-
ప్రచారంలో దుమ్ములేపుతున్న తమ్మినేని..
-
స్పీకర్ తమ్మినేని అదిరిపోయే స్పీచ్
-
చంద్రబాబుకు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన తమ్మినేని
-
ఎల్లో మీడియా రిపోర్టర్ ని ఒక్క రేంజ్ లో ఆడుకున్న స్పీకర్ తమ్మినేని
-
గ్రామ సచివాలయానికి శంకుస్థాపన చేసిన ఏపీ స్పీకర్
-
జర్నలిస్ట్ నుంచి ఈ స్థాయికి వచ్చాను: మంత్రి
సాక్షి, అమరావతి: విజయవాడలోని కల్చరల్ ఆఫ్ సొసైటీలో ఫోటోగ్రాఫర్ జర్నలిస్టుల అవార్డ్స్ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాంతో పాటు పలువురు ముఖ్య నేతలు పాల్గొని ఫోటో గ్రాఫర్లకు అవార్డులు అందించారు. ఈ సందర్భంగా వ్యవసాయశాఖ మంత్రి కన్నబాబు మాట్లాడుతూ.. తానూ ఒక జర్నలిస్ట్గా పని చేసి ఈ స్థాయికి వచ్చానని గుర్తుచేశారు. ఎక్కడి నుంచి వచ్చినా మన మూలాల్ని మర్చిపోకూడదని, రిపోర్టర్ కన్నా ఫొటోగ్రాఫి చాలా కష్టమైన పని అని అన్నారు. మాజీ సీఎం ఎన్టీ రామారావు చనిపోయినప్పుడు తాను జర్నలిస్టునని, అప్పుడు ఒక ఫొటోగ్రాఫర్.. ఎన్టీఆర్ కనురెప్ప నుంచి కారుతున్న నీటి బిందువును కెమెరాలో బంధించారని చెప్పారు. ఆ ఫొటో చూశాక తనకు ఫొటోగ్రాఫర్లపై మరింత గౌరవం పెరిగిందన్నారు. ఒకప్పుడు ఫోటోగ్రాఫర్స్ అందరితో కలిసి పనిచేసిన తాను.. ఇప్పుడు వారికే అవార్డు ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు. ఫోటోల సాక్ష్యంతోనే ఎన్నో కేసులు తీర్పులు ఇవ్వడం జరిగిందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా స్పీకర్ సీతారాం మాట్లాడుతూ.. ఫోటోగ్రాఫర్స్కి అవార్డు ఇవ్వడం చాలా సంతోషంగా ఉందన్నారు. ప్రపంచం అంతమయ్యేవరకు ఫోటోగ్రఫీ ఉంటుందని అభిప్రాయపడ్డారు. టూరిజం పరంగా విశాఖ రిషికొండని మరింత అభివృద్ధి చేయాలని ప్రత్యేక ప్రణాళిలు రచిస్తున్నట్లు తెలిపారు. వైఎస్ జగనమోహన్రెడ్డి సీఎంగా ప్రమాణ స్వీకారం సమయంలో తల్లి కొడుకుల భావోద్వేగాన్ని ఫొటోలో బంధించడం చాలా ఆనందంగా ఉందన్నారు.విజయవాడ నగరం అంతా ఫోటోగ్రాఫర్స్ పై ఆధారపడి ఉందిని ఎమ్మెల్యే మల్లాది విష్ణు చెప్పారు. ఫోటోగ్రాఫర్స్ కి అవార్డు ఇవ్వడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఆంధ్ర రాష్ట్ర అవతరణ రోజున ఫోటోగ్రాఫర్ ఫంక్షన్ జరగడం చాలా ఆనందరంగా ఉందని సంతోషం వ్యక్తం చేశారు. -
టీడీపీ ఆగడాలు
- రౌడీల్లా ప్రవర్తిస్తున్నారు - పోలీసులు సై అంటున్నారు - పరిషత్ పీఠాల కోసం అడ్డదారులు - బాబు దిగజారుడు రాజకీయాలు - వైఎస్సార్సీపీ నేత తమ్మినేని ధ్వజం విశాఖపట్నం : విశాఖలో తమ పార్టీ ఎంపీటీసీ, జెడ్పీటీసీలతో అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికలపై సమీక్షిస్తుండగా టీడీపీ కార్యకర్తలు వచ్చి రౌడీల్లా ప్రవర్తించారని వైఎస్సార్సీపీ నాయకుడు తమ్మినేని సీతారాం ఆరోపించారు. నగరంలో మంగళవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. టీడీపీ కార్యకర్తల తీరు హేయమైనదిగా సీతారాం అభివర్ణించారు. నియంత్రించాల్సిన పోలీసులు అధికార పార్టీ వారి అడుగులకు మడుగులొత్తుతున్నారని విమర్శించారు. వైఎస్సార్సీపీ ప్రజాప్రతినిధులపట్ల వారు దారుణంగా ప్రవర్తించారని ఆరోపించారు. ఫ్యాన్ గుర్తుపై గెలుపొందిన వారు పార్టీ ఫిరాయిస్తే సభ్యత్వం రద్దు చేయడంతో పాటు అనర్హత వేటు పడుతుందని సీతారాం హెచ్చరించారు. పార్టీ విప్ జారీ చేసిన సంగతిని గుర్తు చేశారు. పార్టీ గుర్తింపుపై సంబంధిత ఉత్తర్వులు జిల్లా కలెక్టర్లందరికీ అందాయన్నారు. పరిషత్ ఎన్నికల నేపథ్యంలో వైఎస్సార్ సీపీ ఎంపీటీసీలు, జెడ్పీటీసీలను టీడీపీ ప్రలోభాలకు గురిచేస్తోందన్నారు. ఫ్యాన్ గుర్తుపై గెలుపొందిన వారెవరైనా పార్టీ మారితే అనర్హత వేటు వేస్తామన్నారు. వైఎస్సార్సీపీ మెజార్టీ సాధించిన స్థానాల్లో మండల పరిషత్, జిల్లా పరిషత్ అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులు టీడీపీకి రావాలని చంద్రబాబు ఆయా ప్రాంతాల ఎమ్మెల్యేలు, ఎంపీలకు ఆదేశాలు ఇస్తున్నారని ఆరోపిం చారు. రౌడీయిజం చేసైనా అన్ని పదవులూ కైవసం చేసుకోవాలని నిస్సిగ్గుగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఎంపీటీసీ, జెడ్పీటీసీలకు స్వయంగా ఫోన్ చేసి పార్టీలో చేరాలని ప్రలోభపెట్టడం దిగజారుడుతనమని ఆక్షేపించారు. చంద్రబాబులా అసత్య ప్రచారా లు చేసుంటే వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చి ఉండేదన్నారు. రైతు రుణమాఫీ సాధ్యం కాదని తెలిసిన చంద్రబాబు రుణమాఫీ చేస్తామని అబద్ధాలాడారన్నారు. ఇప్పు డు రుణమాఫీ చేయడానికి కేంద్రం, రిజర్వ్బ్యాంక్ ఆఫ్ ఇండియా సహకరించడం లేదని చెప్పడం ఎంతవరకు సమంజసమన్నారు. సమావేశంలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు కిడారి సర్వేశ్వరరావు, బూడి ముత్యాలనాయుడు, గిడ్డి ఈశ్వరి, పార్టీ జిల్లా అధ్యక్షుడు బొడ్డేటి ప్రసాద్, నాయకులు గుడివాడ అమర్, చెంగల వెంకట్రావు, గండి బాబ్జి, కరణం ధర్మశ్రీ, పెట్ల ఉమాశంకర్ గణేష్, కర్రి సీతారాం, నాయకుడు కోరాడ రాజబాబు పాల్గొన్నారు.
ఓటర్ మిత్రమా.. జాగ్రత్త! ఆ సౌండ్ వస్తేనే మీరు ఓటేసినట్టు!
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
ఉద్దానానికి ఊపిరి
పెత్తందారులకు మళ్లీ షాకే!
పర్యాటకం కళకళ
పటిష్ట బందోబస్తు
72 ప్రత్యేక పోలింగ్ కేంద్రాలు
● రామగుండం కమిషనరేట్లో పర్యవేక్షణ కేంద్రం ● మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో మరింత అప్రమత్తం ● నిరంతరం పర్యవేక్షణ చేస్తున్న పోలీసు ఉన్నతాధికారులు
నేడే లోక్సభ పోలింగ్
రంగంపల్లిలో ఓటు వేయనున్న కలెక్టర్
ఉరుములు.. మెరుపులు
బైక్ నడిపి.. చాయ్ తాగి
తప్పక చదవండి
- ఉద్దానానికి ఊపిరి
- పర్యాటకం కళకళ
- పెత్తందారుల వెన్నులో వణకు తెప్పిస్తున్న కొత్తతరం..!
- నాడు చదువులు ఉత్త మిథ్య.. నేడు జీవితకాల భరోసా!
- బాబు షాక్కు.. జగన్ ట్రీట్మెంట్
- ఓటర్ మిత్రమా.. జాగ్రత్త! ఆ సౌండ్ వస్తేనే మీరు ఓటేసినట్టు!
- పవన్ వ్యూహానికి వంగా గీత కౌంటర్ వ్యూహమిదే..!
- సీఎం వైఎస్ జగన్ చేయూత.. పారిశ్రామికవేత్తలుగా మహిళలు
- RRRకి కమ్మటి దెబ్బ.. పరువు తీసేసిన బీజేపీ!
- దారి తప్పిన మేధావి.. ఎందుకీ మార్పు?
Advertisement