breaking news
varikuti ashok babu
-
అన్నీ గుర్తు పెట్టుకుంటాం: అంబటి రాంబాబు
సాక్షి, బాపట్ల: రేపల్లె ఆసుపత్రిలో వైఎస్సార్సీపీ నేత వరికూటి అశోక్బాబు దీక్ష కొనసాగుతోంది. ఆయన్ను ఆదివారం.. వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు పరామర్శించారు. అనంతరం అంబటి మీడియాతో మాట్లాడుతూ.. అశోక్ బాబు ఆరోగ్య పరిస్థితి ఇబ్బందికరంగా మారిందన్నారు. ‘‘రైతుల సమస్య పరిష్కారం అయ్యే వరకు నిరాహార దీక్ష విరమించనని అశోక్ బాబు అంటున్నారు. మూడు రోజుల నుంచి పచ్చి మంచినీళ్లు కూడా ముట్టకుండా దీక్ష చేస్తున్నారు’’ అని అంబటి రాంబాబు చెప్పారు.‘‘వేమూరు నియోజకవర్గంలో రైతులంతా కలిసి కాలువలో గుర్రపు డెక్కతో తమ పడుతున్న ఇబ్బందిని అశోక్ బాబు దృష్టికి తీసుకువచ్చారు. ఆయన కాలువలో గుర్రపు డెక్క తొలగించాలంటూ రెండు రోజులు పాటు అక్కడే దీక్ష చేశారు. అధికారులు స్పందించట్లేదు. కనీసం కాలువల్లో గుర్రపు డెక్క కూడా తీయలేని పరిస్థితుల్లో ప్రభుత్వం ఉంది. కాలువలో గుర్రపు డెక్క ప్రభుత్వం తొలగించాలి. ప్రభుత్వానికి చేతకాకపోతే గుర్రపు డెక్క తొలగించడానికి రైతులకు అవకాశం ఇవ్వాలి’’ అని అంబటి రాంబాబు అన్నారు.రేపల్లె టౌన్ సీఐ మల్లికార్జునరావు.. అశోక్బాబు పట్ల అమానుషంగా ప్రవర్తించాడు. అశోక్బాబు పట్ల అత్యంత దారుణంగా వ్యవహరించాడు. అన్యాయాలకు, అక్రమాలకు పాల్పడిన అధికారులను కచ్చితంగా మేము గుర్తుపెట్టుకుంటాం’’ అని అంబటి రాంబాబు హెచ్చరించారు. -
వైఎస్సార్సీపీ నేత అశోక్బాబుకు వైఎస్ జగన్ పరామర్శ
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ వేమూరు నియోజకవర్గ సమన్వయకర్త, రాష్ట్ర అధికార ప్రతినిధి అశోక్బాబును ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పరామర్శించారు. ఫోన్లో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అశోక్పై పోలీసుల దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. సాగునీరు అందక ఇబ్బందులు పడుతున్న రైతులకు అండగా నిలిచిన అశోక్పై పోలీసులు దాడి చేసిన సంగతి తెలిసిందే.రేపల్లె ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అశోక్ని వైఎస్ జగన్ ఫోన్లో పరామర్శించారు. రైతుల తరుపున పోరాడుతూ, వారి సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళేందుకు అశోక్ ప్రయత్నించారు. ఆ ప్రయత్నాన్ని పోలీసులు అణిచివేయాలని చూశారు. రైతాంగానికి మంచి జరిగే కార్యక్రమం అశోక్ చేయడం అభినందనీయం. ఆయనపై పోలీసులు వ్యవహరించిన తీరు దుర్మార్గం. రైతులకు అండగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. అశోక్బాబుకు అన్నివిధాలా పార్టీ అండగా నిలుస్తుంది’’ అని వైఎస్ జగన్ భరోసా ఇచ్చారు.కాగా, సాగునీటి కాలువలు బాగుచేసి రైతులను ఆదుకోవాలంటూ బాపట్ల జిల్లా రేపల్లె ఇరిగేషన్ కార్యాలయం వద్ద వరికూటి చేపట్టిన దీక్షను అడ్డుకునే నెపంతో ఆయనపై పోలీసులు దాడి చేశారు. కూటమి నేతల సూచన మేరకు.. స్టేషన్కు తరలిస్తున్నట్లు నటించి పిడిగుద్దులతో ఆయనను కుళ్లబొడిచారు. పోలీసుల దాడితో ఆయన రేపల్లె పట్టణ పోలీసు స్టేషన్లో స్పృహ తప్పి పడిపోయారు.