breaking news
Temporary staff
-
ఇండిగో కీలక నిర్ణయం.. టెన్షన్లో ప్రయాణికులు
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా ఇండిగో ఎయిర్లైన్స్ విమానాల రాకపోకలపై అంతరాయం కొనసాగుతోంది. గత మూడు రోజుల్లో వందల కొద్దీ సర్వీసులకు అంతరాయం కలిగింది. ఇవాళ ఇంకొన్ని విమానాలు రద్దు కాగా.. ఇంకొన్ని ఆలస్యంగా నడుస్తున్నాయి. బుక్ చేసుకున్న సర్వీసులు రద్దు కావడంపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ఇండిగో కీలక నిర్ణయం తీసుకుంది. ఇండిగో విమానాల్లో అంతరాయానికి సిబ్బంది కొరత.. సాంకేతిక సమస్యలు కారణమని చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో హైదరాబాద్ ఫ్లైయింగ్ అకాడమీల నుండి సిబ్బందిని తాత్కాలికంగా రిక్రూట్ చేసుకుంటోంది ఇండిగో. అయితే విమాన సిబ్బంది లేనప్పుడు ఫ్లైట్లను బుకింగ్స్లో ఎందుకు పెట్టారని ప్రయాణికులు ప్రశ్నిస్తున్నారు. టెంపరరీ అని తీసుకొస్తున్నారు.. అసలు వారికి శిక్షణ పూర్తి అయ్యిందో లేదో? అని మరికొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ అనుమానాలపై ఇండిగో అధికారికంగా స్పందించాల్సి ఉంది.మరోవైపు.. దేశవ్యాప్తంగా ఇండిగో ప్రయాణికుల అవస్థలు కొనసాగుతున్నాయి. శంషాబాద్ ఎయిర్పోర్టు వద్ద శుక్రవారం ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. నిన్న సాయంత్రం నుంచి వెయిటింగ్లో పడుతున్నారు. ఈ క్రమంలో సహనం నశించి.. సీఐఎస్ఎఫ్ సిబ్బందితో చెకింగ్ పాయింట్ వద్ద వాగ్వాదానికి దిగారు. పిల్లలతో పడిగాపులు పడుతున్నామని.. వేరే విమానంలో అయినా తమను తరలించాలని కోరుతున్నారు. ఎఫ్డీటీఎల్ (Flight Duty Time Limitations) రూల్స్ అనేవి డీజీసీఏ(Directorate General of Civil Aviation) రూపొందించిన నియమాలు. ఇవి పైలట్లు డ్యూటీ టైమింగ్స్తో పాటు కనీస విశ్రాంతి సమయం ఎంత ఉండాలి అనే విషయాల్ని నిర్దేశిస్తాయి. తాజాగా.. పైలట్లకు ఊరట ఇస్తూ ఈ రూల్స్లో మార్పులు చేశారు. అయితే.. ఇండిగో అనేది దేశంలోనే అతిపెద్ద ఎయిర్లైన్స్ సర్వీస్. రోజుకు 1,800 ఫ్లస్ సర్వీసులు నడుపుతోంది(మిగతావి అన్నీ కలిపి 200-400 సర్వీసులు మాత్రమే). అయితే దీనికి స్టాఫ్ కొరత మొదటి నుంచే ఉంది. ఈ క్రమంలో తాజా రూల్స్తో అది సంక్షోభ దిశగా అడుగులు వేసింది. దీంతో ఇండిగో డీజీసీఏను ఆశ్రయించింది. తమ విమానాల్లో కొన్నింటికి నిబంధనల నుంచి మినహాయింపు కోరినట్లు తెలుస్తోంది. -
ఉపాధికి పండుగ సీజన్!
