breaking news
Telangana Cultural Association (TCA)
-
సిండా తరపున దీపావళి కానుకలను పంపిణీ చేసిన సింగపూర్ తెలంగాణ కల్చరల్ సొసైటీ
తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్) సభ్యులు సింగపూర్ ఇండియన్ డెవలప్మెంట్ అసోసియేషన్ (సిండా) తరపున దీపావళి గూడీ బ్యాగ్లను సింగపూర్లో పంపిణీ చేయడం జరిగింది. భారత దేశ మూలాలు ఉన్న ఆర్థికంగా వెనుకబడిన సింగపూర్ పౌరులకు సిండా వారు ప్రతీ సంవత్సరం దీపావళి పండుగ జరుపుకోవడానికి సహాయం చేస్తుంది. ఇందులో బాగంగా ఈ ఏడాది దీపావళి అలంకరణకు సంబందించిన సామాగ్రి తో పాటు కొన్ని తినుబండారాలు 120 డాలర్లు పండుగ ఖర్చుల నిమిత్తం అందజేసింది. అయితే సింగపూర్ ఇండియన్ డెవలప్మెంట్ అసోసియేషన్ (సిండా) పిలుపు మేరకు ఈ సంవత్సరం ఒక వారం రోజుల పాటు, 05 నవంబర్ నుండి 11 నవంబర్ వరకు దీపావళి సామాగ్రిని పంపిణీ చేయడానికి ముందుకు వచ్చిన తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్) సభ్యులను సింగపూర్ ఇండియన్ డెవలప్మెంట్ అసోసియేషన్ వారు అభినందించారు. ఈ కార్యక్రమం లో స్వచ్ఛదంగా పాల్గొన్న సొసైటీ అధ్యక్షులు గడప రమేశ్ బాబు, ఇతర సభ్యులు రావుల సుగుణాకర్ రెడ్డి, కార్యవర్గ సభ్యులు వెంగళ విజయ మోహన్, పలిక ప్రణీష్, పెరుకు శివ రామ్ ప్రసాద్ మరియు ప్రధాన కార్యదర్శి బసిక ప్రశాంత్ కుమార్ మొదలగు వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బాలుడు గడప కౌశల్ చంద్ర ఉత్సాహంగా పాల్గొనడం ఎంతో అభినందించదగిన విషయం అని సింగపూర్ ఇండియన్ డెవలప్మెంట్ అసోసియేషన్ వారు అన్నారు. (చదవండి: ఫైర్ డిటెక్షన్ పరికరాన్ని కనిపెట్టిన భారత సంతతి విద్యార్థి!) -
కాలిఫోర్నియాలోని శాన్ రామన్ లో ఘనంగా బతుకమ్మ సంబరాలు
-
శాన్ రామన్ లో ఘనంగా బతుకమ్మ సంబరాలు
-
శాన్ ఫ్రాన్సిస్కోలో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ వేడుకలు
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు శాన్ ఫ్రాన్సిస్కోలో ఘనంగా నిర్వహించారు. ఇక్కడి బే ఏరియాలో తెలంగాణ కల్చరల్ అసోసియేషన్ (టీసీఏ) ఆధ్వర్యంలో పలువురు ఎన్ఆర్ఐల సహకారంతో ఈ సంబరాలు జరిగాయి. గత 14 ఏళ్లుగా తెలంగాణ సంస్కృతిని ప్రతిభింబించేలా టీసీఏ, ఎన్ఆర్ఐలు పలు స్వచ్ఛంద కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా శాన్ జోస్ లోని చారిత్రక గౌడలుపే పార్క్ లో హరితహారం కార్యక్రమం నిర్వహించారు. పార్క్ పరిశుభ్రతకు శ్రమదానం చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణాలు అర్పించిన అమరుల త్యాగాలను ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. ఒక నిమిషం పాటు మౌనం వహించారు. తెలంగాణ త్వరితగతిన అభివృద్ధి చెందేందుకు అమెరికాలోని ఎన్నారైలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఆసియాలోనే తెలంగాణ అత్యుత్తమ రాష్ట్రంగా మారాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా భాస్కర్ కల్వ తెలంగాణ జానపద గేయాన్ని చక్కగా ఆలపించారు. ధనుంజయ బోడ కుటుంబం తెలంగాణ వంటకాలైన అరిసెలు, సకినాలను తెచ్చి అందరకీ రుచి చూపించారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాల్లో ఎన్ఆర్ఐల పిల్లలు నేహారెడ్డి బోడ, శ్రేయ్ కొత్త, అమిత్ మెట్టపల్లి, హన్నాలు స్వచ్ఛందంగా వాలంటీర్లుగా ముందుకొచ్చి పనిచేశారు. టీసీఏ వ్యవస్థాపక సభ్యుడు బిక్షం పాలబిందెల, శ్రీనివాస్ గుజ్జు, చందు సిరామదాస్, విజయలక్ష్మి కనికరం, తదితరులు ఈ కార్యక్రమం విజయవంతం కావడంలో కృషిచేసిన వాలంటీర్ల సేవలను కొనియాడారు. టీసీఏ వ్యవస్థాపక సభ్యులు విజయ్ చవ, టీసీఏ అధ్యక్షులు ధనంజయ బోడ, సబితా బోడ, మహిపాల్ అన్నం, వినోయ్ మేరెడ్డి, సాగర్ కొత్త, ప్రవీణ్ గరపల్లి, విష్ణు మెట్టపల్లి, సుశీల్.కె, క్రిష్ణమూర్తి వేముల, భాస్కర్ కల్వ, సుస్మిత అన్నాడి, రవి అనంత, తదితరులు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలలో పాల్గొన్నారు.