
‘నీట్’ ఫలితాల్లో అదుర్స్
● జిల్లా విద్యార్థులకు
అత్యుత్తమ ర్యాంకులు
అనంతపురం ఎడ్యుకేషన్: దేశంలోని వైద్య కళాశాలల్లో వైద్య విద్య ప్రవేశాలకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) నిర్వహించిన నీట్ ఫలితాలు శనివారం విడుదలయ్యాయి. అనంతపురం నగరానికి చెందిన కూరపాటి సైనారెడ్డి ప్రతిభ చాటి ఆలిండియా స్థాయిలో 866వ ర్యాంకు సాధించింది. విద్యార్థి తండ్రి కూరపాటి నరసింహారెడ్డి శింగనమల మండలం పెరవలిలో ఫిజికల్ డైరెక్టర్గా, తల్లి ధనలక్ష్మీ ఐసీడీఎస్లో సూపర్వైజర్గా పని చేస్తున్నారు. నగరానికి చెందిన మరో విద్యార్థి ఎం.తరుణ్తేజ్ జాతీయస్థాయిలో 1,054వ ర్యాంకుతో మెరిశాడు. తరుణ్తేజ్ తండ్రి ఎం. తిమ్మారెడ్డి శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం మండలం చిగిచెర్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల హెచ్ఎంగా పని చేస్తుండగా...తల్లి గృహిణి.
● భూక్యా కులాస్ నాయక్ జాతీయ స్థాయిలో 12,503, ఎస్టీ కేటగిరీలో 71వ ర్యాంకు సాధించాడు. తండ్రి భూక్యా జయరామ్నాయక్, తల్లి దేవరకొండ గీతమ్మ ఇద్దరూ సెకండరీ గ్రేడ్ టీచర్లుగా పని చేస్తున్నారు. వీరి పెద్ద కుమారుడు భూక్యా వికాస్ నాయక్ ప్రస్తుతం ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు.
● నగరానికి చెందిన ముడియం కృష్ణయాదవ్ ఆలిండియా జనరల్లో 33,242 ర్యాంకు, ఓబీసీ కేటగిరీలో 15,442వ ర్యాంకు సాధించాడు. తండ్రి ఎం.వెంకటసుబ్బయ్య శింగనమల మండలం సోదనపల్లి, తల్లి పి.పద్మ పామిడి మండలం కాలాపురంలో టీచర్లుగా పని చేస్తున్నారు.
వ్యవసాయ కుటుంబంలో విద్యా కుసుమం
పామిడి: నీట్ ఫలితాల్లో పామిడి మండలంలోని కట్టకింద పల్లికి చెందిన పెరమసాని హరిత 13,567 ర్యాంక్తో మెరిసింది. హరిత తల్లిదండ్రులు రామాంజనేయులు, రమాదేవి. తమ పది ఎకరాల పొలంలో రామాంజనేయులు వ్యవసాయం చేస్తుండగా, ఆయనకు చేయూతగా రమాదేవి పాడి ఆవులు, గేదెలతో పాటు పొట్టేళ్లు పెంచుతున్నారు. పిల్లలను బాగా చదివించాలన్న తపనతో దంపతులు ఎంతో శ్రమిస్తున్నారు. తమ కష్టం వృథా పోనివ్వ కుండా కుమార్తె నీట్లో మంచి ర్యాంకు సాధించడంతో సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా హరిత మాట్లాడుతూ డాక్టరై పేదలకు ఉచితంగా వైద్య సేవలందించి తల్లిదండ్రులు, గ్రామానికి పేరుతెస్తానని తెలిపింది.

‘నీట్’ ఫలితాల్లో అదుర్స్

‘నీట్’ ఫలితాల్లో అదుర్స్

‘నీట్’ ఫలితాల్లో అదుర్స్

‘నీట్’ ఫలితాల్లో అదుర్స్