న్యూఢిల్లీ: పండుగ సీజన్ అమ్మకాలను దృష్టిలో ఉంచుకుని ఈ–కామర్స్ కంపెనీలు, డెలివరీ సేవల సంస్థలు గణనీయంగా తాత్కాలిక సిబ్బందిని తీసుకుంటున్నాయి. ఈ–కామర్స్ దిగ్గజం అమెజాన్ ఇండియా దేశవ్యాప్తంగా సుమారు ఒక లక్ష పైచిలుకు సీజనల్ ఉద్యోగావకాశాలు కల్పించినట్లు వెల్లడించింది. అలాగే, రవాణా భాగస్వామ్య సంస్థలు, ప్యాకేజింగ్ వెండార్లు, డెలివరీ భాగస్వాములు, అమెజాన్ ఫ్లెక్స్ పార్ట్నర్స్, హౌస్కీపింగ్ ఏజెన్సీల ద్వారా పరోక్షంగా వేల సంఖ్యలో ఉపాధి అవకాశాలు కల్పించగలిగినట్లు తెలిపింది. సాంకేతికత, మౌలిక సదుపాయాలు, లాజిస్టిక్స్ మొదలైన వాటిపై పెట్టుబడులు కొనసాగించడం ద్వారా 2025 నాటికి భారత్లో 10 లక్షల కొత్త ఉద్యోగావకాశాలు కల్పించాలనే లక్ష్యసాధనకు ఇవి తోడ్పడనున్నాయని అమెజాన్ తెలిపింది. ‘ఈ పండుగ సీజన్లో దేశం నలుమూలలా ఉన్న కస్టమర్లకు అత్యంత వేగవంతంగా, సురక్షితంగా ఉత్పత్తులను చేర్చడం ద్వారా మరింత మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తున్నాం‘ అని అమెజాన్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ అఖిల్ సక్సేనా తెలిపారు. డెల్హివెరీలో ఇలా... సరఫరా సేవల సంస్థ డెల్హివెరీ కూడా వచ్చే కొద్ది వారాల్లో వివిధ విభాగాల్లో 15,000 పైచిలుకు సీజనల్ సిబ్బందిని తీసుకోనున్నట్లు వెల్లడించింది. రాబోయే పండుగ సీజన్లో దాదాపు 6.5–7.5 కోట్ల ప్యాకేజీలను హ్యాండిల్ చేసేందుకు సన్నాహాలు చేసుకున్నట్లు తెలిపింది. గతేడాదితో పోలిస్తే ఇది 100% అధికమని వివరించింది. ‘ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాల కల్పనపై గణనీయంగా పెట్టుబడులు పెడుతున్నాం. గడిచిన ఏడాది కాలంలో బిలాస్పూర్, బెంగళూరు, భివండి వంటి ప్రాంతాల్లో మెగా ట్రక్ టెర్మినల్స్ను కూడా ఏర్పాటు చేసుకున్నాం. వచ్చే 18–24 నెలల్లో విస్తరణపై దాదాపు రూ. 300 కోట్లు ఇన్వెస్ట్ చేయబోతున్నాం‘ అని డెల్హివెరీ ఎండీ సందీప్ బరాసియా వెల్లడించారు. మూడు లక్షల ఉద్యోగ అవకాశాలు : రెడ్సీర్ ఈ ఏడాది పండుగ సీజన్లో ఈ–కామర్స్, లాజిస్టిక్స్ సంస్థల ద్వారా దాదాపు మూడు లక్షల పైచిలుకు ఉపాధి అవకాశాల కల్పన జరగవచ్చని కన్సల్టెన్సీ సంస్థ రెడ్సీర్ అంచనా వేస్తోంది. వీటిలో 30 శాతం ఉద్యోగాలు లాజిస్టిక్స్ సంస్థల్లో ఉండనున్నాయి. ఈ పండుగ సీజన్లో ఆన్లైన్లో అమ్ముడయ్యే ఉత్పత్తుల స్థూల విలువ (జీఎంవీ) దాదాపు 7 బిలియన్ డాలర్ల పైచిలుకు ఉంటుందని రెడ్సీర్ అంచనా. గతేడాది ఇది 3.8 బిలియన్ డాలర్లుగా నమోదైంది. ఎలక్ట్రానిక్స్, ఫ్యాషన్, హోమ్ ఫర్నిషింగ్ మొదలైన ఉత్పత్తులకు గణనీయంగా డిమండ్ ఉంటుందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. -
ఏడాదిగా జీతాల్లేవ్!
పాలకొండ: అవుట్ సోర్సింగ్ సిబ్బందికి చాకిరీ తప్ప చిల్లిగవ్వ అందడంలేదు. రెవెన్యూ శాఖలో కంప్యూటర్ ఆపరేటర్లుగా పని చేస్తున్న తాత్కాలిక సిబ్బందికి గత 12 నెలలుగా వేతనాలు చెల్లించకపోవడంతో వారి అవస్థలు వర్ణనాతీతం. జిల్లావ్యాప్తంగా ఇదే పరిస్థతి కొనసాగుతోంది. పైగా వేతనాలు అడిగితే సాగనంపుతామని అధికారులు భయపెడుతున్నారని వీరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెవెన్యూ శాఖలో సిబ్బంది కొరత, పని ఒత్తిడిని దృష్టిలో ఉంచుకొని తాత్కాలిక సిబ్బందిని నియమించారు. 2008లో అవుట్ సోర్సింగ్ విధానం ప్రవేశపెట్టి కంప్యూటర్ ఆపరేటర్లను నియమించారు. చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్(సీసీఎల్ఏ) పరిధిలో వీరిని కొనసాగిస్తున్నారు. ఇలా జిల్లా వ్యాప్తంగా రెవెన్యూ కార్యాలయాల్లో 64మంది అవుట్ సోర్సింగ్ సిబ్బంది పనిచేస్తున్నారు. వెబ్ ల్యాండింగ్, మీ-సేవ, భూ వివరాల నమోదు వంటి కీలక కార్యకలాపాలకు వీరినే వినియోగిస్తున్నారు. ఈ శాఖలోని రెగ్యులర్ సిబ్బందికి కంపూటర్లపై అంతగా అవగాహన లేకపోవడంతో వీరే కీలకంగా మారారు. మీ సేవ ధ్రువపత్రాల జారీలోనే వీరే ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. 12 నెలలుగా..... అన్ని పనులకూ అవుట్ సోర్సింగ్ సిబ్బందినే వినియోగించుకుంటున్న అధికారులు వారికి వేతనాలు చెల్లించడంలో మాత్రం చొరవ తీసుకోవడం లేదు. ప్రతి వేతనాలు అందుతాయని ఆశగా ఎదురు చూడటం, తీరా అవి అందకపోవడంతో ఉసూరుమనడం.. మళ్లీ అదే ఆశతో కాలం వెళ్లదీయడం తమకు నిత్యకృత్యంగా మారిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అప్పులు చేసి కుటుంబాలను నెట్టుకొస్తున్నామని, 12 నెలలు దాటిపోవడంతో ఇప్పుడు అప్పులు పుట్టే పరిస్థితి కూడా లేదని వాపోతున్నారు. ఇప్పటికే పలుమార్లు అధికారులకు విన్నవించామని తెలిపారు. బెదిరింపులు మొదలు... వేతనాలు ఇవ్వకపోగా ప్రస్తుతం వీరికి బెదిరింపులు మొదలయ్యాయి. వేతనాలు చెల్లించనందుకు నిరసనగా ఆందోళన చేపట్టాలని ఇటీవల అవుట్ సోర్సింగ్ సిబ్బంది భావించారు. యూనియన్ ఆధ్వర్యంలో చర్చలు జరిపారు. సమావేశం నిర్వహించి విధులు భహిష్కరించాలని యోచించారు. అయితే ఉన్నతాధికారులు వీరిని హెచ్చరికలతో భయపెట్టారు. ఇప్పటికే పలు శాఖల్లో అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను తొలగిస్తున్న విషయాన్ని గుర్తుచేశారు. ఈ సమయంలో నిరసన తెలియజేస్తే ఉన్న ఉద్యోగాలు ఊడిపోతాయని హెచ్చరించారు. దీంతో దిక్కుతోచని స్థితిలో వీరంతా విధులు నిర్వహిస్తున్నారు.


