జి.మాడుగుల @ 14.5 డిగ్రీలు
● జిల్లాలో నమోదవుతున్న
కనిష్ట ఉష్ణోగ్రతలు
చింతపల్లి: జిల్లాలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి.చలి తీవ్రత పెరుగుతోంది. శనివారం జి.మాడుగులలో 14.5, పాడేరులో 15.7 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అయినట్లు స్థానిక ఆర్ఏఆర్ఎస్ ఏడీఆర్, వాతావరణ విభాగం నోడల్ అధికారి డాక్టర్ ఆళ్ల అప్పలస్వామి తెలిపారు. పాడేరు డివిజన్ అరుకువ్యాలీలో 16.0, హుకుంపేటలో 16.2, చింతపల్లి,డుంబ్రిగుడలో 16.5, ముంచంగిపుట్టు,పెదబయలులో 16.8, కొయ్యూరులో 19.5 డిగ్రీలు నమోదు అయ్యాయని పేర్కొన్నారు. రంపచోడవరం డివిజన్ రంపచోడవరంలో 23.4, మారేడిమిల్లిలో 16.3, అడ్డతీగలలో 19.5, చింతూరు డివిజన్ చింతూరులో 20.8 డిగ్రీలు, ఎటపాకలో 22.3 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అయినట్లు ఏడీఆర్ తెలిపారు. ఉదయం 9 గంటల వరకు పొగమంచు దట్టంగా కురుస్తోంది.


