breaking news
ts speaker
-
దుర్గమ్మ సన్నిధిలో తెలంగాణ స్పీకర్
విజయవాడ: ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన కనకదుర్గమ్మ వారిని తెలంగాణ శాసనసభ స్పీకర్ మధుసుధనాచారి సోమవారం దర్శించుకున్నారు. బెజవాడ దర్గమ్మ దర్శనానికి వచ్చిన స్పీకర్కు ఆలయ అధికారులు పూర్ణకుంభ స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం స్పీకర్ మాట్లాడుతూ దుర్గమ్మను దర్శించుకోవడం సంతోషంగా ఉంది. తెలుగు రాష్ట్రాల ప్రజలు సుఖఃసంతోషాలతో ఉండాలని అమ్మవారిని వేడుకున్నట్లు తెలిపారు. -
10 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
హైదరాబాద్ : మార్చి 10వ తేదీ నుంచి రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయని తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ ఎస్. మధుసూదనా చారి వెల్లడించారు. బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో భద్రతపై మంగళవారం హైదరాబాద్లో పోలీస్ ఉన్నతాధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా స్పీకర్ మధుసూదన చారి మాట్లాడుతూ... స్పీకర్ గ్యాలరీ పాస్లకు బార్ కోడింగ్... పబ్లిక్ గార్డెన్లో తెలంగాణ ఎమ్మెల్యేల వాహనాల పార్కింగ్ ఏర్పాటు చేయాలని పోలీస్ ఉన్నతాధికారులకు చెప్పారు. అలాగే ఈ నెల 10న గవర్నర్ ప్రసంగం, టీఎస్ బడ్జెట్ ఉంటుందన్నారు. ఎమ్మెల్యేలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని పోలీసులకు మధుసూదనా చారి సూచించారు.