తాటిచెట్లపాలెం: ప్రయాణికుల డిమాండ్, వెయిటింగ్ లిస్ట్ ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని విశాఖ–కిరండూల్–విశాఖ పాసింజర్ రైలుకు ఆయా తేదీల్లో అదనపు విస్టాడోమ్ కోచ్ను జత చేస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. విశాఖ–కిరండూల్ (58501) పాసింజర్ రైలుకు ఈ నెల 13, 15, 17, 19, 21, 23, 25, 27, 29 తేదీల్లో అదనపు అద్దాల కోచ్ను జత చేయనున్నారు. అదేవిధంగా తిరుగు ప్రయాణంలో కిరండూల్–విశాఖ (58502) పాసింజర్ రైలుకు ఈ నెల 14, 16, 18, 20, 22, 24, 26, 28, 30 తేదీల్లో అదనపు విస్టాడోమ్ కోచ్ అందుబాటులో ఉంటుందని అధికారులు వెల్లడించారు.


