నేరడిగొండ: భూ సమస్యలను పరిష్కరిస్తామ ని అదనపు కలెక్టర్ (రెవెన్యూ) ఆర్ఎస్.చిత్రు అన్నారు. మండలంలోని బుద్ధికొండ గ్రామాన్ని మంగళవారం సందర్శించి రీసర్వే తీరును పరిశీలించారు. రికార్డులను తనిఖీ చేశారు. అనంతరం గ్రామ పెద్దలతో సమావేశమై సమస్యలపై చర్చించారు. రికార్డుల పరిశీలనలో పారదర్శకత పాటిస్తూ, సమస్యలను నిబంధనల ప్రకారం పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఆయన వెంట సర్వే అండ్ ల్యాండ్స్ రికార్డ్స్ అసిస్టెంట్ డైరెక్టర్ ఎల్.ప్రభాకర్, తహసీల్దార్ కలీం, మండల సర్వేయర్ శంకర్, తదితరులున్నారు.


