ఈనెల 24న పాఠశాలలో జరిగిన మెగా పేరెంట్స్ మీట్కి తల్లి దండ్రులంతా వెళ్లాం. పాఠశాల ప్రిన్సిపాల్ తమతో సమావేశమై 5, 6, 7 తరగతుల విద్యార్థులను ఇక్కడ నుంచి తీసుకువెళ్లాలని, నచ్చిన చోట జాయిన్ చేసుకోవాలని చెప్పారు. దీంతో ఏం చేయాలో దిక్కు తోచడం లేదు. తమ పిల్లలు ప్రస్తుతం అక్కడ వాతావరణం, అక్కడ చదువు చెప్పే విధానానికి అలవాటు పడ్డారు. ఈ సమయంలో అక్కడ నుంచి వేరే చోటుకు తీసుకువెళ్తే విద్యార్థులకు ఆరోగ్య,మానసిక సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి.
– కె. రాజేష్, విద్యా కమిటీ చైర్మన్, మారికవలస పాఠశాల


