అడవిదున్న అలజడి | - | Sakshi
Sakshi News home page

అడవిదున్న అలజడి

Apr 6 2026 7:36 AM | Updated on Apr 6 2026 7:36 AM

రాత్రి సమయంలో సంచరిస్తున్న అడవిదున్న

హుకుంపేట (డుంబ్రిగుడ): ఆంధ్ర–ఒడిశా సరిహద్దు ప్రాంతమైన హుకుంపేట మండలంలో అడవి దున్న సంచారం తీవ్ర కలకలం రేపుతోంది. మండలంలోని గరుడపల్లి, పామురాయి గ్రామాల సమీపంలో శనివారం భారీ అడవి దున్న ప్రత్యక్షమవడంతో స్థానిక గిరిజనులు ఒక్కసారిగా భీతిల్లారు. పామురాయి – గరుడపల్లి గ్రామాల మధ్య ప్రధాన రహదారిపై అడవి దున్న అకస్మాత్తుగా ప్రత్యక్షమైంది. ఆ సమయంలో అటుగా వెళ్తున్న వాహన చోదకులు, గిరిజనులు ఆ భారీ జంతువును చూసి ఒక్కసారిగా వాహనాలు నిలిపివేశారు. ఊహించని విధంగా ఎదురైన అడవి దున్నను చూసి ఏం జరుగుతుందోనన్న ఆందోళనతో అందరూ చెల్లాచెదురయ్యారు.

గతంలో ఎన్నడూ లేనివిధంగా..

సాధారణంగా ఈ ప్రాంతంలో ఇలాంటి పెద్ద క్రూర మృగాలు సంచరించడం అరుదని స్థానికులు చెబుతున్నారు. గతంలో ఎప్పుడూ మా ప్రాంతంలో ఇలాంటి జంతువులు కనిపించలేదు. సరిహద్దు అటవీ ప్రాంతం నుంచి ఇది ఇక్కడికి వచ్చి ఉంటుంది. ఏ క్షణంలో ఏం జరుగుతుందోనని భయంగా ఉంది అని గిరిజనులు వాపోతున్నారు. అడవి దున్న సంచారంతో అటవీ ప్రాంత గ్రామాల ప్రజలు పొలాలకు వెళ్లాలన్నా, బయటకు రావాలన్నా వణికిపోతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement