breaking news
waiver incorrect
-
సుప్రీంకోర్టు రిపోర్టర్కు లా డిగ్రీ అక్కర్లేదు
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టులో అక్రిడేషన్కు దరఖాస్తు చేసుకొనే రిపోర్టర్లు తప్పనిసరిగా న్యాయవిద్యను అభ్యసించి ఉండాలనే నిబంధనను ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ ఎత్తివేశారు. ‘సుప్రీంకోర్టు వార్తలను కవర్ చేసే రిపోర్టర్లకు లా డిగ్రీ ఉండాలనే నిబంధన ఎందుకు పెట్టారో తెలియదు. దాన్ని ఎత్తివేస్తూ ఫైల్పై సంతకం చేశాను. ఇక మరింత మంది సుప్రీంకోర్టు అక్రిడేషన్ పొందొచ్చు’ అని సీజేఐ చంద్రచూడ్ గురువారం విలేకరులతో మాట్లాడుతూ చెప్పారు. నవంబరు 10వ తేదీన పదవీ విరమణ చేయనున్న జస్టిస్ చంద్రచూడ్ తన హయాంలో పలు సంస్కరణలు తెచ్చారు. ఈ–ఫైలింగ్ను ప్రవేశపె ట్టారు. హైబ్రిడ్ విచారణ పద్ధతి (ప్రత్యక్ష విచా రణ, ఆన్లైన్ విచారణలను కలగలిపి) తెచ్చారు. వాయు కాలుష్యానికి మార్నింగ్ వాక్ ఆపేశాదేశ రాజధానిలో పెరిగిపోతున్న వాయు కాలుష్యాన్ని దృష్టిలో పెట్టుకొని మార్నింగ్ వాక్ను ఆపేశానని సీజేఐ చంద్రచూడ్ తెలిపారు. శ్వాసకోస సంబంధిత వ్యాధులు రాకుండా ఉండాలంటే ఇంటికే పరిమితం కావాలని డాక్టర్ తనకు సూచించారని వెల్లడించారు. ‘ఈ రోజు నుంచే మార్నింగ్ వాక్ ఆపేశా. సాధారణంగా ఉదయం 4–4.15కు మార్నింగ్ వాక్కు వెళతా’ అని తెలిపారు. -
అదానీ జరిమానా రద్దు చేయలేదు
న్యూఢిల్లీ: ముద్రాపోర్ట్ నిర్మాణ సమయంలో అదానీ పోర్ట్ సెజ్ లిమిటెడ్ పై విధించిన భారీ జరిమానాను రద్దుచేసి ఎన్డీయే ప్రభుత్వం అదానీ కి భారీ ఊరట నిచ్చిందనే వార్తలపై కేంద్రం స్పందించింది. పర్యావరణ నష్టం కింద అదానీకి విధించిన రూ.200 కోట్ల జరిమానాను కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ రద్దుచేసిందనే వార్తను పర్యావరణ శాఖ ఖండించింది. అది "తప్పు" వార్తని మంత్రిత్వ శాఖ కొట్టి పారేసింది. నష్టనివారణ కోసం, పర్యావరణ పునరుద్ధరణ పరిరక్షణ కోసం సునీతా నారాయణ్ కమిటీ ప్రతిపాదించిన రూ .200 కోట్ల జరిమానాను అదానీ భరించాల్సిందేనని తేల్చి చెప్పింది. జరిమానా రద్దు కాలేదని ప్రకటించడంతో పాటూ, ఈ వ్యవహారంలో ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉందని మంత్రిత్వ శాఖస్పష్టం చేసింది. పునరుద్ధరణ నిధికి రూ .200 కోట్ల గ్రీన్ పెనాల్టీపై వెనక్కి లేదని స్పష్టం చేసింది. ప్రాజెక్ట్ ప్రతిపాదకుడు అదానీపై మరింత తీవ్రమైన బాధ్యతను పెట్టినట్టు వివరించింది. దీనికితోడు ఈ జరిమానా వసూలు ప్రక్రియలో చట్టబద్దమైన చర్యలకు ప్రణాళిక రూపొందించాల్సిందిగా నోటీసులు జారీ చేశామని తెలిపింది. కాగా ముద్రా ప్రాజెక్టు సైట్ పర్యావరణకు నష్టం చేకూరుస్తుందనే ఆరోపణలను కాంగ్రెస్ హయాంలో అదానీ ఎదుర్కొంది. దీనిపై విధించిన సునీతా నారాయణ్ కమిటీ ప్రతిపాదనలను 2013లో అప్పటి మంత్రిత్వ శాఖ ఆమోదించింది. పర్యావరణానికి ముప్పు కల్గించినందుకు గ్రీన్ పెనాల్టీ కింద అదానీకి రూ.200 కోట్ల డాలర్లు లేదా ప్రాజెక్టు ధరల్లో 1శాతం ఏది ఎక్కువైతే అది జరిమానా చెల్లించాలని కమిటీ ప్రతిపాదించింది. అయితే యూపీఏ హయాంలో అతిపెద్ద గ్రీన్ పెనాల్టీనీ ఎన్డీయే ప్రభుత్వం రద్దుచేసిందనీ, అదేవిధంగా 2009లో గుజరాత్ లో కంపెనీ వాటర్ పోర్ట్ డెవలప్ మెంట్ ప్రాజెక్టుకు జారీచేసిన ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ ను పొడిగించి, అదానీ భారీ ఊరట కల్పించిందని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.