నాటా ఆధ్వర్యంలో వాలీబాల్ టోర్నమెంట్
న్యూజెర్సీ : నాటా ఆధ్వర్యంలో వాలీబాల్ టోర్నమెంట్ -2015 ను నిర్వహించారు. తూర్పు బర్న్స్విక్ లోని బై సెంటెన్నియల్ పార్క్లో నిర్వహించిన ఈ ఈవెంట్లో 24 జట్ల తరఫున మొత్తం 500 మంది ఆటగాళ్లు పాల్గొన్నారు. అయితే తొలిసారిగా మహిళలు కూడా ఈ టోర్నీలో పాల్గొన్నారు. ఈ టోర్నమెంట్కు రేవెన్ ఐటీ సొల్యూషన్స్ ఎల్ఎల్సీ స్పాన్సర్గా వ్యవహరించింది.
మోహన్ మల్లమ్ అధ్యక్షతన, ప్రేమ్ రెడ్డి సహకారంతో ఈ మెగా టోర్నీ నిర్వహించారు. రాజేశ్వర్ రెడ్డి, రాఘవరెడ్డి, హరి వెల్కర్ (కోశాధికారి), శ్రీనివాస్ గనగోని(జాయింట్ సెక్రటరీ), అన్నా రెడ్డి సభ్యులుగా కొనసాగారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన న్యూజెర్సీ కమిషనర్ ఉపెంద్ర చివుకుల అన్ని జట్ల ఆటగాళ్లను ఎంతో ప్రోత్సహించారు. ఈవెంట్ నిర్వహించిన నాటా వారికి కృతజ్ఞతలు తెలిపారు.
విజేతలు వీరే
మేజర్ విభాగంలో విజేతలు - ఎన్బీ కింగ్స్ - క్యాష్ ప్రైజ్ - 750 అమెరికా డాలర్లు
మేజర్ విభాగంలో రన్నరప్ - పిస్కాస్టవే - క్యాష్ ప్రైజ్ - 500 అమెరికా డాలర్లు
మైనర్ విభాగంలో విజేతలు - ఎడిసన్ వీబీటీ జట్టు
మైనర్ విభాగంలో రన్నరప్ - లేహై వారియర్స్ జట్టు