breaking news
vijayawada- hyderabad highway
-
హైదరాబాద్– విజయవాడ హైవే.. ఏ వాహనానికి ఎంత టోల్ చార్జీ?
టోల్ ప్లాజాల్లో సవరించిన చార్జీలు సోమవారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి వచ్చాయని జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్హెచ్ఏఐ) ప్రకటించింది. హైదరాబాద్– విజయవాడ మార్గంలోని నేషనల్ హైవే–65పై టోల్ చార్జీలు తగ్గగా, తెలంగాణ (Telangana) మీదుగా సాగే ఇతర జాతీయ రహదారులపై మాత్రం చార్జీలు పెరిగాయి.వరంగల్– హైదరాబాద్ బైపాస్ రోడ్డుపై టోల్ ప్లాజాల్లో చార్జీలు.. → కారు, జీపు, వ్యాన్, లైట్ మోటార్ వాహనం ఒక వేపు రూ.125, అప్, డౌన్ రూ.190, లైట్ కమర్షియల్ వాహనం, లైట్ గూడ్స్ వాహనం, మినీ బస్సు రూ.205, అప్, డౌన్ రూ.305, బస్సు, ట్రక్కుకు ఒక వైపు రూ.425, అప్, డౌన్ రూ.635, కమర్షియల్ వాహనం ఒక వైపు రూ.465, అప్, డౌన్ రూ.695, హెచ్సీఎం, ఈఎంఈ వాహనం ఒకవైపు రూ.665, అప్, డౌన్ రూ.1,000, ఓవర్సైజ్ వాహనం ఒక వైపు రూ.810, అప్, డౌన్ రూ.1,215, నెలవారీ పాస్ (Monthly Pass) ధర రూ.340 నుంచి రూ.350కి పెరిగింది. ఎన్హెచ్–44పై ఇందల్వాయి టోల్గేట్ వద్ద ఇలా.. → నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి టోల్ప్లాజా వద్ద కారు, జీపు, వ్యాన్ లేదా లైట్ మోటార్ వాహనాలకు సింగిల్ జర్నీకి రూ. 90గా టోల్ చార్జీ ఖరారైంది. అలాగే 24 గంటల్లోపు రిటర్న్ జర్నీకి రూ. 135, 50 సింగిల్ జర్నీలతో కూడిన మంత్లీ పాస్కు రూ. 3,035, టోల్ప్లాజాకు 20 కి.మీ. పరిధిలో ఉండి రిజిస్టర్ చేసుకున్న వాహనాలకు మంత్లీ పాస్ రూ. 350కు పెరిగాయి. → లైట్ కమర్షియల్ వాహనాలు, లైట్ గూడ్స్ వాహనాలు, మినీ బస్లకు సింగిల్ జర్నీకి రూ. 145, 24 గంటల లోపు రిటర్న్ జర్నీకి రూ. 220, మంత్లీ పాస్కు రూ. 4905లకు పెరిగాయి. → బస్లు, రెండు ఎక్సెల్ గల ట్రక్కులకు సింగిల్ జర్నీకి రూ. 310, 24 గంటల లోపు రిటర్న్ జర్నీకి రూ. 465, మంత్లీ పాస్కు రూ.10,280 లకు పెరిగాయి. → హెవీ కన్స్ట్రక్షన్ వాహనాలు, ఎర్త్ మూవింగ్ వాహనాలు, మల్టీపుల్ ఎక్సల్ వాహనాలకు సింగిల్ జర్నీకి రూ.485, 24 గంటల లోపు రిటర్న్ జర్నీకి రూ.725, మంత్లీ పాస్కు రూ.16,120 లకు పెరిగాయి. చదవండి: హైదరాబాద్– విజయవాడ హైవేపై టోల్ చార్జీలు ఎందుకు తగ్గాయి?→ ఏడు ఎక్సెల్లు కలిగి ఉన్న భారీ వాహనాలకు సింగిల్ జర్నీకి రూ. 590, 24 గంటల లోపు రిటర్న్ జర్నీకి రూ.885, మంత్లీ పాస్కు రూ. 19,625లకు చార్జీలు (Charges)పెరిగాయి. -
దట్టంగా పొగమంచు.. ట్రాఫిక్ అంతరాయం
సాక్షి, హైదరాబాద్ : హైదరాబాద్తో పాటు పలు జిల్లాలలో పొగమంచు దట్టంగా అలుముకుంది. వెలుతురు సరిగా లేని కారణంగా వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. నల్గొండ జిల్లాలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. దీంతో విజయవాడ-హైదరాబాద్ హైవేపై ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. మరోవైపు హైదరాబాద్ నగరం మంచు దుప్పటితో మూసుకుపోయింది. నగర్ శివారు ప్రాంతం హయత్ నగర్ పరిసర ప్రాంతాలు ఉదయం తొమ్మిది గంటలు దాటిన తరువాత కూడా సూర్యుడు రాకుండా మంచుతో నిండి ఉండటంతో జాతీయ రహదారి పై వెళ్లే వాహనదారులకి ముందుగా వెళుతున్న వాహనాలు కనపడక తీవ్ర ఇబ్బంది పడుతూ వాహనాలకు లైట్లు వేసుకొని వెళ్ల వలసిన పరిస్థితి ఏర్పడింది. అయితే గత వారం పది రోజుల నుండి చలి బాగా పెరగటంతో ఇలాంటి పరిస్థితి ఏర్పడినట్లు తెలుస్తుంది. -
హైవేపై బారులు తీరిన వాహనాలు
విజయవాడ: విజయవాడ- హైదరాబాద్ హైవేపై వాహనాలు బారులు తీరాయి. కృష్ణానదిలో పుణ్య స్నానం ఆచరించడానికి భక్తులు పెద్ద ఎత్తున తరలిరావడంతో హైవేపై వాహనాలు పెద్ద సంఖ్యలో నిలిచిపోయాయి. ప్రభుత్వం ఏర్పాటు చేసిన పార్కింగ్ స్థలాలన్నీ వాహనాలతో నిండిపోవడంతో కొత్తగా వస్తున్న వాహనాలకు స్థలం లేక రోడ్డుపైనే ఆపేయడంతో.. ట్రాఫీక్కు తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఇదిలా ఉండగా.. జగ్గయ్యపేట, నందిగామ టోల్గేట్ల వద్ద తెల్లవారుజాము నుంచే వాహానాల రద్దీ విపరీతంగా ఉంది. -
డివైడర్ను ఢీకొట్టిన కారు: ముగ్గురు విద్యార్థుల మృతి
మునగాల: విజయవాడ- హైదరాబాద్ జాతీయ రహదారిపై ముగ్గురు విద్యార్థులు దుర్మరణం చెందారు. విజయవాడ నుంచి హైదరాబాద్ వస్తున్న కారు శుక్రవారం ఉదయం నల్లగొండ జిల్లా మునగాల మండలం ముకుందాపురం వద్ద ప్రమాదానికి గురైంది. వేగంగా ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి డివైడర్ ను ఢీకొట్టినట్లు స్థానికులు తెలిపారు. మొత్తం ఐదుగురు విద్యార్థులు కారులో ప్రయాణిస్తుండగా.. ముగ్గురు అక్కడికక్కడే చనిపోయారు. క్షతగాత్రులను కోదాడలోని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సిఉంది.