అర్ధరాత్రి ‘తమ్ముళ్ల’ అలజడి | - | Sakshi
Sakshi News home page

అర్ధరాత్రి ‘తమ్ముళ్ల’ అలజడి

Jun 15 2025 8:01 AM | Updated on Jun 15 2025 8:01 AM

అర్ధర

అర్ధరాత్రి ‘తమ్ముళ్ల’ అలజడి

తాడిపత్రిటౌన్‌: తాడిపత్రి పట్టణం.. శుక్రవారం రాత్రి 11 గంటల సమయం... ప్రజలు ప్రశాంతంగా నిద్రపోతున్న వేళ మున్సిపల్‌ చైర్మన్‌ జేసీ ప్రభాకర్‌రెడ్డి ఇంటి ముందు వందలాదిమంది టీడీపీ కార్యకర్తలు గుమిగూడారు. పట్టణ ప్రధాన కూడళ్లలో టపాకాయలు కాలుస్తూ అలజడి సృష్టించారు. తాడిపత్రికి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి రాకుండా అడ్డుకుంటామంటూ అరుపులు, కేకలతో హల్‌చల్‌ చేశారు. దీంతో ఒక్కసారిగా పట్టణ వాసులు ఉలిక్కిపడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన జేసీ ఇంటి వద్దకు చేరుకొని టీడీపీ కార్యకర్తలను నిలువరించారు. పోలీసులు జేసీ, కేతిరెడ్డి ఇళ్ల వద్ద, ప్రధాన కూడళ్లలో బందోబస్తు నిర్వహించారు. శనివారం కూడా బందోబస్తు కొనసాగించారు.

అర్ధరాత్రి ‘తమ్ముళ్ల’ అలజడి 1
1/1

అర్ధరాత్రి ‘తమ్ముళ్ల’ అలజడి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement