రభుత్వం వ్యాక్సిన్‌ వేసేందుకు 2 రోజుల వ్యవధిలో 5 లక్షల కోవిషీల్డ్‌ డోసులను దిగుమతి చేసుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఇక్కడి నుంచి 13 జిల్లాలకు తరలించినట్లు శీతలీకరణ అధికారి దేవానందం తెలిపారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top