breaking news
University of Southampton
-
చిన్నదే గాని.. చిరంజీవి
‘సృష్టిలో ఏదీ శాశ్వతం కాదు’ అన్న మాటను ఇప్పుడు ఒక చిన్న గాజు ఫలకం అబద్ధం చేసింది. ఇంగ్లాండ్లోని సౌతాంప్టన్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్త పీటర్ కజాన్ స్కీ, అతని బృందం రూపొందించిన ఈ గాజు డిస్క్, మొత్తం చరిత్ర జ్ఞాపకాలను శాశ్వతంగా బంధించగల అద్భుతం. దీని పేరు ‘సూపర్మాన్ మెమరీ క్రిస్టల్’. ఇందులో మూడు వందల అరవై టెరాబైట్ల డేటాను స్టోర్ చేయొచ్చు. అంటే చరిత్ర, గ్రంథాలు, సినిమాలు, సంగీతం అన్నీ ఒకే డిస్క్లో ఇమిడిపోతాయి. సాధారణ హార్డ్డ్రైవ్ లేదా పెన్ డ్రైవ్ కొంతకాలానికే దెబ్బతింటుంది. ప్రత్యేకమైన గాజుతో రూపొందిన ఈ డిస్కును మాత్రం తీవ్రస్థాయిలోని ఉష్ణోగ్రతల వ్యత్యాసాలు, ప్రకృతి విపత్తులు వంటివేవీ దీనిని తాకలేవు. అణు స్థాయిలో ఉండే నానో నిర్మాణాల ద్వారా పరిమాణం, దిశ, స్థానం వంటి ఐదు మార్గాల్లో ఇందులో డేటా స్టోర్ అవుతుంది. కోట్ల ఏళ్ల తరువాత కూడా మన కథలను ఈ గాజు డిస్క్ ఒక్కటే చెప్తుంది. మొత్తానికి, ఇది ఉత్త గాజు బిళ్ల కాదు, మానవ జ్ఞాపకాలకు కాలాతీత బీమా పథకం! పరిమాణంలో ఇది చిన్నదే గాని, మనుగడలో మాత్రం చిరంజీవి. త్వరలోనే దీనిని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసి మార్కెట్లోకి తీసుకురానున్నారు. -
చేపలు తింటే గర్భిణులకు మేలు
లండన్: గర్భిణులు చేపలను తింటే పుట్టే బిడ్డలకు ఉబ్బసం దరిచేరకుండా ఉంటుందని ఓ పరిశోధనలో తేలింది. లండన్లోని సౌతాంప్టన్ యూనివర్సిటీకి చెందిన ఫిలిప్ కాడర్ నేతృత్వంలో పరిశోధనలు జరిగాయి. కొంతమంది స్త్రీలకు వారానికి రెండు సార్లు చేపలను ఆహారంగా 19 వారాలపాటు ఇచ్చారు. మిగతా వారి పిల్లలతో పోలిస్తే చేపలను ఆహారంగా తీసుకున్న తల్లుల పిల్లలకు రెండేళ్ల వయస్సు తరువాత అలర్జీ తక్కువగా ఉందని పరిశోధకులు చెప్పారు. ప్రతికూల వాతావరణం లోనూ వ్యాధులు తక్కువగా వచ్చాయన్నారు. -
వందల కోట్ల కణాల మెదడుపై అధ్యయనానికి కొత్త పద్దతి
లండన్: వందల కోట్ల కణాలతో అతిక్లిష్టంగా ఉండే మన మెదడును మరింత బాగా అధ్యయనం చేసేందుకు వీలుగా బ్రిటన్లోని యూనివర్సిటీ ఆఫ్ సౌతాంప్టన్ శాస్త్రవేత్తలు ఓ కొత్త పద్ధతిని కనిపెట్టారు. 'మల్టీకలర్ ఆర్జీబీ(ఎరుపు, ఆకుపచ్చ, నీలి) ట్రాకింగ్' అనే ఈ పద్ధతిలో మెదడును కణస్థాయిలో అధ్యయనం చేసేందుకు వీలవుతుందని శాస్త్రవేత్తలు వెల్లడించారు. కాంతిని ప్రతిఫలింపచేసే ప్రొటీన్ను ఉత్పత్తి చేసే వైరస్ కణాలను చొప్పించడం ద్వారా మెదడు కణాలు ఏదో ఒక రంగును వెదజల్లేలా చేయవచ్చని వారు తెలిపారు. అలా చేయడం ద్వారా మెదడు కణాల చర్యలను అర్థం చేసుకునేందుకు వీలవుతుందని పరిశోధకులు పేర్కొన్నారు. ఈ తరహాలో అధ్యయనం భవిష్యత్తులో మెదడుకు సంబంధించిన అనేక చికిత్సలకు దోహదపడుతుందని వారు తెలిపారు. వారి పరిశోధనల వివరాలు 'సైంటిఫిక్ రిపోర్ట్స్' అనే పత్రికలో ప్రచురించారు.


