breaking news
tranquilize
-
భయపెట్టి.. హతమార్చి.. చివరికిలా..
సాక్షి,చంద్రాపూర్: ఇరు రాష్ట్రాలను వణికించిన, అధికారులను ముప్పు తిప్పలు పెట్టిన మ్యాన్ ఈటర్.. ఎట్టకేలకు చిక్కింది. తెలంగాణ-మహరాష్ట్ర బార్డర్లో మనుషులనే లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడింది ఈ పులి. దీని బారిన పడి ఇద్దరు మృత్యువాత చెందారు. అయితే.. భారీగా సెర్చ్ ఆపరేషన్ నిర్వహించిన ఫారెస్ట్ అధికారులు చివరికి బ్రహ్మపురి అటవీ ప్రాంతంలో ఆ పులిని పట్టేసుకున్నారు. చంద్రపూర్ బ్రహ్మపురి తాలూకాలోని టోర్గావ్ ప్రాంతంలో పెద్దపులి సంచారం కలకలం రేపింది. దానిని ట్రేస్ చేసేందుకు అధికారులు తీవ్రంగా యత్నించారు. ఈ లోపు కేవలం రెండు రోజుల వ్యవధిలోనే ఇద్దరిని హతమార్చింది అది. నాగ్భిడ్ తాలూకాలోని టేక్రి షెట్శివార్లో డిసెంబర్ 30న ఒక మహిళపై దాడి చేసి చంపింది. ఆ వెంటనే 31 డిసెంబర్ 2022న బ్రహ్మపురి తాలూకాలోని టోర్గావ్ భుజ్ షెట్శివార్లో నివసించే మరో మహిళను దాడి చేసి చంపింది. ఈ ఘటనల నేపథ్యంలో బ్రహ్మపురి అటవీశాఖ ప్రాంతంలో అధికారులు ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేశారు. అయితే టోర్గావ్ వ్యవసాయ శివారులో మహిళను చంపిన ఘటనా స్థలంలో మళ్లీ పులి కనిపించింది. చంద్రాపూర్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ లొంకర్ ఆఫ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్, దీపేష్ మల్హోత్రా మార్గదర్శకత్వంలో బ్రహ్మపురి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సబ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్, షూటర్ బి.ఎమ్. వంకర్ తదితరులు పులిపై మత్తు ఇంజక్షన్ ప్రయోగించారు. అనంతరం బంధించి పులిని జూకు తరలించారు. ఈ పరిణామం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. -
పులికోసం ’ది గ్రేట్ ఆపరేషన్’
-
పులికోసం ’ది గ్రేట్ ఆపరేషన్’
రణతంబోర్: బావిలో పడిన ఓ ఆడపులిని రక్షించేందుకు అటవీ శాఖ అధికారులు గొప్ప ఆపరేషన్ నిర్వహించారు. అక్కడి గ్రామస్తుల సహాయంతో పులిని ప్రాణాలతో రక్షించారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. రణతంబోర్ నేషనల్ పార్క్ కు చెందిన టీ-83 (మెరుపు) అనే ఆడపులి ఖావా అనే గ్రామంలో ఉన్న ఒక బావిలో పడింది. ఈ విషయాన్ని గ్రామస్తులు అధికారులకు చెప్పడంతో వెంటనే రంగంలోకి రాజస్థాన్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అధికారులు దిగారు. ఎంతో క్లిష్టంగా దానిని వెలికి తీసే ఆపరేషన్ నిర్వహించారు. ఇందుకోసం వారు తాడు, వల, ఇనుప బోను, ఒక ఇనుప బొంగుల మంచాన్ని సిద్ధం చేసుకున్నారు. తొలుత ఇనుప బోనులోకి ఓ అధికారిని ఉంచి దానిని బావిలోకి దించగా అతను పులికి మత్తు మందు ఇచ్చాడు. ఆ వెంటనే మంచానికి నాలుగువైపులా తాడును కట్టి లోపలికి దించారు. దీంతో అతడు ఆ మంచంపై కూర్చుని పులిని వలలో బందించి మంచంపైకి ఎక్కించి బయటకు తీసుకొచ్చాడు. అనంతరం పార్క్ లోకి వదిలేశారు. ఈ ఆపరేషన్ నిర్వహించే సమయంలో పలువురు గ్రామస్తులు, పర్యాటకులు తమ కెమెరాలతో చుట్టుముట్టి ఉక్కిరి బిక్కిరి చేశారు.