
సింహగిరిపై శ్రీనృసింహ హోమం
సింహాచలం: శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి జన్మనక్షత్రం స్వాతి నక్షత్రాన్ని పురస్కరించుకుని గురువారం సింహగిరిపై శ్రీ నృసింహ హోమం ఘనంగా జరిగింది. ఉదయం 7 నుంచి ఆలయ కల్యాణమండపంలో అర్చకులు హోమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. వేదికపై చక్రపెరుమాళ్లని వేంజేపచేశారు. విష్వక్సేనపూజ, పుణ్యాహవచనం, షోడషోపచారపూజలు జరిపారు. పూజలో పాల్గొన్న భక్తులకు కంకణధారణ చేసి హోమగుండం వద్ద వేంజేపచేశారు. మండపారాధన, అగ్నిప్రతిష్ట, హోమం, పూర్ణాహుతి అనంతరం కుంభప్రోక్షణ కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా జరిపారు. ఉప ప్రధానాచార్చకులు సాతులూరి నరసింహాచార్యులు ప్రధాన కలశాన్ని శిరస్సుపై పెట్టుకుని ప్రదక్షిణ చేశారు. ఆ జలాలను స్వామికి సమర్పించారు. ఉభయదాతలకు స్వామివారి శేషవస్త్రాలు, ప్రసాదం అందించారు.