Trafficked
-
పోలీసులపై దాడికి యత్నం
- ఇసుక ట్రాక్టర్ ఆపకుండా వెళుతుండగా.. - వెంటాడి పట్టుకున్న వన్టౌన్ పోలీసులు ప్రొద్దుటూరు క్రైం: ఇసుక మాఫి యా ఆగడాలు రోజు రోజుకూ పేట్రేగి పోతున్నాయి. అక్రమ రవాణా చేస్తున్న ఇసుక ట్రాక్టర్ను ఆపమని కోరిన పోలీసులపై సంబంధిత వ్యక్తులు దాడికి యత్నించారు. దీంతో వన్టౌన్ పోలీ సులు రూరల్ పోలీస్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు తెలిపిన తెలిపిన వివరాల మేరకు జమ్మలమడుగు ఆర్డీఓ కార్యాలయంలో సమావేశం ఉండటంతో ప్రొద్దుటూరు డీఎస్పీ పూజితా నీలం గురువారం బయలుదేరారు. బైపాస్రోడ్డులో ఇసుక ట్రాక్టర్ కనిపించడంతో పోలీసులకు ఫోన్ చేశారు. దీంతో రెవెన్యూ అధికారులతో కలిసి వచ్చిన పోలీసులు ఇసుక ట్రాక్టర్ను స్వాధీనం చేసుకొని తహశీల్దార్ కార్యాలయానికి తరలించారు. కొద్ది సేపటి తర్వాత వన్టౌన్ పోలీసులు దివాకర్, రాజు, సుబ్బయ్యలు బైపాస్రోడ్డులో వస్తున్న సమయంలో పెన్నా నదిలో నుంచి ఇసుక ట్రాక్టర్ వచ్చింది. ఆపమని పోలీసులు చెయ్యి ఎత్తగా వారు ఆపకుండా వేగంగా వెళ్లిపోయారు. దీంతో పోలీసులు మోటర్ బైక్లతో ట్రాక్టర్ను వెంటాడారు. చౌటపల్లె సమీపంలోకి వెళ్లగానే డ్రైవర్ రాజశేఖర్ ట్రాక్టర్ను ఆపి కంప చెట్లలోకి పారిపోయాడు. పోలీసులు ట్రాక్టర్ వద్దకు వెళ్లగానే ట్రాక్టర్ యజమానితో పాటు గ్రామంలోని పలువురు వ్యక్తులు పోలీసులను చుట్టుముట్టారు. ట్రాక్టర్ను తీసుకొని వెళ్లడం కాదు.. ముందు మీరు ఇక్కడి నుంచి ఎలా వెళ్తారో చూద్దాం అంటూ కేకలు వేశారు. మేమే బ్లేడుతో కోసుకొని మీపై ఎస్సీ ఎస్టీ కేసులు పెడతామంటూ బెదిరించారు. ఈ క్రమంలోనే ఒక వ్యక్తి అక్కడున్న ట్రాక్టర్ను తీసుకొని వెళ్లాడు. ఈ విషయాన్ని కానిస్టేబుళ్లు వన్టౌన్ సీఐ మహేశ్వరరెడ్డికి తెలిపారు. తర్వాత డీఎస్పీ సూచనతో ముగ్గురు కానిస్టేబుళ్లు దివాకర్, సుబ్బయ్య, రాజులు రూరల్ పోలీస్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు రాజశేఖర్, బాబు, దేవదాసులపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ జీఎండీబాషా తెలిపారు. -
మానవ అక్రమ రవాణాపై ఉక్కుపాదం
జిల్లా ఎస్పీ భాస్కర్ భూషణ్ ఏలూరు అర్బన్ : మానవ అక్రమ రవాణా అత్యంత హేయమని, దానిపై ఉక్కుపాదం మోపుతామని ఎస్పీ భాస్కర్ భూషణ్ స్పష్టం చేశారు. ఎవరైనా అక్రమ రవాణాకు పాల్పడితే వారిపై కఠినంగా వ్యవహరిస్తామన్నారు. అంతర్జాతీయ మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం స్థానిక హెల్ప్ సంస్థ కార్యాలయంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఎస్పీ పాల్గొని మాట్లాడారు. మానవ అక్రమ రవాణాలో జిల్లా రాష్ట్రంలో ముందువరుసలో ఉండడం బాధాకరమని ఎస్పీ తెలిపారు. దానిని నియంత్రించేందుకు, కారకులను గుర్తించి వారిపై ఉక్కుపాదం మోపుతామని హెచ్చరించారు. ఇప్పటివరకు తాము గుర్తించిన కేసుల్లో మహిళలు 59 శాతం, బాలికలు 17 శాతం కాగా బాలురు 10 శాతంగా ఉన్నారని వివరించారు. ఏలూరు డీఎస్పీ కేజీవీ సరిత మాట్లాడుతూ మానవ అక్రమ రవాణాదారులు పేద మహిళలను లక్ష్యంగా చేసుకుని ఉపాధి పేరిట మోసగించి గల్ఫ్ దేశాలకు తరలించి వారిని బలవంతాన వ్యభిచార కూపాల్లో నెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పేద వర్గాలకు చెందిన మహిళలు ఇలాంటి వారి పట్ల అప్రమత్తంగా మెలగాలని సూచించారు. బాలల సంక్షేమ న్యాయమూర్తుల పీఠం చైర్మన్ టీఎన్ స్నేహన్ మాట్లాడుతూ మానవ అక్రమ రవాణాను నిరోధించేందుకు పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరారు. బాలల రక్షణ విషయంలో సీడ బ్ల్యుసీదే తుది నిర్ణయంగా ఉండాలని అభిప్రాయపడ్డారు. అనంతరం ఎస్పీ మానవ అక్రమ రవాణా వ్యతిరేక పోస్టర్ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఐసీడీఎస్ సీడీపీవో సూర్యచక్రవేణి, డీసీఆర్బీ డీఎస్పీ పైడేశ్వరరావు, సీడబ్ల్యుసీ సభ్యులు పి.విజయనిర్మల, యు.రాజ్కుమార్, ఎస్ఎన్ కట్టా తదితరులు పాల్గొన్నారు.