● జేసీ శౌర్యమాన్ పటేల్
తుమ్మపాల: పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టితో తయారు చేసిన వినాయక విగ్రహాలను పూజించాలని జాయింట్ కలెక్టర్ శౌర్యమాన్ పటేల్ కోరారు. ఏపీ కాలుష్య నియంత్రణ మండలి ప్రాంతీయ కార్యాలయం ఆధ్వ ర్యంలో ఉచిత మట్టి వినాయక ప్రతిమల పంపిణీని శుక్రవారం కలెక్టరేట్ ప్రాంగణంలో ఆయన ప్రారంభించి, పోస్టర్లు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గణేష్ నవరాత్రి ఉత్సవాలను పర్యావరణహితంగా నిర్వహించాలన్నారు. పర్యావరణ హితమైన గణేష్ నవరాత్రి ఉత్సవాల నిర్వహణలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని, ప్రకృతి, జలవనరులను కాపాడుతూ భక్తిశ్రద్ధలతో పండగను చేసుకోవాలని తెలిపారు.


