-
వీవీఎస్ లక్ష్మణ్ ట్వీట్లో ఆంతర్యమేమిటో?
హైదరాబాద్: వీవీఎస్ లక్ష్మణ్.. క్రికెట్ ప్రపంచానికి పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. తన క్రికెట్ కెరీర్లో ‘వెరీ వెరీ స్పెషల్’గా గుర్తింపు పొందిన వీవీఎస్ తాజాగా చేసిన ట్వీట్ ఆసక్తిని రేపుతోంది. త్వరలోనే వెరీ వెరీ స్పెషల్ స్టోరీ రాబోతుందంటూ లక్ష్మన్ తన ట్వీటర్ అకౌంట్లో పోస్ట్ చేశాడు. అయితే వెరీ వెరీ స్పెషల్గా రాబోతున్నది ఏంటాని క్రికెట్ ప్రేమికుల్లో చర్చ సాగుతోంది. అతని జీవిత కథ ఆధారంగా ఒక పుస్తకాన్ని వీవీఎస్ లక్ష్మణ్ తీసుకు రాబోతున్నాడా? లేక ఈ పేరుతో ఏమైనా సినిమా రూపొందించడానికి సన్నాహాలు చేస్తున్నాడా? అనేది ఆసక్తికరం. ఈ వెరీ వెరీ స్పెషల్ స్టోరీ అంటూ లక్ష్మణ్ చేసిన ట్వీట్లో ఉన్న ఆంతర్యమేమిటో అతనే చెప్పాలి. రక్త మూలకణ దాతగా వీవీఎస్ లక్ష్మణ్ బ్లడ్ స్టెమ్సెల్ డోనర్ (రక్త మూలకణ దాత)గా పేరును నమోదు చేయించుకున్నాడు. స్వచ్ఛంద సంస్థ దాత్రి నిర్వహించిన కార్యక్రమానికి హాజరైన లక్ష్మణ్ ప్రతి ఒక్కరు బ్లడ్ స్టెమ్సెల్ దానం చేయవచ్చని, మరొకరి జీవితం పొడిగింపునకు అది ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నాడు. లాభాపేక్ష లేకుండా రక్తదానం చేసి మరొకరి ప్రాణం కాపాడాలని పిలుపునిచ్చాడు.మంచి పనికి ప్రతి ఒక్కరూ కదిలిరావాలని, ఇతరులకు స్ఫూర్తిగా నిలవాలని లక్ష్మణ్ కోరాడు. A very very special announcement - coming soon ! pic.twitter.com/ReuOdfI08l — VVS Laxman (@VVSLaxman281) 30 October 2018 -
నాకు ఈ పుట్టిన రోజు వెరీస్పెషల్
కొరుక్కుపేట: ప్రతి ఏడాది తాను జరుపుకునే పుట్టిన రోజు కంటే ప్రత్యేక ప్రతిభావంతులతో కలసి చేసుకున్న ఈ పుట్టిన రోజు తనకు ఎంతో వెరీ వెరీ స్పెషల్ అని ప్రముఖ సినీనటి శ్రుతీహాసన్ తెలిపారు. ఈ మేరకు గురువారం ఉంగళుక్కాగ చారిటబుల్ ట్రస్ట్, రోటరీ క్లబ్ ఆఫ్ మద్రాసు-టీ.నగర్ సంయుక్త ఆధ్వర్యంలో చెన్నై, టీనగర్ , జీఎన్.