వివో నుంచి ‘వై21ఎల్’4జీ స్మార్ట్ఫోన్
న్యూఢిల్లీ: చైనా ప్రముఖ మొబైల్ హ్యాండ్సెట్స్ తయారీ కంపెనీ ‘వివో’ తాజాగా ‘వై21ఎల్’ స్మార్ట్ఫోన్ను మార్కెట్లోకి విడుదల చేసింది. దీని ధర రూ.7,490 గా ఉంది. ఫన్టచ్ 2.5 ఓఎస్ ఆధారిత ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టమ్పై పనిచేసే ఈ స్మార్ట్ఫోన్లో 4జీ, 4.5 అంగుళాల స్క్రీన్, క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ ప్రాసెసర్, 1 జీబీ ర్యామ్, 16 జీబీ ఇంటర్నల్ మెమరీ, 2,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 5 ఎంపీ రియర్ కెమెరా, 2 ఎంపీ ఫ్రంట్ కెమెరా వంటి ప్రత్యేకతలు ఉన్నట్లు కంపెనీ వివరించింది.