breaking news
women suisise attempt
-
పోలీస్ స్టేషన్ ఎదుట మహిళ ఆత్మహత్యాయత్నం
ఆళ్లగడ్డ టౌన్ : పట్టణంలోని కొత్త మసీదు ప్రాంతానికి చెందిన రమీజాబీ శనివారం పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. రమీజాబీ చీటీల వ్యాపారం చేస్తుండేది. ఈ క్రమంలో ఓ వ్యక్తి చీటీ పాడాడు. పాట పాడి చాలా రోజులైనా చీటీ డబ్బులు ఇవ్వక ఇదిగో అదిగో అంటూ చెబుతుండటంతో ఆ వ్యక్తితో పాటు చీటీ భాగస్తులందరూ పోలీసులను ఆశ్రయించారు. దీంతో పోలీసులు రమీజాబీని పోలీస్ స్టేషన్కు పిలిపించడంతో అవమానంగా భావించి స్టేషన్ ఎదుట పురుగుల మందు తాగింది. గమనించిన బంధువులు ఆమెను స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో నంద్యాల వైద్యశాలకు తరలించారు. -
పోలీస్ స్టేషన్లో మహిళ ఆత్మహత్యాయత్నం
పద్మావతి నగర్ లోని మహిళా పోలీస్ స్టేషన్లో ఆదివారం ఉదయం రాధిక అనే మహిళ నిద్రమాత్రలు మింగి ఆత్మాహత్యకు ప్రయత్నించారు. గమనించిన పోలీసులు హుటాహుటిన ఆమెను రుయా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు తెలిసింది. రెండో పెళ్లి చేసుకొని తనను నిర్లక్ష్యం చేస్తోన్న భర్తపై ఫిర్యాదుచేసేందుకు వచ్చిన తనను పోలీసులు అవహేళన చేశారని బాధితురాలు రాధిక ఆరోపించారు. పోలీసుల తీరు వల్లే తాను ఆత్మహత్యకు ప్రయత్నించినట్లు వివరించారు.