జగనన్న దీవెనతోనే జెడ్పీ చైర్పర్సన్ వంటి ఉన్నత పదవిని అలంకరించాను. సాధారణ స్థాయి నుంచి అసాధారణ స్థాయికి రావడానికి ఆయన చలువే కారణం. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ మహిళలకు ఉన్నతస్థానం దక్కాలంటే ఒక వైఎస్సార్సీపీ, జగనన్నతోనే సాధ్యం. మహిళలకు డ్వాక్రా రుణాలు మాఫీ చేసి.. తోబుట్టువులకు ఆర్థిక స్వావలంబన కల్పించారు. చంద్రబాబు ప్రభుత్వంలో డ్వాక్రా సంఘాలు నిర్వీర్యం అయ్యాయి. మహిళలకు ఆర్థిక సాయం అందించే ఒక్క పథకమూ లేదు.
– బోయ గిరిజమ్మ, జెడ్పీ చైర్పర్సన్


