బలవంతపు భూసేకరణ ఆపాల్సిందే.. | - | Sakshi
Sakshi News home page

బలవంతపు భూసేకరణ ఆపాల్సిందే..

Sep 16 2026 3:55 AM | Updated on Sep 16 2026 3:55 AM

కె.కోటపాడు: గొండుపాలెంలో ఎంఎస్‌ఎంఈ పార్కు ఏర్పాటు కోసం ప్రభుత్వం చేపడుతున్న బలవంతపు భూసేకరణ ఆపాలని ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు ఉత్తర్వులను ఇచ్చినట్టు సీపీఎం జిల్లా కార్యదర్శి డి.వెంకన్న తెలిపారు. హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను మంగళవారం ఆయన విలేకరులకు చూపించారు. ఈ నెల 10న జస్టిస్‌ సుబ్బారెడ్డి ఉత్తర్వులు ఇచ్చినట్టు తెలిపారు. 2013 భూసేకరణ చట్టానికి లోబడి పబ్లిక్‌ హియరింగ్‌ లేకుండా ఈ ఏడాది మే 25న ఎంఎస్‌ఎంఈ పార్కు కోసం భూమిపూజను చేసినట్టు హైకోర్టుకు పిటిషనర్లు హైకోర్టును ఆశ్రయించారని తెలిపారు. హైకోర్టు ఇచ్చిన ఆదేశాలలో తెలిపిన సర్వే నెంబర్లులో చట్ట ప్రకారం ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా వారిని ఖాళీ చేయించడం తగదని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement