నాతవరం: మండల కేంద్రంలో మంగళవారం భారీ వర్షం కురియడంతో ప్రభుత్వ కార్యాలయాలు ప్రాంగణంలో నీరు చేరింది. చాలా కాలంగా భారీ వర్షాలు కురియక ప్రజలు తీవ్ర అవస్ధలు పడేవారు. మంగళవారం ఉదయం నుంచి తీవ్రంగా ఎండ కాచి మధ్యాహ్నం ఒక్కసారిగా వాతావరణం చల్లబడి భారీ వర్షం కురవడంతో ఖరీ్ఫ్ సీజన్లో వరిపంటకు ఊపిరిపోసినట్టయిందని రైతులు హర్షం వ్యక్తం చేశారు. భారీ వర్షం కారణంగా ఎంపీడీవో తహశీల్దార్ కార్యాలయాలు ప్రాంగణంలో వర్షపు నీరు చేరింది. కార్యాలయాల ప్రాంగణంలో పార్కింగ్ చేసిన వాహనాలు నీటి మునిగాయి.


