-
గుజరాత్ అల్లర్ల కేసులో.. నిందితులకే ‘సిట్’ కొమ్ముకాసింది
న్యూఢిల్లీ: 2002 నాటి గుజరాత్ అల్లర్ల కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) సాధించిందేమీ లేదని కాంగ్రెస్ పార్టీ దివంగత నేత, మాజీ ఎంపీ ఎహసాన్ జాఫ్రీ భార్య జకియా జాఫ్రీ ఆరోపించారు. ఈ కేసులో సిట్ ఎలాంటి విచారణ జరపలేదని, పైగా నిందితులను రక్షించేందుకు ప్రయత్నించిందని గురువారం సుప్రీంకోర్టుకు తెలియజేశారు. విశ్వ హిందూ పరిషత్(వీహెచ్పీ), భజరంగ్ దళ్ సభ్యులకు, పోలీసులకు ప్రభుత్వ అధికారులకు, ఇతరులకు శిక్ష పడకుండా సిట్ రక్షణ కల్పించిందని పేర్కొన్నారు. 2002 ఫిబ్రవరి 28న గుజరాత్లోని అహ్మదాబాద్లో గుల్బర్గ్ సొసైటీ వద్ద జరిగిన అల్లర్లలో ఎహసాన్ జాఫ్రీ హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఈ అల్లర్ల వ్యవహారంలో అప్పటి గుజరాత్ సీఎం నరేంద్ర మోదీతో సహా 64 మంది నిందితులకు ‘సిట్’ క్లీన్చిట్ ఇవ్వడాన్ని సవాలు చేస్తూ జకియా జాఫ్రీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆమె తరపు లాయర్ సిబల్ వాదించారు. అల్లర్లు జరుగుతున్నా గుజరాత్ సర్కార్ మిన్నకుండిపోయిందన్నారు. కేసులో ‘సిట్’ ఎలాంటి విచారణ జరపకపోగా నిందితులకు కొమ్ముకాసిందని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. 16న వాదనలు కొనసాగనున్నాయి. -
‘మోదీకి క్లీన్చిట్’పై సుప్రీంలో 26న విచారణ
న్యూఢిల్లీ: గుజరాత్ అల్లర్ల కేసులో ప్రధాని మోదీకి క్లీన్చిట్ ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు ఈ నెల 26వ తేదీన విచారించనుంది. అప్పటి గుజరాత్ సీఎం మోదీకి క్లీన్చిట్ ఇస్తూ సిట్ తీసుకున్న నిర్ణయంపై ఆ అల్లర్లలో ప్రాణాలు కోల్పోయిన మాజీ ఎంపీ ఎహ్ సాన్ జాఫ్రీ భార్య జకియా గుజరాత్ హైకో ర్టును ఆశ్రయించారు. అయితే, ఆధారాలు లేవంటూ 2017లో కోర్టు ఆమె పిటిషన్ను కొట్టేసింది. దీన్ని సవాల్ చేస్తూ జకియా సుప్రీం ను ఆశ్రయించగా సోమవారం జస్టిస్ ఏఎం ఖన్విల్కర్, జస్టిస్ దీపక్ గుప్తాల ధర్మాసనం విచారణ చేపట్టింది. దీంతోపాటు ఇదే కేసులో సహ పిటిషనర్గా పరిగణించాలంటూ సామా జిక కార్యకర్త తీస్తా సెతల్వాద్ పెట్టుకున్న అర్జీపైనా ధర్మాసనం వాదనలు వింది. 2002 గోద్రాలో సబర్మతీ రైలు బోగీకి దుండగులు నిప్పు పెట్టడంతో పెద్ద సంఖ్యలో జనం చనిపోగా గుజరాత్లో అల్లర్లు చెలరేగాయి. -
2002 గుజరాత్ అల్లర్ల కేసు: సుప్రీం కోర్టు విచారణ
-
'కోర్టు తీర్పు సంతోషం కలిగించలేదు'
అహ్మదాబాద్: గుల్బర్గ్ సొసైటీ కేసులో అహ్మదాబాద్ కోర్టు తీర్పుపై విశ్రమ స్పందనలు వ్యక్తమయ్యాయి. కోర్టు తీర్పును సామాజిక కార్యకర్త తీస్తా సెతల్వాద్ స్వాగతించారు. దోషులుగా తేలిన 24 మందిలో 11 మందికే జీవితఖైదు విధించడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. మిగిలిన దోషులకు యావజ్జీవ శిక్ష విధించాలని అప్పీలు చేస్తామని ప్రకటించారు. తాము ప్రతీకారం కోరుకోవడం లేదని, పశ్చాత్తాపం కోరుకుంటున్నామని చెప్పారు. కోర్టు తీర్పు పట్ల ఎహసాన్ జాఫ్రి సతీమణి జకియా జాఫ్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. కోర్టు తీర్పు తనకు ఆనందం కలిగించలేదన్నారు. ఇది సరైన న్యాయం కాదన్నారు. దోషులందరికీ జీవితఖైదు విధించకపోవడంపై పోరాటం కొనసాగిస్తామని చెప్పారు. దీనిపై తమ న్యాయవాదులను సంప్రదిస్తున్నానని చెప్పారు. అహ్మదాబాద్ కోర్టు తీర్పుపై ఎగువ కోర్టులో అప్పీలు చేస్తామని దోషుల తరపు బంధువులు పేర్కొన్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
అణగారిన వర్గాల ఆశాజ్యోతి సీఎం వైఎస్ జగన్
జగనన్న పాలనలో అందరికీ సంక్షేమం
సంక్షేమానికి ఆకర్షితులై వైఎస్సార్ సీపీలో చేరికలు
సంక్షేమ పథకాలను ఆపేసే కుట్ర
రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగిపై దాడి.. టీడీపీ నేతలపై కేసు
డబ్బు పంపిణీ చేసిన ప్రభుత్వ ఉపాధ్యాయులు
No Headline
మూడోరోజు పోస్టల్ ఓటింగ్ ప్రశాంతం
ఈ ముగ్గురు ప్రత్యేకం!
No Headline
తప్పక చదవండి
- ‘ఆర్య’ సినిమా 20 ఇయర్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
- లగ్జరీ కారు కొనుగోలు చేసిన బుల్లితెర నటి..!
- అవినీతి ‘కాలువ’
- పాతబస్తీలో పతంగేనా?
- నేడు ఏపీలో ప్రధాని ఎన్నికల ప్రచారం
- పిడుగులుపడి ఏడుగురు మృత్యువాత
- బీజేపీ ఖైదీగా శ్రీరాముడు
- Telangana: మరో రెండు రోజులు వానలు
- మండుటెండల్లోనూ నిండా ముంచే..రాష్ట్రవ్యాప్తంగా తడిసిన ధాన్యం
- Madakasira: లోకలా.. నాన్ లోకలా?
Advertisement