breaking news
United people
-
అంబేడ్కర్ ఆశయం ‘ఒకే దేశం.. ఒకే రాజ్యాంగం’
నాగపూర్: దేశాన్ని ఐక్యంగా ఉంచాలంటే ఒక్కటే రాజ్యాంగం అమల్లో ఉండాలని డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ నిర్దేశించారని, ఒక్కో రాష్ట్రానికి ఒక్కో రాజ్యాంగం అనే ఆలోచనను తీవ్రంగా వ్యతిరేకించారని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బి.ఆర్.గవాయ్ చెప్పారు. ఆయన ఆశయం ఒకే దేశం.. ఒకే రాజ్యాంగం అని స్పష్టంచేశారు. మహారాష్ట్రలోని నాగపూర్లో శనివారం ‘రాజ్యాంగ ప్రవేశిక ఉద్యానవనాన్ని’ జస్టిస్ గవాయ్ ప్రారంభించారు. అంబేడ్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దేశ ఐక్యతకు ఏకైక రాజ్యాంగం అనే అంబేడ్కర్ దార్శనికత నుంచి సుప్రీంకోర్టు స్ఫూర్తి పొందిందని, అందుకే ఆర్టీకల్ 370ని రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించిందని తెలిపారు. ఈ ఆర్టీకల్ రద్దును సమర్థించిన ఐదుగురు సభ్యుల సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనంలో జస్టిస్ గవాయ్ సైతం ఉన్న సంగతి తెలిసిందే. ఆర్టీకల్ 370 రద్దును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లు తమ ముందుకు వచ్చినప్పుడు అంబేడ్కర్ మాటలు గుర్తుచేసుకున్నానని జస్టిస్ గవాయ్ చెప్పారు. దేశానికి ఒక్కటే రాజ్యాంగం ఉండాలన్న అంబేడ్కర్ బాటను అనుసరిస్తూ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు. ఎన్ని సవాళ్లు ఎదురైనా ఐక్య భారత్ రాజ్యాంగంలో సమాఖ్య లక్షణాలు అధికంగా ఉన్నట్లు అంబేడ్కర్పై అప్పట్లో విమర్శలు వచ్చాయని జస్టిస్ గవాయ్ గుర్తుచేశారు. యుద్ధాలు జరిగితే దేశం ఐక్యంగా ఉండలేదని, ముక్కలవుతుందని చాలామంది అనుమానించారని చెప్పారు. దేశాన్ని ఐక్యంగా ఉంచడంతోపాటు అన్ని రకాల సవాళ్లు సమర్థంగా ఎదుర్కోగల సత్తా రాజ్యాంగానికి ఉందని అంబేడ్కర్ బదులిచ్చారని పేర్కొన్నారు. పొరుగుదేశాలైన పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంకలో ఏం జరుగుతోందో చూడాలని, ఎన్ని సవాళ్లు ఎదురైనా మన దేశం మాత్రం దృఢంగా, ఐక్యంగానే ఉందని వివరించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సైతం ప్రసంగించారు. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనే గొప్ప బహుమతులను రాజ్యాంగం రూపంలో అంబేడ్కర్ మనకు అందించారని కొనియాడారు. ప్రజాస్వామ్యంలోని నాలుగు మూలస్తంభాలైన శాసన, కార్యనిర్వాహక, న్యాయ, మీడియా రంగాల బాధ్యతలు, హక్కులను రాజ్యాంగం స్పష్టంగా నిర్దేశించిందని వెల్లడించారు. కొలీజియంపై పదవీ విరమణ తర్వాత మాట్లాడుతా.. ముంబై: న్యాయమూర్తులకు పదోన్నతులు, నియామకాలు, కొలీజియం తీసుకుంటున్న నిర్ణయాలపై పదవీ విరమణ (ఈ ఏడాది నవంబర్ 24) చేసిన తర్వాత వివరంగా మాట్లాడతానని సీజేఐ జస్టిస్ బి.ఆర్.గవాయ్ చెప్పారు. ఇప్పుడు తనకున్న పరిమితుల దృష్ట్యా ఆయా అంశాలపై ఎక్కువగా స్పందించలేనని పేర్కొన్నారు. మనం కోరుకున్నట్లుగా ఏదీ జరగదని న్యాయమూర్తులు, న్యాయవాద వర్గాలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీ నగర్లో అడ్వొకేట్స్ అసోసియేషన్ ఆఫ్ బాంబే హైకోర్టు బెంచ్ ఆధ్వర్యంలో జస్టిస్ గవాయ్ని తాజాగా సన్మానించారు. మద్రాసు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా సేవలందించిన జస్టిస్ సంజయ్ వి.గంగాపూర్వాలాకు సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేసే అవకాశం దక్కలేదని అన్నారు. ఇదే కార్యక్రమంలో పాల్గొన్న సంజయ్ వి.గంగాపూర్వాలాను ఉద్దేశిస్తూ.. ‘‘సంజయ్ భాయ్.. సుప్రీంకోర్టుకు రాకపోవడం వల్ల మీరు నష్టపోయింది ఏమీ లేదు. సుప్రీంకోర్టే నష్టపోయింది. ఇంతకంటే ఎక్కువ చెప్పలేను’’ అని పేర్కొన్నారు. సుప్రీంకోర్టు, హైకోర్టుల్లో న్యాయమూర్తుల నియామకానికి ఉద్దేశించిన కొలీజియంలో సభ్యుడిగా చేరినప్పటి నుంచి ప్రతిభకే పట్టం కట్టేందుకు తన వంతు ప్రయత్నాలు చేస్తున్నానని చెప్పారు. ప్రతిభ ఆధారంగా న్యాయమూర్తులను నియమించడానికి తపన పడుతున్నానని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా హైకోర్టుల్లో ఉన్న ఉత్తమమైన ప్రధాన న్యాయమూర్తులు సుప్రీంకోర్టుకు న్యాయమూర్తులుగా రావాలన్నదే తన ఉద్దేశమని, అందుకోసం కొలీజియంలోని సహచర సభ్యులను ఒప్పిస్తుంటానని అన్నారు. జడ్జీల నియామకం కోసం పేర్లను ఒకసారి షార్ట్లిస్టు చేసే సమయంలో వారి కులం, మతం, ప్రాంతం చూసే అలవాటు లేదని చెప్పారు. వారికి అర్హత ఉందా? లేదా? వారికి చట్టాలు తెలుసా? లేదా? అనేది మాత్రమే చూస్తామని స్పష్టంచేశారు. జస్టిస్ ఏఎస్ చందూర్కర్ ఇటీవల బాంబే హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకు పదోన్నతిపై వచ్చారని, ఆయన తన పాత మిత్రుడేనని, గతంలో కలిసి పని చేశామని జస్టిస్ గవాయ్ వెల్లడించారు. ఆయనకు పదోన్నతి కలి్పంచే విషయంలో ఆ స్నేహాన్ని పక్కనపెట్టి, అర్హతలు మాత్రమే పరిగణనలోకి తీసుకున్నామని స్పష్టంచేశారు. -
అదో నాటకం
సాక్షి ప్రతినిధి, కడప: సమైక్య రాష్ట్ర సాధనే లక్ష్యంగా చిన్న పెద్దా తేడా లేకుండా ప్రజానీకం ఉద్యమించారు. ప్రజల కోసం ప్రాంతం కోసం ముందుండాల్సిన అధికార పక్ష నేతల్లో అప్పట్లో ఏమాత్రం చలనం లేదు. ప్రభుత్వాల మెడలు వంచి ప్రజాభిప్రాయానికి అనుగుణంగా పదవులను త్యాగం చేయడంలో వెనక్కి తగ్గారు. పార్టీ అధిష్టానాన్ని కాదని, ప్రజల వైపు మొగ్గు చూపలేకపోయారు. అసలు ఉన్నారో... లేదో తెలియకుండా వ్యవహరించారు. హ ఠాత్తుగా పార్లమెంటులో ధీరులుగా ఫోజులు ఇస్తూ పార్టీ నుంచి సస్పెన్షన్ అంటూ కొత్త నాటకానికి తెరలేపారు. పదవులే ధ్యేయంగా... పార్టీ విధేయులుగా... ఇంకో నెలలో కాలం తీరే పదవుల కోసం కాంగ్రెస్ పార్టీ ఎంపీ, ఎమ్మెల్యేలు, మం త్రులు ప్రాంతానికి తీరని ద్రోహానికి ఒడిగట్టారు. అధిష్టానం ఏక పక్ష నిర్ణయాన్ని ధిక్కరించి ప్రజల పక్షాన నిలవాల్సిన ప్రజాప్రతినిధులు చేష్టలుడిగి కూర్చుండి పోయారు. ప్రజాభీష్టం మేరకు పదవులను త్యజించి ఉద్యమ సారధ్య బాధ్యతలను భుజసంధాలపై వేసుకోవాల్సిన కాంగీయులు అధిష్టానం చేపట్టిన రాష్ట్ర విభజన గేమ్ ప్లాన్లో భాగస్వాములయ్యారు. ఆమేరకు నాటకాన్ని రక్తి కట్టిస్తున్నారని సమైక్యవాదులు విమర్శిస్తున్నారు. పదవులను త్యజించండి.. యూ పీఏ ప్రభుత్వాన్ని రాజకీయ సంక్షోభంలోకి నెట్టండని మొదటి నుంచి సమైక్యవాదులు మొత్తుకున్నా స్పందించని స్థితిలో రాజం పేట పార్లమెంటు సభ్యుడు సాయిప్రతాప్ ఉండిపోయారు. ఎమ్పీ హరికృష్ణ లాగా పదవీ త్యాగం చేసేందుకు వెనుకంజ వేశారని పలువురు పేర్కొంటున్నారు. ఉద్యమంలో ముఖం చాటేసి.. జిల్లాకు చెందిన మంత్రులు అహ ్మదుల్లా, రామచంద్రయ్య, రాజంపేట పార్లమెంటు సభ్యుడు సాయిప్రతాప్, ఎమ్మెల్యేలు డీఎల్ రవీంద్రారెడ్డి, కమలమ్మ, వీరశివారెడ్డి, ఎమ్మెల్సీ బత్యాల చెంగల్రాయుడు సమైక్య ఉద్యమం పట్ల ముఖం చాటేశారని పలువురు సమైక్యవాదులు ఆరోపిస్తున్నారు. ప్రజా ఉద్యమం ఉవ్వెత్తున నడుస్తున్న తరుణంలో ఉద్యమాన్ని దగ్గరుండి నిర్వహించాల్సిన నాయకులు అప్పట్లో జిల్లాలో కన్పించకుండా పోయారనే విమర్శలున్నాయి. ‘వీరు మా నేతలు... కన్పిస్తే చెప్పండీ పారితోషకం ఇస్తామంటూ’ సమైక్యవాదులు ప్రకటనలు సైతం ఇచ్చారు. అప్పట్లో ప్రత్యక్షంగా ప్రజలతో కలిసి పోరాటం చేయకుండా తెరచాటుకు వెళ్లా రు. ఇవేవి పట్టించుకోకుండా అధిష్టానం ఆడిన నాటకంలో భాగస్వాములుగా నిలిచారని పలువురు ఆరోపిస్తున్నారు. రాష్ట్ర విభజనకు కేంద్ర కేబినెట్ ఆమోదం చెప్పాక కూడా కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు పదవులను అంటిపెట్టుకొన్న ఉదంతాన్ని పలువురు ఉదహరిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెన్షన్ మంత్రాన్ని తెరపైకి తెచ్చి సమైక్యవాదులుగా గుర్తింపు పొం దేందుకు మాత్రమే తాపత్రయ పడుతున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.