-
ఎయిర్ ఇండియా విమానంలో వాటర్ లీక్ - వీడియో వైరల్
వర్షం పడినప్పుడు సాధారణంగా బస్సులోనో లేదా ట్రైన్లలోనో నీరు లోపలి రావడం గమనించి ఉంటారు. ఇటీవల సోషల్ మీడియాలో వెల్లడైన ఒక వీడియోలో ఎయిర్ ఇండియా విమానంలో నీరు కారడం చూడవచ్చు. నెట్టింట్లో వైరల్ అవుతున్న ఈ వీడియూయో చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు. జాయిస్ అనే ట్విటర్ యూజర్ షేర్ చేసిన 45 సెకన్ల వీడియోలో.. నీరు విమానం లోపల కారడం చూడవచ్చు. ఆ సమయంలో ప్రయాణికులు చాలావరకు నిద్రపోతున్నట్లు తెలుస్తోంది. నీరు లోపలికి రావడానికి కారణం సాంకేతిక లోపమా? లేదా నిర్వహణలో నిర్లక్ష్యమా అనేది తెలియాల్సి ఉంది. నవంబర్ 29న ఢిల్లీ నుంచి లండన్ వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానంలో ఈ సంఘటన జరిగినట్లు తెలుస్తోంది. లోపలికి వస్తున్న నీటిని ఆపడానికి సిబ్బంది ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. ఈ వీడియోని ఇప్పటి వరకు వేల మంది వీక్షించగా, మరి కొందరు తమదైన రీతిలో కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఇదీ చదవండి: నయనతార కోసం ఖరీదైన గిఫ్ట్ ఇచ్చిన భర్త.. ఫోటోలు వైరల్ ఈ వీడియోలో గమనించినట్లయితే.. లోపలికి వస్తున్న నీరు ప్రయాణికుల మీద పడలేదు, అయినప్పటికీ కొందరు ప్యాసింజర్లు ఇబ్బంది పడ్డారని తెలుస్తోంది. ఇప్పటి వరకు ఎయిర్ ఇండియా ఈ సంఘటన మీద స్పందించకపోవడం గమనార్హం. విమానంలో నీరు కారటం బహుశా ఇదే మొదటిసారి అయి ఉంటుందని పలువురు భావిస్తున్నారు. Air India …. fly with us – it's not a trip … it's an immersive experience pic.twitter.com/cEVEoX0mmQ — JΛYΣƧΉ (@baldwhiner) November 29, 2023 -
తస్మాత్.. జాగ్రత్త !!
– హంద్రీ–నీవా నీటితో కళకళలాడుతున్న జీడిపల్లి, గొల్లపల్లి రిజర్వాయర్లు, 45 చెరువులు – విహారయాత్రలు, ఈత కొడుతూ ఇటీవల మృతి చెందిన వారు 27మంది – వేసవి కావడం, చెరువుల్లో నీళ్లు ఉండటంతో ఈతకు వెళుతున్న యువత – పూడికతో ప్రమాదకర స్థాయిలో చెరువులు, రిజర్వాయర్లు – ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా ప్రాణాలు కోల్పోయే ప్రమాదం సాక్షిప్రతినిధి, అనంతపురం : ‘గుక్కెడు నీటి కోసం అల్లాడిపోయే ‘అనంత’లో పడవ ప్రమాదం జరిగిందంటే అంతా ‘మన జిల్లాలో పడవ ప్రమాదమేంటి?’ అని సర్వత్రా మొదట సంశయపడ్డారు. ఆపై ‘హంద్రీ–నీవా ద్వారా చెరువుల్లోకి నీరు వచ్చింది నిజమే!’ అనుకున్నారు. కరువు జిల్లాలో కూడా ప్రస్తుతం రిజర్వాయర్లు, చెరువులు హంద్రీ–నీవా నీటితో కళకళలాడుతున్నాయి. ఐదేళ్లుగా హంద్రీ–నీవా నీరు జీడిపల్లి రిజర్వాయర్తో పాటు చెరువులకు పంపిణీ చేస్తున్నారు. ఐదునెలల కిందట గొల్లపల్లి రిజర్వాయర్ కూడా హంద్రీ–నీవా నీటితో జలకళను సంతరించుకుంది. కరువు జిల్లాలో చెరువులు నిండుకుండలా ఉండటం సంతోషకరం! భూగర్భజలాలు పెరిగి తాగు, సాగునీటి సమస్యలు తీరుతాయి. అయితే ఈ నీటితోనే ఇటీవల 27మంది ప్రాణాలు కోల్పోయారు. యువకులు సరదాగా రిజర్వాయర్లు, చెరువుల్లోకి ఈతకు వెళ్లడం, ప్రమాదవశాత్తు మృతి చెందడం ఇటీవల అధికంగా జరుగుతోంది. శుక్రవారం ఒక్కరోజే రెండు వేర్వేరు ఘటనల్లో 16 మంది జలసమాధి అయ్యారంటే ప్రమాదాల తీవ్రత ఏ స్థాయిలో ఉందో ఇట్టే తెలుస్తోంది. ఈ పరిణామం ప్రస్తుతం ఆందోళన రేకిత్తిస్తోంది. సరదా తీసిన ప్రాణాలు 27 హంద్రీ–నీవా ద్వారా 2012లో జీడిపల్లి రిజర్వాయర్కు నీళ్లొచ్చాయి. అప్పటి నుండి జిల్లాలోని చెరువులను కృష్ణాజలాలతో అధికారులు నింపుతున్నారు. గతేడాది కృష్ణాలో నీటి లభ్యత అధికంగా ఉండటంతో 28 టీఎంసీలు జిల్లాకు చేరాయి. ఈ నీటిని ఆయకట్టుకు ఇవ్వకుండా మొత్తం చెరువులు నింపారు. పీఏబీఆర్, ఎంపీఆర్ పరిధిలో 45 చెరువులకు ఈ నీటిని తరలించారు. దీంతో జిల్లాలో జీడిపల్లి, గొల్లపల్లితో పాటు 45 చెరువుల్లో జలకళ సంతరించుకుంది. అనంతపురం జిల్లాలో కనీసం ఈత కొడదామన్న ఎక్కడా నీటిజాత కన్పించదు. ఈ క్రమంలో రిజర్వాయర్లు, చెరువుల్లో నీరు కన్పించడంతో ‘అనంత’ యువత సరదా విహారయాత్రలకు వెళుతోంది. అయితే చెరువులు తక్కువ లోతులో ఉండటం, దిగువభాగంలో మట్టి బాగా తడిచి పూడికలా మారడంతో ఈతకు వెళ్లినవారు నీటి దిగువకు వెళితే అందులో ఇరుక్కుపోయి మృత్యువాత పడుతున్నారు. ఇటీవల 27మంది ఇలా ప్రమాదాలకు గురే ప్రాణాలు కోల్పోయారు. – బెంగళూరుకు చెందిన సద్దాం, సల్మాన్ అనే ఇద్దరు యువకులు హిందూపురంలో వివాహం చేసుకున్నారు. ఫిబ్రవరి 19న గొల్లపల్లి రిజర్వాయర్లో సరదాగా ఈతకొట్టేందుకు వచ్చారు. ప్రమాదవశాత్తు మృత్యువాత పడ్డారు. – ఈ నెల 23న గోరంట్లకు చెందిన దాదాపీర్ అనే వ్యక్తి ఈతకొట్టేందుకు గొల్లపల్లికి వచ్చి జలసమాధి అయ్యారు. – గతేడాది ఆగస్టు 23న ప్రదీప్ (18) కృష్ణాపుష్కరాలు చివరి రోజు జీడిపల్లి రిజర్వాయర్కు వచ్చి గల్లంతయ్యాడు. అనంతపురానికి చెందిన ప్రదీప్ స్నేహితులతో కలిసి వచ్చి తెల్లవారేసరికి శవంగా తేలారు. జీడిపల్లి రిజర్వాయర్లో ఇప్పటి వరకూ ఎనిమిది మంది చనిపోయారు. శుక్రవారం ఒక్కరోజే 16మంది మృత్యువాత: శుక్రవారం ఒక్కరోజు 16మంది మృత్యువాతపడ్డారు. గుంతకల్లు మండలం వైటీ చెరువులో ప్రమాదవశాత్తు తెప్ప బోల్తాపడి 14మంది చనిపోయారు. వీరిలో 10మంది చిన్నారులు. నలుగురు మహిళలు. సరదాగా చెరువులోకి వెళ్లిన వీరు పరిమితికి మించి తెప్పేలో ప్రయాణించడంతో ప్రమాదం జరిగింది. ఇదే రోజు విడపనకల్లు మండలం హావళిగిలో చెరువులో పూజ, తులసి అనే చిన్నారులు చనిపోయారు. వేసవిలో రిజర్వాయర్ల వద్దకు క్యూ కడుతున్న వైనం: చెరువుల్లో, రిజర్వాయర్లలో మృత్యువాతపడిన వారిలో అధికశాతం యువకులు, చిన్నారులే! ఈతకొట్టేందుకు వచ్చి ప్రమాదవశాత్తు చనిపోతున్నారు. జీడిపల్లిలో కొంతమంది తెప్పెలు నిర్వహిస్తున్నారు. విహారయాత్రకు వచ్చిన వారిని సరదాగా రిజర్వాయర్లో తిప్పుతున్నారు. ఇక్కడ కూడా పరిమితికి మించి ఎక్కువగా తీసుకెళితే ప్రమాదం జరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం వేసవి సెలవులు కావడంతో పల్లెలు, పట్టణాల నుంచి జీడిపల్లి, గొల్లపల్లికి వెళ్లే వారి సంఖ్య అధికమే! కుటుంబసమేతంగా భోజనాలు చేసుకుని సరదాగా గడిపేందుకు వెళుతున్నారు. సెలవులతో పట్టణాల నుంచి పల్లెల్లోని బంధువుల ఇళ్లకు వచ్చిన వారు కూడా సమీపంలోని చెరువుల్లో సరదాగా ఈత కొడుతున్నారు. వీరు ఏమాత్రం జాగ్రత్తలు తీసుకోకపోయినా మృత్యువాతపడే ప్రమాదముంది. చెరువుల్లో పూడికప్రాంతాలున్నాయా? ఈతకు వెళ్లేందుకు అనువుగా ఉందా? లేదా అనేది చూసుకోవాలి. చిన్నపిల్లలు చెరువులోకి వెళ్లకుండా పెద్దలు అప్రమత్తంగా ఉండాలి. లేదంటే వైటీ చెరువు లాంటి ఘటనలు జరిగే ప్రమాదముంది. అధికారులు కూడా సెలవులను దృష్టిలో పెట్టుకుని గొల్లపల్లి, జీడిపల్లి రిజర్వాయర్ల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేయాల్సి ఉంది. బోటింగ్కు తీసుకెళ్లేవారికి కూడా పరిమితికి మించి తీసుకెళ్లకూడదని సూచనలు ఇవ్వాలి. అధికలోతుకు వెళ్లకుండా జెండాలు పాతి హెచ్చరిక బోర్డులు కూడా ఏర్పాటు చేయాలి. వేసవి దాటేంత వరకూ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. -
ఎడారి ‘రాజ’ నగరం
మనిషి తలుచుకుంటే అసాధ్యమంటూ లేదనడానికి ఈ మహానగరమే నిదర్శనం. ఆకాశాన్నంటే భవనాలు.. రాజ సౌధాలను తలపించే కట్టడాలు.. నగరం మధ్యలో నీటి సరస్సులు.. ఇవన్నీ ఎడారి రాజ్యంలో ఎర్ర సముద్రపు ఒడ్డున నిర్మించతలపెట్టిన ఓ మహానగరం సోయగాలు. దీనికయ్యే ఖర్చు ఎంతో తెలుసా..? అక్షరాలా 6 లక్షల కోట్లు. 20 లక్షల మంది నివసించేందుకు వీలుగా సకల సదుపాయాలు, అన్ని హంగులతో ఈ నగరాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేస్తున్నారు. దాదాపు 110 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉండే ఈ నగరం పేరు కింగ్ అబ్దుల్లా ఎకానమిక్ సిటీ.. వాషింగ్టన్ నగరమంత పెద్దగా ఉంటుందట.. సౌదీ అరేబియా రాజధాని జెడ్డాకు 100 కి.మీ దూరంలో ఈ నగరాన్ని నిర్మిస్తున్నారు. ఇంతవరకూ 15 శాతం మాత్రమే పూర్తయిన ఈ నగరం త్వరలోనే పర్యాటకులను ఆకర్షించనుంది.
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
IPL 2024: ఇవెక్కడి క్యాచ్లు రా బాబు.. చూస్తే ఫ్యూజ్లు ఎగిరిపోవాల్సిందే..!
'ఛీ, నీ బతుకు'.. చురకలంటించిన కలర్స్ స్వాతి
12 పరుగులకే ఆలౌట్.. టీ20ల్లో రెండో అత్యల్ప స్కోర్
జగనన్న పాలనతో పెత్తందార్ల కడుపు మండుతోంది: నాగార్జున యాదవ్
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం
ఆది సాయికుమార్ కొత్త మూవీ.. గోవాలో మ్యూజిక్ సిట్టింగ్స్
కాంగ్రెస్కు శామ్ పిట్రోడా రాజీనామా
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
ఫ్రెండ్ కోసం పెళ్లినే వాయిదా వేసుకున్న హీరోయిన్ (ఫోటోలు)
ఓట్ల తాయిలాలు షురూ.. బీజేపీపై దీదీ ఫైర్
తప్పక చదవండి
- భారత్లోకి గూగుల్ వాలెట్ వచ్చేసింది.. ఎలా వాడొచ్చంటే?
- ఓట్ల తాయిలాలు షురూ.. బీజేపీపై దీదీ ఫైర్
- ఒక్క క్లిక్తో ‘ఏపీ పాలిసెట్’ ఫలితాలు
- సుప్రీత మైండ్ బ్లోయింగ్ గ్లామర్.. ఫారెన్ వీధుల్లో కేతిక!
- పిట్రోడా వ్యాఖ్యల దుమారం.. నిర్మలా సీతారామన్ ఆగ్రహం
- పవన్ మూవీ రిలీజ్ డేట్కి టెండర్ వేసిన 'దేవర'?
- టీ20 వరల్డ్కప్ 2024 కోసం భారత బి టీమ్.. కెప్టెన్గా కేఎల్ రాహుల్..!
- ‘నోరు మెదపరేం రాహుల్జీ?’..ప్రధాని మోదీ విమర్శలు
- ల్యాండ్ టైట్లింగ్ చట్టం నిజాలివిగో..
- బాబోస్తే ఆరోగ్యశ్రీ గో..వింద
Advertisement