స్నేహం ముసుగులో మోసం
తగరపువలస: స్నేహం పేరుతో మోసగించి, బలవంతంగా కిడ్నీని విక్రయించిన కారణంగా మరణించిన సాడి యమున(29) భౌతిక కాయానికి శుక్రవారం ఆమె స్వగ్రామం వెల్లంకిలో అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఆనందపురం మండలం వెల్లంకి పంచాయతీ బొడ్డపాలేనికి చెందిన యమునను.. నగరానికి చెందిన సూరిబాబు, పద్మ, సత్య పిక్నిక్ పేరుతో వంచించి, అన్నమయ్య జిల్లా మదనపల్లెకు తీసుకువెళ్లారు. అక్కడ ఆమె కిడ్నీని విక్రయించడంతో తీవ్ర అనారోగ్యం పాలై మరణించిన సంగతి తెలిసిందే. మరణించిన మూడు రోజుల అనంతరం గురువారం తిరుపతి రుయా ఆస్పత్రిలో మృతదేహానికి పోస్టుమార్టం చేశారు


