జగన్ ప్రభుత్వం రైతుల కోసం ఏర్పాటు చేసిన ఆర్బీకేల్లో ఇప్పుడు సేవలు తగ్గిపోయాయి. గతంలో విత్తనాలు, ఎరువులు, యంత్ర పరికరాలు, రైతు భరోసా, పీఎం కిసాన్, పశువుల మందులు, ఈ–క్రాప్, ఇన్పుట్ సబ్సిడీ, ఇన్సూరెన్స్, పావలా వడ్డీ, సున్నా వడ్డీ... ఇలా రైతులకు సంబంధించి ఏది కావాలన్నా అక్కడికి వెళితే తెలిసేవి. గతంలో రైతులతో ఆర్బీకేలు కిటకిటలాడేవి. ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. రైతులు పెద్దగా అటువైపు వెళ్లడం లేదు. రెండేళ్లుగా రైతులకు ఎలాంటి ప్రయోజనమూ లేకుండా పోయింది.
– సత్యనారాయణరెడ్డి, రైతు, బోరంపల్లి, కళ్యాణదుర్గం మండలం


