రేషనలైజేషన్ పేరుతో మూతబడిన 125 ఆర్ఎస్కేలు తెరిచి గతంలో మాదిరిగా అన్ని రకాల సేవలూ అందించాలి. వ్యవసాయ, అనుబంధ రంగాలకు సంబంధించి పథకాల ఫలాలు, ఇతరత్రా కార్యక్రమాలు రైతు ముంగిటకే చేరాలనే ఆలోచనతో ఏర్పాటు చేసిన వాటిని కుదించే ప్రయత్నాలు చేయడం మంచిదికాదు. రైతు ప్రభుత్వమని గొప్పలు చెప్పుకునే ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నవాటిని మూసివేసి రైతులకు సేవలు దూరం చేయడం దారుణం. గతంలో మాదిరిగానే విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు, ఇతరత్రా ఇన్పుట్స్ వంటివి మూసివేసిన ఆర్ఎస్కేల్లో కూడా పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలి.
– ఆర్.చంద్రశేఖర్రెడ్డి, జిల్లా ప్రధానకార్యదర్శి, ఏపీ రైతు సంఘం