వేమూరు, రేపల్లె నియోజకవర్గంలో సాగునీటి కాలువలు పూడికతో నిండిపోయి పంట పొలాలకు నీరు సక్రమంగా రావడం లేదు. రైతుల కష్టాలు చూసిన వరికూటి అశోక్బాబు కాలువల్లోకి దిగి ప్రత్యక్ష ఆందోళనతో నిరసన తెలిపి, సమస్యను ప్రభుత్వం దృíష్టికి తెచ్చారు. అయినా అధికారులు స్పందించక పోవడంతో శుక్రవారం ఉదయం రేపల్లెలో అధికారులను కలిసి సమస్య పరిష్కరించాలని కోరేందుకు వెళ్లారు.అయితే అధికారులు అందుబాటులో లేక పోవడంతో సాయంత్రంలోగా తనకు స్పష్టమైన హామీ ఇవ్వకపోతే రేపల్లె ఇరిగేషన్ కార్యాలయం ఎదుట ఆమరణ దీక్షకు దిగుతానని హెచ్చరించారు. సాయంత్రం వరకు చూసినా అధికారులు ఎటువంటి హామీ ఇవ్వక పోవడంతో ఆయన ఆమరణ దీక్షకు సిద్ధపడ్డారు. ఇంతలో రేపల్లె పట్టణ సీఐ మల్లిఖార్జునరావు పోలీసు బలగాలతో అక్కడికి చేరుకుని వరికూటితో వాగ్వాదానికి దిగారు. ఆమరణ దీక్షకు అనుమతి లేదని తక్షణం వెళ్లిపోవాలని హెచ్చరించారు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో పది మంది పోలీసులు అశోక్బాబును చుట్టుముట్టి.. పిడిగుద్దులు గుద్దుతూ పోలీసు స్టేషన్ వరకు మోసుకెళ్లారు. -
‘వరికూటి’పై పోలీసుల దాడి
రేపల్లె/బాపట్ల/సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ వేమూరు నియోజకవర్గ సమన్వయకర్త, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి వరికూటి ఆశోక్బాబుపై రేపల్లె పట్టణ పోలీసులు దౌర్జన్యం చేశారు. సాగునీటి కాలువలు బాగుచేసి రైతులను ఆదుకోవాలంటూ బాపట్ల జిల్లా రేపల్లె ఇరిగేషన్ కార్యాలయం వద్ద వరికూటి చేపట్టిన దీక్షను అడ్డుకునే నెపంతో ఆయనపై దాడి చేశారు. కూటమి నేతల సూచన మేరకు.. స్టేషన్కు తరలిస్తున్నట్లు నటించి పిడిగుద్దులతో ఆయనను కుళ్లబొడిచారు. పోలీసుల దాడితో ఆయన రేపల్లె పట్టణ పోలీసు స్టేషన్లో స్పృహ తప్పి పడిపోయారు. వరికూటి అశోక్బాబుపై రేపల్లె పోలీసులు వ్యవహరించిన తీరు పట్ల వైఎస్సార్సీపీ శ్రేణులు మండిపడ్డాయి. పోలీసుల దౌర్జన్యాన్ని నిరసిస్తూ స్టేషన్ ముందు ధర్నాకు దిగాయి. పోలీసు అధికారులు క్షమాపణ చెప్పాలంటూ ఆందోళన చేపట్టాయి. పోలీసుల దాడిని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి మేరుగ నాగార్జున తీవ్రంగా ఖండించారు. రైతుల పక్షాన పోరాడుతున్న అశోక్బాబుపై పోలీసులు దౌర్జన్యానికి దిగడంపై వేమూరు, రేపల్లె వైఎస్సార్సీపీ శ్రేణులు ఆగ్రహంతో మండిపడుతున్నాయి.రైతులకు మద్దతిచ్చినందుకు కక్షగట్టి..వేమూరు, రేపల్లె నియోజకవర్గంలో సాగునీటి కాలువలు పూడికతో నిండిపోయి పంట పొలాలకు నీరు సక్రమంగా రావడం లేదు. రైతుల కష్టాలు చూసిన వరికూటి అశోక్బాబు కాలువల్లోకి దిగి ప్రత్యక్ష ఆందోళనతో నిరసన తెలిపి, సమస్యను ప్రభుత్వం దృíష్టికి తెచ్చారు. అయినా అధికారులు స్పందించక పోవడంతో శుక్రవారం ఉదయం రేపల్లెలో అధికారులను కలిసి సమస్య పరిష్కరించాలని కోరేందుకు వెళ్లారు. అయితే అధికారులు అందుబాటులో లేక పోవడంతో సాయంత్రంలోగా తనకు స్పష్టమైన హామీ ఇవ్వకపోతే రేపల్లె ఇరిగేషన్ కార్యాలయం ఎదుట ఆమరణ దీక్షకు దిగుతానని హెచ్చరించారు. సాయంత్రం వరకు చూసినా అధికారులు ఎటువంటి హామీ ఇవ్వక పోవడంతో ఆయన ఆమరణ దీక్షకు సిద్ధపడ్డారు. ఇంతలో రేపల్లె పట్టణ సీఐ మల్లిఖార్జునరావు పోలీసు బలగాలతో అక్కడికి చేరుకుని వరికూటితో వాగ్వాదానికి దిగారు. ఆమరణ దీక్షకు అనుమతి లేదని తక్షణం వెళ్లిపోవాలని హెచ్చరించారు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో పది మంది పోలీసులు అశోక్బాబును చుట్టుముట్టి.. పిడిగుద్దులు గుద్దుతూ పోలీసు స్టేషన్ వరకు మోసుకెళ్లారు. విషయం తెలుసుకున్న వైఎస్సార్సీపీ శ్రేణులు పోలీసు స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగాయి. దీంతో పోలీసులు అంబులెన్స్లో వరికూటిని ఆస్పత్రికి తరలించారు. పోలీసు అధికారులు స్వయంగా క్షమాపణ చెప్పాలంటూ పార్టీ శ్రేణులు ఆస్పత్రి ఎదుట సైతం ఆందోళనకు దిగాయి. చివరకు రేపల్లె పట్టణ ఎస్ఐ జోక్యంతో పార్టీ శ్రేణులు ఆందోళన విరమించాయి. వెన్ను, నడుముపై పిడిగుద్దులు గుద్దారు..రైతాంగ సమస్యలపై శాంతియుతంగా నిరసన తెలియజేస్తుంటే అక్రమంగా అరెస్టులు చేస్తారా అని ఈ సందర్భంగా అశోక్బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం రాత్రి ఆయన మీడియాతో మాట్లాడారు. పోలీసులు రౌడీల్లా వ్యవహరించి తన వెన్నుపూస, నడుముపై పిడిగుద్దులు గుద్ది గాయపరిచారన్నారు. రాష్ట్రంలో రెడ్బుక్ పాలన కొనసాగుతోందనడానికి ఈ ఘటనే నిదర్శనమన్నారు. రైతులకు అండగా తన ఆందోళన విరమించే ప్రసక్తే లేదన్నారు. కాగా, వరికూటి అశోక్ బాబుపై జరిగిన దాడిని వైఎస్సార్సీపీ స్టేట్ కో ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్రంగా ఖండించారు. అశోక్ బాబుకు ఫోన్ చేసి పరామర్శించారు. పార్టీ అధిష్టానం ఈ ఘటనను సీరియస్గా తీసుకుందన్నారు. పోలీసుల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి మేరుగ నాగార్జున, వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు టీజేఆర్ సుధాకర్బాబు, వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జూపూడి ప్రభాకర్రావులు ఖండించారు. రైతులకు అండగా నిలిచినందుకు పోలీసులు దురుసుగా ప్రవర్తించడం సిగ్గుచేటన్నారు. తప్పు చేసిన పోలీసులు తక్షణం క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. -
అశోక్బాబుపై పోలీసుల దౌర్జన్యాన్ని ఖండించిన వైయస్సార్సీపీ
తాడేపల్లి: వైయస్సార్సీపీ దళిత నేత వరికూటి అశోక్బాబుపై రేపల్లె పోలీసుల దౌర్జన్యాన్ని ఖండిస్తున్నాం. ఈ తరహా చర్యలు ప్రజాస్వామ్య విరుద్ధం.బాపట్ల జిల్లా రేపల్లె నియోజకవర్గంలో కాలువలన్నీ గుర్రపుడెక్కతో నిండిపోయి, సాగు నీరందక రైతులు ఇబ్బంది పడుతున్నారంటూ, అక్కడి మా పార్టీ సమన్వయకర్త వరికూటి అశోక్బాబు ఆందోళన చేస్తే, రేపల్లె పోలీసులు దురుసుగా ప్రవర్తించడం అత్యంత హేయం. రైతుల మేలు కోసం రేపల్లె ఇరిగేషన్ కార్యాలయం వద్ద బైఠాయించి అశోక్ బాబు ధర్నా చేస్తే, ఆయన పట్ల స్థానిక పోలీసులు దారుణంగా ప్రవర్తించారు. కాళ్లు, చేతులు పట్టుకుని బలవంతంగా లాక్కెళ్లడంతో నడుం పట్టిన ఆయన ఇప్పుడు తీవ్ర అవస్థ పడుతున్నారు.రైతుల మేలు కోసం శాంతియుతంగా ఆందోళన చేస్తున్నా, అంత దౌర్జన్యంగా ప్రవర్తించడం ఎంత వరకు సబబు..? అశోక్బాబును దారుణంగా పోలీస్ స్టేషన్కు లాక్కెళ్లడంతో, ఆయన నడుం పట్టేసింది. దీంతో ఆయన లేవలేకపోతున్నారు. కనీసం కదల్లేని పరిస్థితుల్లో ఉన్నారు. రేపల్లెలో పోలీసుల తీరును తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇకనైనా వారు తమ తీరు మార్చుకోవాలని హెచ్చరిస్తున్నాం అంటూ వైయస్సార్సీపీ నాయకులు మేరుగ నాగార్జున, టీజేఆర్ సుధాకర్బాబు, జూపూడి ప్రభాకర్రావు పేర్కొన్నారు. -
ఏం చేశారని దీపావళి చేసుకోవాలి.. వెన్నుపోటుపై వినూత్న నిరసన
-
Varikuti Ashok: 99 రూపాయల బాటిల్ కొనడానికి వెళ్తే నా మీద కేసు పెట్టారు..
-
పవన్ కళ్యాణ్ ప్రశ్నించే టైం వచ్చింది వరికూటి అశోక్ బాబు సెటైర్లు
-
దీక్ష విరమించిన వైఎస్సార్సీపీ నేత అశోక్బాబు
సాక్షి, బాపట్ల జిల్లా: చెరుకుపల్లిలో దీక్ష చేపట్టిన వైఎస్సార్సీపీ వేమూరు నియోజకవర్గ ఇన్చార్జి వరికూటి అశోక్ బాబుకు మాజీ ఎంపీ నందిగం సురేష్ సంఘీభావం తెలిపారు. అద్దేపల్లిలో ఏర్పాటు చేసిన వైఎస్సార్ విగ్రహాన్ని వీడియో కాల్లో అశోక్ బాబుకు నందిగం సురేష్ చూపించారు. 24 గంటల్లో ఎక్కడైతే వైఎస్సార్ విగ్రహాన్ని ధ్వంసం చేశారో అక్కడే కొత్త విగ్రహం ఏర్పాటు చేస్తామన్నారు. అశోక్ బాబుకి మాజీ ఎంపీ నందిగం సురేష్ నిమ్మరసం ఇచ్చి దీక్ష విరంపజేశారు.కాగా భట్టిప్రోలు పంచాయతీ పరిధిలోని అద్దేపల్లి దళితవాడలో శనివారం ఉదయం 6 గంటలకు అందరూ చూస్తుండగానే టీడీపీ వర్గీయులు దివంగత సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహంపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. వైఎస్సార్సీపీ వేమూరు నియోజకవర్గ ఇన్చార్జి వరికూటి అశోక్బాబు శనివారం రాత్రి అద్దేపల్లి విచ్చేసి కాలిపోయిన వైఎస్ విగ్రహాన్ని పరిశీలించారు. అక్కడే వైఎస్సార్ మరో విగ్రహం ఏర్పాటుకు చర్యలు తీసుకున్నారు. విగ్రహం ఏర్పాటు పూర్తయ్యే వరకూ ఆయన స్థానిక అంబేడ్కర్ విగ్రహం వద్ద కళ్లకు గంతలు కట్టుకుని మౌనదీక్ష చేశారు.దళితవాడ ప్రజలు అండగా వచ్చి ఆయనకు మద్దతుగా దీక్షలో పాల్గొన్నారు. రాత్రి 10గంటల ప్రాంతంలో పోలీసులు అశోక్బాబు దీక్షను భగ్నంచేసి ఆయన్ను రేపల్లె తరలించారు. అక్కడా ఆయన పోలీసు వాహనం దిగకుండా దీక్ష కొనసాగించారు. -
పొందూరు సర్పంచ్ అక్రమ అరెస్టు
► టంగుటూరు పీఎస్ను ముట్టడించిన గ్రామస్తులు ► వరికూటి అశోక్బాబు నేతృత్వంలో 500 మందితో ధర్నా ► అర్థరాత్రి నుంచి ఉదయం 11 వరకు కొనసాగిన నిరసన ► సంబంధం లేని కేసులో జైలుకు తరలించిన పోలీసులు ► బెయిలు మంజూరు చేసిన జిల్లా కోర్టు ఒంగోలు: టీడీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రాష్ట్రంలో అర్ధరాత్రి అరెస్టులు, వైఎస్సార్సీపీ నాయకుల నిర్బంధాలు కొనసాగుతూనే ఉన్నాయి. గ్రామస్థాయి నుంచి, రాష్ట్రస్థాయి నాయకుల వరకూ దాడులకు తెగబడుతూనే ఉంది. తాజాగా టంగుటూరు మండలం పొందూరు గ్రామ సర్పంచ్ రంగారావును తెలుగుదేశం నేతలు అక్రమంగా అరెస్టు చేయించారు. తనకు ఏమాత్రం సంబంధం లేని కేసులో రంగారావును అక్రమంగా ఇరికించి అర్థరాత్రి పోలీస్ స్టేషన్కు తరలించారు. దీంతో ఆగ్రహం చెందిన వైఎస్సార్సీపీ అభిమానులు పోలీసు స్టేషన్ను ముట్టడించారు. 500 మందికి పైగా వైఎస్సార్సీపీ అభిమానులు, కొండపి నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇన్చార్జి వరికూటి అశోక్బాబు నేతృత్వంలో పోలీసుస్టేషన్కు చేరుకుని గురువారం అర్ధరాత్రి నుంచి ఉదయం 11 గంటల వరకు ధర్నా నిర్వహించారు. ఉదయం రంగారావును ఒంగోలు జిల్లా కోర్టులో హాజరుపరచడంతో జడ్జి ఆయనకు బెయిలు మంజూరు చేశారు. దీంతో కార్యకర్తలు ఊపిరిపీల్చుకున్నారు. ధర్నాలో వైఎస్సార్సీపీ నియోజకవర్గ ఇన్చార్జి వరికూటి అశోక్బాబు, పార్టీ రాష్ట్ర నాయకుడు ఢాకా పిచ్చిరెడ్డి, మండల అధ్యక్షుడు బొట్ల రామారావు, కొండపి మండల నాయకులు వాకా బాలకృష్ణారెడ్డి, వాకా శ్రీకాంత్రెడ్డి, పొందూరు గ్రామ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. రంగారావుపై ఎందుకంత కుట్ర.. పొందూరు గ్రామంలో పోటాపోటీగా జరిగి పంచాయతీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ బలపరిచిన అభ్యర్ధిగా రంగారావు విజయం సాధించి సర్పంచ్ అయ్యారు. దీంతో 2014 లో టీడీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి టీడీపీ నాయకులు ఆయన్ను టార్గెట్ చేసి, వేధింపులకు గురి చేస్తున్నారు. ఇప్పటికే పలుమార్లు ఆయన వ్యాపారాలపై దాడులు చేయంచడం.. ఆయనకు చెందిన ఆస్తులకు నష్టం కలిగించడం చేసిన టీడీపీ నాయకులు.. తాజాగా తనకేమాత్రం సంబంధం లేని ఓ కేసులో పోలీసులను పురమాయించి టంగుటూరు పీఎస్కు తరలించారు. దాదాపు 3 వేలకు పైగా ఓట్లున్న పొందూరు గ్రామంలో వైఎస్సార్సీపీకి చిట్నీడి రంగారావు బలమైన నాయకుడు. పైగా రంగారావుకు మాజీ మంత్రి బాలినేని, ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, కొండపి నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇన్చార్జి వరికూటి అశోక్బాబులతో మంచి సాన్నిహిత్యం కూడా ఉంది. ఆయన రాజకీయంగా ఎదిగితే గ్రామంలో టీడీపీ ఉనికే ప్రశ్నార్థకం అవుతుందనే భయంతోనే టీడీపీ నాయకులు ఆయనపై అసత్య ప్రచారంతోపాటు, అక్రమ కేసులు బనాయిస్తూ వేధిస్తున్నారు. తాజాగా రంగారావుకు ఏమాత్రం సంబంధం లేని కేసులో ఇరికించడం ద్వారా తమ అధికార ఆధిపత్యాన్ని చాటుకోవాలని భావించింది. కానీ పెద్ద ఎత్తున వైఎస్సార్సీపీ అభిమానులు తరలిరావడంతో వారి ఆటలు సాగలేదు. ఈ సందర్భంగా కొండేపి నియోజకవర్గ ఇన్చార్జి వరికూటి అశోక్బాబు మాట్లాడుతూ టీడీపీ ఆటలు సాగబోనివ్వమని స్పష్టం చేశారు.