శ్రీవారి పుష్పయాగానికి పువ్వుల తరలింపు | - | Sakshi
Sakshi News home page

శ్రీవారి పుష్పయాగానికి పువ్వుల తరలింపు

Oct 30 2025 8:01 AM | Updated on Oct 30 2025 8:03 AM

ఎంవీపీ కాలనీ: శ్రీ వేంకటేశ్వరస్వామి పుష్పయాగానికి విశాఖ నుంచి పువ్వులు తరలివెళ్లాయి. అధ్యాత్మికవేత్త హిమాన్షు ప్రసాద్‌ ఆధ్వర్యంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో సేకరించిన పూలను యాగానికి పంపించారు. బుధవారం ఉదయం ఎంవీపీ కాలనీలోని టీటీడీ ఈ–దర్శనం కౌంటర్‌ వద్దనున్న హిందూ ధర్మ ప్రచార పరిషత్‌ కార్యాలయంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. తొలుత టీటీడీ స్థానిక సలహా కమిటీ చైర్మన్‌ పట్టాభిరామ్‌ దంపతులు, మహిళా భక్తులు పూలకు సంకల్పం చేశారు. అనంతరం శాస్త్రోక్తంగా పుష్పయాగం కోసం తిరుమలకు తరలించారు. వీటిలో 3 వేల కలువలు, 2 వేల తామరలతోపాటు వివిధ రకాల పూలు ఉన్నట్లు హిమాన్షు ప్రసాద్‌ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement