breaking news
wedding rings
-
పెళ్లి పీటలు ఎక్కాల్సిన వారికి.. కన్నీటి వీడ్కోలు
త్వరలో పెళ్లి పీటలు ఎక్కాల్సిన వారికి.. కన్నీటి వీడ్కోలు పలికారు. రైల్వేకోడూరు మండలం శెట్టిగుంట సమీపంలో శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో బావమరదలు మృతి చెందిన విషయం తెలిసిందే. వారి మృతదేహాలకు ఆదివారం స్వగ్రామంలో అంత్యక్రియలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ ప్రాంతంలో ఆర్తనాదాలు మిన్నంటాయి. ‘మీ పెళ్లి చేసి మురిసిపోదామనుకుంటే.. ఇలా జరిగిందేమిటి!’.. దేవుడా అంటూ కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోదించారు. బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు విషాద వదనంలో మునిగిపోయారు.ఓబులవారిపల్లె : చిన్ననాటి నుంచి కలిసి పెరిగారు. యుక్త వయస్సు రాగానే ప్రేమించుకొని పెద్దలను ఒప్పించి వివాహానికి సిద్ధమయ్యారు. రెండు నెలల్లో పెళ్లి.. అంతలోనే మృత్యుఒడికి చేరుకున్నారు. మరణంలోనూ వారు ఒకరికొకరు తోడుగా వెళ్లిపోయారు. రైల్వేకోడూరు మండలం శెట్టిగుంట సమీపంలో శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఇద్దరి విషాద గాథ ఇది. వివరాల్లోకి వెళ్తే.. మండల కేంద్రంలోని వైకోట రోడ్డు సమీపంలో నివాసం ఉంటున్న రిటైర్డ్ కండక్టర్ వనమాల శ్రీనివాసులు, వనమాల ప్రభావతికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. పెద్దకుమారుడు అజయ్ కృష్ణ, చిన్న కుమారుడు సాయి కృష్ణ. పెద్ద కుమారుడు అజయ్ చిట్వేలి గ్రామానికి చెందిన సాతుపాడి నాగయ్య నాల్గవ కుమార్తె మాధవిని వివాహం చేసుకున్నాడు. మాధవి తల్లిదండ్రులు ఇద్దరూ అప్పటికే చనిపోయి ఉండటంతో.. తన చిన్న చెల్లెలు అనితను చిన్నప్పుడే తనతోపాటు అత్తగారింటికి తీసుకొచ్చింది. అనిత ఇక్కడే హైసూ్కల్లో చదివి పుల్లంపేటలో ఇంటరీ్మడియెట్ పూర్తి చేసింది. నవమాల శ్రీనివాసులు రెండవ కుమారుడు సాయి కృష్ణ డిగ్రీ వరకు చదివాడు. చిప్పన్పటి నుంచి సాయి కృష్ణ, అనిత ఇద్దరూ కలిసి పెరగడంతో వారి మధ్య ప్రేమ చిగురించింది. పెద్దలు మొదట్లో ఒప్పుకోకపోయినా.. తర్వాత ఒప్పించి వివాహం చేసుకునేందుకు సిద్ధమయ్యారు. ఇంకా రెండు నెలలకు అనిత మైనార్టీ తీరిన తరువాత వివాహం చేద్దామని పెద్దలు నిర్ణయించుకొని అన్ని సిద్ధం చేసుకున్నారు.కబళించిన రోడ్డు ప్రమాదంఈ క్రమంలో విధి వీరి జీవితాలతో ఆడుకుంది. సాయికృష్ణ (24)కు రైల్వేకోడూరు ప్రైవేటు ఫైనాన్స్ కంపెనీలో ఇటీవల ఉద్యోగం వచ్చింది. చేరేందుకు స్కూటీపై శనివారం రైల్వేకోడూరుకు వెళ్లాడు. అక్కడ ఉండేవారు తిరుపతికి వెళ్లాలని చెప్పడంతో తిరుపతికి వెళ్లాడు. ఇంటి వద్ద ఉన్న మరదలు అనిత నంద్యాల డెమో రైలులో తిరుపతికి వెళ్లింది. ఇద్దరు కలిసి తిరుపతిలో ఉంటున్న అజయ్ కృష్ణతో మాట్లాడారు. సాయంత్రం అనిత, సాయికృష్ణ స్కూటీపై తిరుపతి నుంచి ఇంటికి బయలు దేరారు. రైల్వేకోడూరు మండలం శెట్టిగుంట సమీపానికి రాగానే.. వేగంగా ఎదురుగా వచ్చిన గుర్తు తెలియని లారీ ఢీకొంది. ఇద్దరిపై నుంచి లారీ వెళ్లడంతో వారు అక్కడికక్కడే మృతి చెందారు. మృతదేహాలు రోడ్డుపై చెల్లాచెదురుగా పడ్డాయి. ఓబులవారిపల్లిలోని ఆస్పత్రిలో ఆదివారం ఉదయం మృతదేహాలకు పోస్టు మార్టం నిర్వహించారు. అనంతరం స్వగ్రామంలో అంత్యక్రియలు నిర్వహించారు. అందరితో కలిసి మె లిసి మంచి వాడు అన్న పేరు ఉన్న సాయికృష్ణ మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నా యి. బంధువులు, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా రోదించారు. మృతదేహాలను సర్పంచ్ ఎన్పీ జయపాల్రెడ్డి సందర్శించి నివాళులు అరి్పంచారు. బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. -
కొండ చిలువలే పెళ్లిదండలైన వేళ..
అందరిలా మామూలుగా దండలు, ఉంగరాలు మార్చుకుని పెళ్లి చేసుకుంటే ఏమొస్తుంది అనుకున్నారా యువజంట. అందుకే పదిమందినీ పిలిచారు.. అబ్బాయి సూటులోను, అమ్మాయి పెళ్లి గౌనులోను వచ్చారు. మధ్యలో పెళ్లి పెద్ద కూడా విచ్చేశారు. ఇక ఉంగరాలు తేవడమే తరువాయి అందరూ అనుకుంటుండగా. ఉన్నట్టుండి బంగారు వర్ణంలో గల రెండు పెద్ద కొండచిలువలను అక్కడకు తీసుకొచ్చారు. విషయం ఏమిటంటే వధూవరులిద్దరూ వన్యప్రాణి ప్రేమికులు. దాంతో జిలిన్ రాష్ట్రంలో జరిగే తమ పెళ్లిని వైవిధ్యంగా చేసుకోవాలనుకున్నారు. అందుకే వాళ్లు దండలు, ఉంగరాలకు బదులు రెండు పెద్ద కొండ చిలువలను మార్చుకున్నారు. ఆ రెండు కొండ చిలువల్లో ఒకటి 30 కిలోలు, మరొకటి 15 కిలోల బరువున్నాయి. అవి తమ బంధానికి ప్రతీకలని వాళ్లు చెబుతున్నారు. వాళ్లు ఇలా కొండ చిలువలను మార్చుకున్న వీడియో చైనా సోషల్ మీడియా వైబోలో విపరీతంగా వైరల్ అయింది. ముందుగా మెడలో బంగారు రంగు కొండ చిలువను వేసుకున్న వరుడు కనిపిస్తాడు. తర్వాత పక్కన ఉన్న మరో వ్యక్తి సాయంతో ఓ పెద్ద కొండ చిలువను తీస్తాడు. దాన్ని పెళ్లికూతురికి ఇవ్వగా, ఆమె దాన్ని తన మెడలో వేసుకుంటుంది. తర్వాత ఇద్దరూ కౌగలించుకోగా.. ఒక కొండ చిలువ వాళ్లిద్దరి చుట్టూ అల్లుకుంటుంది. తాను జంతుప్రేమికుడినని పెళ్లి కొడుకు వు జియాన్ ఫెంగ్ ఆ తర్వాత చెప్పాడు. వన్యప్రాణులను సంరక్షించాలనే తాము ఇలా కొండ చిలువలు మార్చుకున్నామని అతడు తెలిపాడు. ఎప్పుడైనా కొండ చిలువలు కనిపిస్తే వాటిని కొట్టొద్దని.. అవి చాలా మంచివని అన్నాడు. 30 కిలోల కొండ చిలువను పెళ్లికూతురు జియాంగ్ స్యూ ధరించగా, అతడు మాత్రం 15 కిలోల కొండచిలువను ధరించాడు. వీళ్లు తమ ఇంట్లో పలు పాములు, సాలీళ్లు, బల్లులు, కొండ చిలువలు, పక్షులు.. ఇలా అన్నింటినీ పెంచుతారట. నిజానికి బంగారు రంగులో ఉన్నది.. బర్మా జాతికి చెందిన కొండ చిలువేనట. అయితే ఆల్బినో కావడంతో అది ఆ రంగులోకి మారింది. అరుదైన జాతికి చెందిన ఈ కొండ చిలువ పూర్తిగా పెరిగితే 23 అడుగుల వరకు ఉంటుంది. మన దేశంలో అయితే వన్యప్రాణులను ఇళ్లలో పెంచుకోవడం నేరం గానీ, చైనాలో మాత్రం దాన్ని ఎంచక్కా అనుమతిస్తారు. -
కొండ చిలువలే పెళ్లిదండలైన వేళ..