మహిళలకు క్షమాపణ చెప్పాల్సిందే.. | - | Sakshi
Sakshi News home page

మహిళలకు క్షమాపణ చెప్పాల్సిందే..

Apr 9 2026 7:53 AM | Updated on Apr 9 2026 7:53 AM

ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ తీరుపై వైఎస్సార్‌సీపీ నేతల ఆగ్రహం

ఆయనది జర్నలిజం కాదుం బ్రోకరిజం

విశాఖలో ఆంధ్రజ్యోతి–ఏబీఎన్‌ కార్యాలయం ఎదుట భారీ నిరసన

మహిళలను కించపరిచే రాతలు వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌

పోలీసుల అడ్డంకుల మధ్య కొనసాగిన శాంతియుత ఆందోళన

మహారాణిపేట: జర్నలిజం విలువలను తుంగలో తొక్కి, బ్రోకరిజమే వృత్తిగా మార్చుకున్న ఆంధ్రజ్యోతి అధినేత వేమూరి రాధాకృష్ణ తీరుపై వైఎస్సార్‌సీపీ శ్రేణులు కన్నెర్ర చేశాయి. ‘కొత్త పలుకులు’ పేరుతో ఆయన రాస్తున్న ‘చెత్త పలుకులు’ మహిళా లోకాన్ని కించపరిచేలా ఉన్నాయంటూ విశాఖలోని ఆంధ్రజ్యోతి కార్యాలయాన్ని పార్టీ నేతలు బుధవారం ముట్టడించాయి. వైఎస్సార్‌సీపీ విశాఖ, అనకాపల్లి జిల్లాల అధ్యక్షులు కె.కె.రాజు, బొడ్డేడ ప్రసాద్‌ ఆధ్వర్యంలో పోర్టు హాస్పిటల్‌ జంక్షన్‌ వద్ద భారీ ఎత్తున నిరసన ప్రదర్శన నిర్వహించాయి. ఆంధ్రజ్యోతి పత్రిక, ఏబీఎన్‌ కార్యాలయం వైపు దూసుకువెళ్తున్న పార్టీ శ్రేణులను పోలీసులు అడుగడుగునా అడ్డుకున్నప్పటికీ, నేతలు రహదారిపై బైఠాయించి రాధాకృష్ణ వైఖరిని పార్టీ నేతలు ఎండగట్టారు. రాధాకృష్ణ తన రాతల ద్వారా మహిళలను కించపరిచారని, తక్షణమే మహిళా లోకానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఏబీఎన్‌, ఆంధ్రజ్యోతి పత్రికలు కేవలం చంద్రబాబు అజెండాను అమలు చేసే సాధనాలుగా మారాయని, బాబు నోటి నుంచి వచ్చే మాటలనే వీరు రాతలుగా రాస్తున్నారని ఆరోపించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement