breaking news
train cancellations
-
11 నుంచి ఏప్రిల్ 1 వరకు పలు రైళ్ల రద్దు
కాచిగూడ (హైదరాబాద్): రైళ్ల నిర్వహణ పనుల కారణంగా ఈ నెల 11వ తేదీ నుంచి 31వ తేదీ వరకు కాచిగూడ–కర్నూల్ సిటీ (17435), 12 నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు కర్నూల్ సిటీ – కాచిగూడ (17436) రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే హైదరాబాద్ డివిజనల్ మేనేజర్ (డీఆర్ఎం) సంతోష్ కుమార్ వర్మ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. 11 నుంచి 31 వరకు కాచిగూడ – రాయచూర్ –కాచిగూడ వయా దేవరకద్ర, కృష్ణా (67787, 67788), కాచిగూడ– రాయచూర్–కాచిగూడ వయా గద్వాల్ (17693, 17694) రైళ్లను రద్దు చేస్తున్నామని పేర్కొన్నారు. గద్వాల్ –రాయచూర్–గద్వాల్ (67784, 67783)ను రద్దు చేస్తున్నామని వివరించారు. -
రైళ్లు రద్దయితే.. ఎస్ఎమ్ఎస్
న్యూఢిల్లీ: భారతీయ రైల్వే వ్యవస్థ మరో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇక నుంచి రైళ్లు రద్దయితే.. ఆ తాలుకూ సమాచారాన్ని ప్రయాణీకుల మొబైల్ ఫోన్లకు ఎస్ఎమ్ఎస్(సంక్షిప్త సమాచారం) ద్వారా అందించనుంది. సంబంధిత రైల్వే స్టేషన్లలో అందుబాటులో ఉన్న రైళ్ల సమాచారం, వేళలు, వాటి రద్దు సమాచారాన్ని పూర్తి స్థాయిలో ప్రయాణికులకు అందించే ఉద్దేశంతో పైలెట్ ప్రాజెక్టుగా దీనిని ప్రారంభించింది. ప్రయాణీకుల సౌకర్యార్థం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించామని, దీనివల్ల రైళ్లు రద్దయితే వారు వెంటనే టిక్కెట్లు రద్దు చేసుకునే అవకాశం ఉంటుందని రైల్వే అధికారులు తెలిపారు. టిక్కెట్లు రిజర్వేషన్ చేయించుకునే సమయంలో ఏ ఫోన్ నెంబర్ ఇస్తారో దానికి మాత్రమే ఎస్ఎమ్ఎస్ వస్తుంది.


