veereswara temple
-
శివ.. శివా..
జంగారెడ్డిగూడెం రూరల్/ జంగారెడ్డిగూడెం : జంగారెడ్డిగూడెం మండలం తాడువాయి భద్రకాళీ సమేత వీరేశ్వరస్వామి ఆల యంలో నంది విగ్రహం గతనెల 21 చోరీకి గురికాగా ధ్వంసమై శనివారం జీలుగుమిల్లి మండలం లక్ష్మీపురంలో రోడ్డు పక్కన పొదల్లో కనిపించింది. విగ్రహాన్ని పెకలించి పట్టుకెళ్లిన దుండగులు అక్కడి పొలాల్లో విగ్రహాన్ని పగులగొట్టి ధ్వంసం చేశారు. అయితే విగ్రహంలో అతి పురాతన వస్తువు ఏదైనా దొరుకుతుందని అనుకున్న దుండగులు ఈ పనిచేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. ఘటనా స్థలానికి జంగారెడ్డిగూడెం సీఐ జి.శ్రీనివాసయాదవ్, ఎస్సై ఎ.ఆనందరెడ్డి చేరుకుని ధ్వం సం చేసిన శకలాలను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
పురాతన నంది విగ్రహం చోరీ
జంగారెడ్డిగూడెం రూరల్ : జంగారెడ్డిగూడెం మండలం తాడువాయి భద్రకాళీ సమేత వీరేశ్వరస్వామి ఆలయంలో పురాతన రాతి నంది విగ్రహం చోరీకి గురైంది. గురువారం వేకువజామున ఆలయ ప్రధానార్చకులు కాళ్లకూరి రవికుమారశర్మ ఆలయం వద్దకు రాగా అప్పటికే తలుపులు తాళాలు పగులగొట్టి ఉన్నాయి. ఆయన ఆలయంలోకి వెళ్లి చూడగా నంది విగ్రహం కనిపించకపోవడంతో విషయాన్ని గ్రామస్తులు, పోలీసులకు సమాచారం ఇచ్చారు. నంది విగ్రహాన్ని దుండగులు పెకిలించి ఎత్తుకుపోయారు. విగ్రహం దాదాపు 500 ఏళ్ల క్రితం రెడ్డిరాజుల కాలం నాటిదని అర్చకులు అన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై ఎ.ఆనందరెడ్డి తెలిపారు.