శెట్టి రోడ్డులోని లిటిల్ ఫ్లవర్ హోమ్ ఫర్ బ్లైండ్ స్కూల్లో సేవ్ ది బ్లైండ్ చిల్డ్రన్ ప్రోగ్రామ్ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సినీనటీ శ్రుతీహాసన్ హాజరయ్యారు. సేవ్ ది బ్లైండ్ చిల్డ్రన్ ప్రోగ్రామ్ ప్రారంభించారు. ఉంగళుక్కాగ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు డాక్టర్ సునీల్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో లిటిల్ ఫ్లవర్ హోమ్ ఫర్ బ్లైండ్ పాఠశాలకు రూ.12 లక్షలు విలువ చేసే వస్తువులను వితరణ చేశారు. అనంతరం సినీనటీ శ్రుతీహాసన్ తన పుట్టిన రోజు వేడుకలను అంధులు, బధిరుల చిన్నారులతో కలసి కోలాహలంగా జరుపుకున్నారు. భారీ కేక్ కట్ చేసి చిన్నారులకు తినిపించారు. పాఠశాల ఆవరణలో మొక్కలను నాటారు. అనంతరం శ్రుతీహాసన్ మాట్లాడుతూ ప్రతి ఏడాది పుట్టిన రోజు ఒక ఎత్తు అయితే ఈ సారి తాను అంధులు, బధిరుల చిన్నారుల సమక్షంలో జరుపుకోవడం చాలా గర్వంగా ఉందన్నారు. నాకు ఈ పుట్టిన రోజు వెరీ వెరీ స్పెషల్ అని అన్నారు. సమాజానికి సేవలు అందిస్తున్న ఉంగళుక్కాగ ట్రస్ట్, రోటరీ క్లబ్ ఆఫ్ మద్రాసు-టీ.నగర్ లిటిల్ ఫ్లవర్ బ్లైండ్ పాఠశాలకు సహాయ పడడంపై ప్రత్యేకంగా అభినందిస్తున్నానని తెలిపారు. అనంతరం డాక్టర్ సునీల్ మాట్లాడుతూ సినీనటుడు విశాల్ సహకారంతో శ్రుతీహాసన్ తమ కార్యక్రమానికి రావడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. అంతే కాకుండా 1000 మంది చిన్నారులకు స్వయంగా ఆహారం అందించడం మరీ ఆనందంగాఉందని అన్నారు. రూ.12 లక్షలు విలువ కలిగిన వస్తువులు విరాళంగా అందించామని అన్నారు. ఇందులో రెండు కంప్యూటర్లు, 10 కంప్యూటర్ టేబుల్స్ అండ్ చైర్స్, 2 ఆఫీసు గది టేబుల్లు, స్కానర్ కమ్ ప్రింటర్లు, అంధ చిన్నారులు ఆడుకునే బొమ్మలు, గేమ్స్ మెటీరియల్స్, మ్యూజిక్ పరికరాలు, 2 రిఫ్రిజిరేటర్లు, సీడీప్లేయర్లు, ఒక జెరాక్స్ మిషన్ తోపాటు స్టేషనరీ వస్తువులను అందించామని తెలిపారు. అదేవిధంగా ట్రస్ట్ తరఫున ఇద్దరు పేద వికలాంగులకు ట్రైసైకిళ్లు పంపిణీ చేశామన్నారు. ఈ ఏడాది లో గోగ్రీన్ కార్యక్రమంలో పలు పాఠశాలలు, కళాశాలలు, రోడ్డుపక్కన, పబ్లిక్ స్థలాల్లో ఐదు వేల ఔషదధ మొక్కలు నాటుతామని వివరించారు. సమాజసేవే లక్ష్యంగా ట్రస్ట్ ముందుకెళ్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రోటరీ రాజన్ ఐ బ్యాంక్ చైర్మన్ డాక్టర్ మోహన్ రాజన్, రోటరీ క్లబ్ ఆఫ్ మద్రాసు-టీ.నగర్ అధ్యక్షుడు రవివేంకట్రామన్, నక్షత్ర పవర్ చైర్మన్ రతన్ రాజ్ రాజమాణిక్యం, పారిశ్రామికవేత్తలు అనిల్ కుమార్రెడ్డి, డాక్టర్ శిల్పారెడ్డి పాల్గొన్నారు. -
ఈ పూజ వెరీ వెరీ స్పెషల్!
వీవీయస్ లక్ష్మణ్లాగే ఆయన భార్య శైలజ కూడా వెరీ వెరీ స్పెషల్. లక్ష్మణ్ క్రికెట్ క్రీడను సంప్రదాయంగా ఆడితే... శైలజ పండుగలలోని సంప్రదాయాలను తుచ తప్పకుండా పాటిస్తారు... పుట్టింట్లో... అత్తవారింట్లో... రెండు చోట్లా ఒకే సంప్రదాయం... ఒకే ఆచారం... శ్రావణమాసం వచ్చిందంటే చాలు... శ్రావణగౌరి నోములు... వరల క్ష్మీ వ్రతం... ఇల్లంతా కళకళలాడిపోతూ ఉంటుంది... ఏ పండుగనూ విడిచిపెట్టకుండా... అత్తగారు, తోటికోడళ్లతో కలిసి సంబరంగా చేసుకుంటారు. ఈ వరలక్ష్మీ వ్రతం నాడు శైలజ ఇంట్లో వరలక్ష్మీ వ్రతం ఎలా జరుగుతోంది... ‘సాక్షి’కి ప్రత్యేకంగా చెప్పిన ముచ్చట్లు... మా వివాహం జరిగి పది సంవత్సరాలయ్యింది. పెళ్లయిన మొదటి సంవత్సరం మేం ఇంగ్లండ్ వెళ్లవలసి వచ్చింది. అందువల్ల అక్కడే వరలక్ష్మి వ్రతం చేసుకున్నాను. ఆ తరవాత నుంచి నేను మా అత్తగారు సత్యభామ ఇద్దరం కలిసే చేసుకుంటున్నాం. అత్తగారు డాక్టర్ కావడంతో ఆవిడకు ఎక్కువ సమయం దొరకదు. అందువల్ల ఉదయం మూడు గంటలకల్లా నిద్ర లేచి తొమ్మిదింటికల్లా పూజ పూర్తి చేసేసేవారు. ఆ తరవాతే హాస్పిటల్కి వెళ్లేవారు. మాతో మొదటిసారి పూజ చేయించినప్పుడు పూజారిని పిలిచారు. శ్రావణ పట్టీ కింద అమ్మవారి రూపు, పట్టుచీర... అన్నీ ఇచ్చారు. అసలు మాకు చీరలు మా అత్తగారే కొంటారు. తరువాతి సంవత్సరం నుండి ఆవిడ దగ్గరుండి మాకు చెబుతూ చేయించారు. మాకు అనుభవం రావడం కోసం అలా చేశారు. ఇప్పుడు మా అంతట మేమే చేసుకునే అనుభవం సంపాదించుకున్నాం. ఇద్దరి సంప్రదాయాలు ఒకటే... నేను వచ్చాకనే మా అత్తగారు పూజలు, వ్రతాలు, నోములు చేసుకుంటున్నారని చాలా మంది అనుకుంటారు. కాని ఆవిడకు ముందు నుంచీ పూజలు చేయడం బాగా అలవాటు. నాకు కూడా చిన్నప్పటి నుంచి ఆ అలవాటు ఉండటం వల్ల, నేను వచ్చాక ఇద్దరం కలిసి చేసుకుంటున్నాం. అంతే! కొన్నిసార్లు పుట్టింటి సంప్రదాయం, అత్తింటి సంప్రదాయం వేర్వేరుగా ఉంటాయి. అయితే మా ఇద్దరి సంప్రదాయాలు ఒకటే కావడం వల్ల ఎవరిది ఎవరు పాటించాలా అనే ఇబ్బందే లేదు మాకు. అంతేకాదు.. మా ఆయన లక్ష్మణ్ గనక ఇంట్లో ఉంటే పూజ చేసేటప్పుడు మాతోటే ఉంటారు. కలశానికి పూజ చేస్తాం... ఈ పూజకు కొందరు బొమ్మకు అలంకరిస్తారు. కాని మేం మాత్రం కొబ్బరికాయకు పసుపు పూసి, కుంకుమతో కల్యాణ తిలకం తీర్చి, పైన రవికెల వస్త్రం ఉంచి, అలంకరించిన నారికేళాన్ని... వెండి కలశం మీద ఉంచుతాం. పుట్టింట్లోను, అత్తవారింట్లోనూ ఇదే ఆనవాయితీ. మంగళగౌరి వ్రతం, వరలక్ష్మీ వ్రతం ఈ రెండు వ్రతాలూ... పిల్లలు, భర్త బాగుండాలని చేస్తారు. నేను కూడా ఆ నమ్మకంతోనే చేస్తున్నాను. ఆరోజున ప్రత్యేకంగా మొత్తం పన్నెండు రకాల పిండి వంటలు చేస్తాం. బూరెలు, పాయసం, గారెలు, పెరుగు వడలు, బజ్జీలు, ఐదు రకాల చిత్రాన్నాలు, సేమ్యా పాయసం వంటివి చేస్తాం. సాయంత్రం పేరంటానికి అందరినీ పిలిచి వాయనాలు ఇస్తాం. మా అత్తగారికి దగ్గరుండి మరీ అన్నీ సహాయం చేస్తాను. మా తోటికోడలు, అత్తగారు, నేను అందరం కలిసి పూజ చేసుకుంటాం. కన్నకూతురిలా చూస్తారు... మా అత్తగారు నన్నూ, మా తోటికోడలినీ ఏనాడూ కోడలిగా చూడలేదు. మా అత్తమామలకు అమ్మాయిలు లేరు. ‘మాకు అమ్మాయిలు లేరు, మీరిద్దరే మా అమ్మాయిలు’ అని మా మామగారు అంటుంటారు. మా అత్తగారిలో ఉండే సర్దుకుపోయే లక్షణం వల్లే మేం ఈ రోజు హాయిగా ఉన్నాం. మా అమ్మగారు ‘తల్లిదండ్రుల్ని కాదు, అత్తమామలను ప్రేమగా చూడటం గొప్ప’ అని చెప్పేవారు. తల్లిదండ్రులను ఎలాగూ ప్రేమగానే చూస్తార., కాని అత్తమామలను అలా చూడాలంటూ, మా దగ్గర నుంచి ప్రమాణం తీసుకున్నారు. అత్తవారింట్లో రెబెల్లా ఉండద్దన్నారు. కానీ రెబల్ నేచర్ పోదు కదా! చాలా త్వరగానే నేను నా ప్రవర్తనను మార్చుకున్నాను. అనుకున్నప్పుడే ప్రారంభించాలి... భక్తి కావచ్చు, పూజలు కావచ్చు... ఏవైనా సరే చిన్నప్పటి నుంచే ఆచరించాలని భావిస్తాను. ఎప్పుడు చేయాలనుకుంటే అప్పుడే మొదలుపెడతాను. పెద్దవాళ్లమయ్యాక చేయచ్చులే అని వాయిదా వేయకూడదనేది నా అభిప్రాయం. ప్రతిరోజూ పొద్దున్న నిద్ర లేవగానే స్నానం చేసి పూజ చేసేసుకుని, అప్పుడు దినచర్య ప్రారంభిస్తాను. అది కూడా యాంత్రికంగా కాదు, మనస్ఫూర్తిగా చేస్తాను. నాకు ఏదైనా జరిగిపోతుందేమోననే భయంతో కాదు, భగవంతుడి మీద భక్తితో, ప్రేమతో చేస్తాను. మా చిన్నప్పుడు అమ్మ... ఇంట్లో బాగా పూజలు చేసేది. బహుశ నాకు అది వంశపారంపర్యంగా వచ్చిందేమో. ఇక్కడకు వచ్చాక అత్తగారిది కూడా అదే స్వభావం కావడంతో, నేను ఏ ఇబ్బందీ లేకుండా అన్ని పూజలూ చేసుకుంటున్నాను. నిద్ర లేవగానే సూర్యుడికి నమస్కారం చేయమని మా పిల్లలకు నేర్పాను. పెద్దల పట్ల గౌరవంగా ఉండటం మా ఆయన లక్ష్మణ్ దగ్గర నుంచే నేర్చుకున్నారు. - సంభాషణ: పురాణపండ వైజయంతి మాకు ఇద్దరు అబ్బాయిలు. కోడళ్లయినా, కూతుళ్లయినా వాళ్లే. కొత్తలో ఏవేవో ఇబ్బందులు రావడం సహజం. అయితే వాటిని పెద్దవి చేసుకోకూడదు. ముందర ఎవరో ఒకరు సర్దుకుపోవాలి. అప్పుడే గొడవలు లేకుండా సాఫీగా సాగిపోతుంది జీవితం. ఇప్పుడు నేను మా ఇద్దరు కోడళ్లు కలిసే పూజ చేసుకుంటాం. కోడళ్లు అంతా సిద్ధం చేసి ఉంచుతారు. - డా. సత్యభామ మా అత్తగారు బాగా సర్దుకుపోయేవారు. మా డెలివరీల టైమ్లో ఆవిడే దగ్గరుండి అన్నీ చూసుకున్నారు. పెళ్లయి అత్తవారింట్లో అడుగు పెట్టినప్పుడు మేం చిన్నవాళ్లం కదా. ఆ టైమ్లోనే ఏవైనా చిన్నచిన్న తేడాలు వచ్చేవి. నెమ్మదిగా ఆవిడంటే ఏమిటో అర్థం చేసుకున్నాం. ఇప్పుడు బాగా కలిసిపోయాం. పండుగల లాంటివి వస్తే, ఉప్పాడ, కాంచీవరం పట్టుచీరలు తెస్తారు. - వీవీఎస్ శైలజ
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
రేవంత్ రెడ్డికి అమిత్ షా వార్నింగ్
ఒకే కాన్పులో ఐదుగురికి జన్మనిచ్చిన తల్లి!
హైదరాబాద్ లో బీర్లు కరువు
ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)
బాబు, లోకేష్ కు నోటీసులు..?
స్టార్ ప్రొడ్యూసర్ పరువు తీసిన కామెడీ షో.. ఇన్ స్టా పోస్ట్ వైరల్
చిరంజీవి గురించి నేను ఏనాడూ మాట్లాడలేదు: ముద్రగడ
అప్పుడు భాషాలా.. ఇప్పుడు దావూద్ ఇబ్రహీంలా..
ప్రచారంలో దూసుకుపోతున్న జగన్
‘ధనాధన్’ ధోని డకౌట్.. ప్రీతి జింటా రియాక్షన్ వైరల్
తప్పక చదవండి
- ‘ధనాధన్’ ధోని డకౌట్.. ప్రీతి జింటా రియాక్షన్ వైరల్
- MI Vs SRH: ఐపీఎల్లో నేడు (మే 6) మరో బిగ్ మ్యాచ్
- పొమ్మనలేక పొగ పెడుతున్నారా..!
- ట్రాక్టర్ అదుపు తప్పి..కాలువలోకి దూసుకెళ్లి..
- శ్రీలీలకి తెలుగులో ఛాన్సులు నిల్.. దీంతో ఏకంగా
- Cable Bridge: కేబుల్ బ్రిడ్జిపై పోలీసుల బర్త్ డే వేడుక
- అఖండ మెజార్టీతో గెలిపించండి: సీఎం వైఎస్ జగన్ సతీమణి భారతమ్మ
- పిఠాపురంలో గుట్టుచప్పడు కాకుండా జనసేన ‘గోకులం’ డ్రామా
- ఏ1 చంద్రబాబు, ఏ2 లోకేశ్
- మంచి మాట: నోరు మంచిదైతే...
Advertisement