breaking news
voice tariff
-
రూ.104 ప్యాక్ : వన్ ఇయర్ వ్యాలిడిటీ
టెలికాం దిగ్గజాలకు షాకిస్తూ ఎయిర్సెల్ బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఏడాది కాలం పాటు వ్యాలిడిటీతో కొత్త వాయిస్ టారిఫ్ రూ.104ను ప్రకటించింది. ఈ కొత్త టారిఫ్ కింద కాల్ రేట్లను నిమిషానికి 20 పైసలకి తగ్గించింది. ఈ తగ్గించిన రేట్లు ఎస్టీడీ, లోకల్ కాల్స్ అన్నింటికీ వర్తించనున్నట్టు పేర్కొంది. అమెజాన్తో భాగస్వామ్యం ఏర్పరుచుకుని అపరిమిత కాలింగ్ ప్లాన్ రీఛార్జ్లపై క్యాష్బ్యాక్లను ప్రకటించిన అనంతరం ఈ కొత్త ప్యాక్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. అయితే ఈ ప్యాక్ కేవలం ఢిల్లీ సర్కిల్లోని ఎయిర్సెల్ సబ్స్క్రైబర్లకు మాత్రమే ప్రస్తుతం అందుబాటులో ఉంచింది. నిమిషానికి 20 పైసల టారిఫ్ను లాంచ్ చేయడంతో, కేవలం పాత కస్టమర్లతో తమ సంబంధాలు మెరుగుపడటమే కాకుండా.. కొత్త టెలికాం యూజర్లు ఎయిర్సెల్ను ఎంపిక చేసుకునేలా చేయనున్నామని కంపెనీ నార్త్ రీజనల్ హెడ్ హరీష్ శర్మ చెప్పారు. అంతకముందు కూడా ఎయిర్సెల్ రూ.88తో వీక్ ప్లాన్ను లాంచ్ చేసింది. దీని కింద రోజుకు 1జీబీ డేటాతో పాటు అపరిమిత కాల్స్ను ఆఫర్ చేస్తోంది. 28 రోజుల కోసం రూ.199 ప్లాన్ను ప్రవేశపెట్టింది. ఎయిర్టెల్, బీఎస్ఎన్ఎల్, రిలయన్స్ జియో, వొడాఫోన్లకు గట్టి పోటీ ఇవ్వడానికి ఎయిర్సెల్ ఈ ప్లాన్ను తీసుకొచ్చింది. టెలికాం దిగ్గజాల దెబ్బకు నష్టాల పాలైన ఎయిర్సెల్, ఆర్కామ్తో విలీనమవ్వాలని అనుకుంది. కానీ ఇటీవలే ఈ రెండు కంపెనీల విలీన చర్చలు సఫలమయ్యాయి. -
రంజాన్ కు ఎయిర్ సెల్ స్పెషల్ ఆఫర్స్
న్యూఢిల్లీ : రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని ఎయిర్ సెల్ తన కస్టమర్ల కోసం ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. స్పెషల్ రంజాన్ ప్యాక్ కింద టాక్ టైమ్ లాభాలతో పాటు రాత్రిపూట వాయిస్ కాలింగ్ లో అత్యధిక రాయితీ టారిఫ్ లను కస్టమర్లకు ఆఫర్ చేయనున్నట్టు ఎయిర్ సెల్ తెలిపింది. ఢిల్లీలో ఎయిర్ సెల్ కొత్త ప్రొడక్ట్ కింద రూ.86 రీచార్జ్ కు రూ.86 ఫుల్ టాక్ టైమ్ ఆఫర్ ను అందిస్తోంది. దీంతో పాటు లోకల్, ఎస్ టీడీ కాలింగ్ కు రాత్రి 12 నుంచి ఉదయం 6గంటల వరకు నిమిషానికి 30 పైసల ఆఫర్ ను తీసుకొచ్చింది. ఈ ఆఫర్ 12 రోజుల పాటు వాలిడిటీలో ఉంచింది. ఐఎస్ డీ కాలింగ్ కూడా రంజాన్ ప్యాక్ కింద ఆఫర్లను ప్రకటించింది. యునిటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ), సౌదీ అరేబియాలకు సెకన్ కు 16 పైసలు, బంగ్లాదేశ్ కు సెకన్ కు 4పైసలు మాత్రమే చార్జ్ చేయనున్నట్టు తెలిపింది. ఇఫ్తార్ అనంతరం, అదేవిధంగా తెల్లవారుజామున లోకల్, ఎస్ టీడీ, ఐఎస్ డీ కాల్స్ కోసం యూజర్లు అత్యధికంగా వాడుతుంటారని, వారికోసం స్పెషల్ గా రంజాన్ ప్యాక్ ను తీసుకొచ్చినట్టు ఎయిర్ సెల్ చెప్పింది. తమ కస్టమర్లకు రంజాన్ స్పెషల్ నెల అని, భారత్ లో, విదేశాల్లో స్నేహితులతో, కుటుంబసభ్యులతో వారు ఎక్కువగా కనెక్ట్ అవుతుంటారని ఎయిర్ సెల్ నార్త్ రీజనల్ బిజినెస్ హెడ్ హరీష్ శర్మ చెప్పారు. ఈ నెలలో రాత్రిపూట ఎక్కువగా కాల్స్ డేటా నమోదవుతుందని పేర్కొన్నారు. ఈ అవర్స్ లో చాలా రిటైల్ అవుట్ లెట్లు మూసేస్తారని, దానివల్ల బ్యాలెన్స్ అయిపోయి కస్టమర్లు చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతుంటారని తెలిపారు. ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని కస్టమర్లకు సౌకర్యవంతంగా రంజాన్ ప్యాక్ కింద ఈ ఆఫర్లు ప్రకటించామని హరీష్ అన్నారు.