ఢిల్లీ నుంచి శృంగవరం పంచాయతీకి ఆహ్వానం | - | Sakshi
Sakshi News home page

ఢిల్లీ నుంచి శృంగవరం పంచాయతీకి ఆహ్వానం

Jun 2 2026 3:00 AM | Updated on Jun 2 2026 3:00 AM

● రేపు జాతీయ అవార్డుతో రూ.కోటి ప్రదానం

నాతవరం: గుడ్‌ గవర్నెర్స్‌ విభాగంలో జాతీయ స్థాయిలో ఉత్తమ అవార్డుకు ఎంపికై న నాతవరం మండలంలో శృంగవరం పంచాయతీకి ఆహ్వానం అందింది. ఈ నెల 3వ తేదీన ఢిల్లీలో కార్యక్రమానికి హాజరు కావాలని జిల్లా పంచాయతీ అధికారి సందీప్‌తోపాటు పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్‌లకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఆహ్వానం వచ్చింది. ఈ మేరకు మంగళవారం ఉదయం వారిద్దరు ఢిల్లీ బయలుదేరి వెళ్లనున్నారు. అక్కడ పంచాయతీ తరపున జాతీయ అవార్డుతో కోటి రూపాయలు అందుకోనున్నారు. ఉమ్మడి జిల్లాలోనే శృంగవరం పంచాయతీకి జాతీయ స్థాయిలో ఉత్తమ అవార్డు రావడం చాలా ఆనందంగా ఉందని డీపీవో తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement