కొయ్యూరు: స్థానిక కస్తూరిబా గాంధీ బా లికల విద్యాలయంలో ఏడాది కాలంగా ఖాళీ గా ఉన్న ప్రత్యేకాధికా రి పోస్టును ఎట్టకేలకు ఉన్నతాధికారులు భర్తీ చేశా రు. ఈనెల 12న సాక్షిలో కొయ్యూరు కస్తూర్బాలో తెలుగు బోధన ప్రశ్నార్థకం శీర్షికన ప్రచురితమైన కథనానికి వా రు స్పందించారు. పాడేరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కంప్యూటర్ అప్లికేషన్ విభాగంలో అతిథి అధ్యాపకురాలిగా సేవలందించిన శోభ లావణ్యను ప్రత్యేకాధికారిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు ఆమె బుధవారం బాధ్యతలు స్వీకరించారు. త్వరలో తెలుగు ఉపాధ్యాయ పోస్టును భర్తీ చేయనున్నట్టు అధికారవర్గాలు తెలిపాయి.


