breaking news
Viagra pills
-
ఎయిర్పోర్టులో 3,200 వయగ్రా పిల్స్..
వాషింగ్టన్ : 3,200 వయగ్రా పిల్స్ను చికాగో విమానాశ్రయంలోకి తీసుకెళ్లిన ఓ భారతీయుడిని అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వాటిని తన మిత్రుల కోసం తీసుకెళుతున్నానని నిందితుడు చెప్పినట్లు పేర్కొన్నారు. దాదాపు నాలుగున్నర కేజీల బరువున్న 3,200 వయగ్రా పిల్స్ విలువ రూ. 69 లక్షల వరకూ ఉంటుందని యూఎస్ కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ అధికారులు వెల్లడించారు. సరైన కారణాన్ని వెల్లడించడంలో నిందితుడు విఫలమయ్యాడని చెప్పారు. అమెరికా చట్టాల ప్రకారం దేశం వెలుపల కొన్న మెడిసిన్ను దిగుమతి చేసుకోవడానికి ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిష్ట్రేషన్ ఒప్పుకోదని తెలిపారు. అయితే నిందితుడి వివరాలను మాత్రం అధికారులు వెల్లడించలేదు. -
వందలాది వయాగ్రా టాబ్లెట్లు కొన్న కొరియా అధ్యక్ష భవనం!
అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న దక్షిణ కొరియా అధ్యక్షురాలు పార్క్గ్వెన్హ్వే కార్యాలయం ఇటీవల 360 వయాగ్రా టాబ్లెట్లు కొనటం వివాదాస్పదంగా మారింది. వయాగ్రా కొనుగోలు విషయాన్ని ప్రతిపక్షానికి చెందిన ఒక ఎంపీ బయటపెట్టడంతో అధ్యక్ష కార్యాలయం అది నిజమేనని తాజాగా అంగీకరించింది. డిసెంబర్లో ఈ టాబ్లెట్లను కొనుగోలు చేశామని చెప్పింది. ఎందుకంటే.. అధ్యక్షురాలు వచ్చే మే నెలలో ఇథియోపియా, ఉగాండా, కెన్యా పర్యటనలకు వెళ్తున్నారని.. ఆ ప్రాంతాలు సముద్ర మట్టంకన్నా ఒకటి, రెండు కిలోమీటర్ల ఎత్తులో ఉన్నందున అధ్యక్షురాలి సహాయక సిబ్బందికి ఎత్తుకు సంబంధించిన రుగ్మత (ఆల్టిట్యూడ్సిక్నెస్) తలెత్తితే దానిని నివారించటం కోసం కొనుగోలు చేసినట్లు వివరించింది. ఈ టాబ్లెట్లలో ఒక్కటీ కూడా వాడలేదని అధ్యక్ష భవనం బ్లూ హౌస్పేర్కొంది. వయాగ్రా తరహా టాబ్లెట్లు ఆల్టిట్యూడ్సిక్నెస్ను నివారిస్తాయని నమ్ముతుండటం వల్ల.. పర్వతారోహకుల కోసం దక్షిణ కొరియా వైద్యులు వీటిని సిఫారసు చేస్తుంటారు. ఇదిలావుంటే.. అధ్యక్షురాలు పార్క్స్నేహితురాలు ఒకరు ప్రభుత్వ వ్యవహారాల్లో తలదూర్చి అక్రమంగా కోట్ల డాలర్ల ఆస్తులు సముపార్జించారన్న ఆరోపణలతో ఆమెపై అభిశంసనకు ప్రతిపక్షంతో పాటు సొంత పార్టీ సభ్యులు కూడా కొందరు సిద్ధమవుతున్నారు.