-
స్వైపింగ్ దందా...
కోహెడరూరల్(హుస్నాబాద్) : కోహెడ మండలానికి చెందిన బోలుమల్ల రామయ్య ఒక సాధారణ రైతు. అయన బ్యాంకు ఖాతాలో రూ. 19000 వేలు ఉన్నాయి. ఇటీవల పంట కోత కోసం డబ్బులు కావాలని మండల కేంద్రలోని రెండు ఏటీఎం తిరిగాడు. ఏటీఎంలో డబ్బులు లేకపోవడంతో పని కాలేదు. రామయ్యకు తెలిసిన వ్యక్తి ఒకరు ఒక షాపు అడ్రస్ చెప్పాడు. అయన వద్దకు వెళ్లిన రామయ్య ఏటీఎం ఇచ్చి 14వేలు కావాలని చెప్పాడు. దీంతో సదరు యజమాని తన ఖాతాలోని 14వేలు తీసి 13,600 రామయ్యకు ఇచ్చాడు. డబ్బులు లెక్కపెట్టిన రామయ్య 400 తక్కువగా ఉన్నాయని ఆడగగా మీకు పుణ్యానికి డబ్బులు ఇవ్వడానికి ఎమైనా ధర్మసత్రం నడుపుతున్నానా మీకు డబ్బులు ఇచ్చినందుకు మాకు ట్యాక్సులు పడుతాయి. మా ఆకౌంట్లో డబ్బులు వాడినందుకు రేపు లేనిపోని తలనొప్పులు వస్తాయని కోపగించకున్నాడు. ఇలాంటి రామయ్యలు రోజుకు వందల సంఖ్యలో ఇబ్బంది పడుతున్నారు. జిల్లాలో నగదు సమస్య పీడిస్తుంది. డబ్బుల కోసం సామాన్యులు నానా పాట్లు పడతున్నారు. వారి అవసరాలను కొందరు వ్యాపారులు సొమ్ము చేసుకుంటున్నారు. నగదు రహిత లావాదేవీల కోసం తీసుకున్న స్వైపింగ్ మిషన్ల ద్వారా కమీషన్పై డబ్బులు ఇస్తూ దందా చేస్తున్నారు. నగదు రహత లావాదేవీలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం వ్యాపార సముదాయలలో స్వైపింగ్ మిషన్లు ఏర్పాటు చేయాలని ఆదేశించింది. కొందరు వ్యాపారులు ఈ స్వైపింగ్ మిషన్లు వ్యాపారానికే కాకుండా కమీషన్కు డబ్బులు ఇచ్చేందుకు ఉపయోగిస్తున్నారు. వ్యాపార సంస్థలే కాకుండా పెట్రోల్ బంకులు, వైన్షాపులు తదితర కమీషన్ వ్యాపారం జోరుగా సాగుతుంది. స్వైపింగ్ ద్వారా లావాదేవీలు జరిపితే ఎలాంటి కమీషన్ తీసుకోవద్దని బ్యాంకర్లు సూచిస్తున్నా పలువురు వ్యాపారులు ఇలా విని అలా వదిలేస్తున్నారు. డబ్బులు దొరక్కపోవడంతో... పంట కోతలున్నాయి. చేతిల డబ్బులు లేవు. ఏటీఎంలో సరిపడా డబ్బులు రాకపోవడంతో ప్రైవేట్ వ్యాపారులను ఆశ్రయిస్తున్నాం.స్వైపింగ్ ద్వారా అయితే 5 నిమిషాల్లొ డబ్బులు ఇస్తున్నారు. డబ్బులు పోతే పోయినాయి. కానీ అవసరాలు గట్టేకుతున్నాయి. –బోలమల్ల మహేందర్, స్థానికుడు కమీషన్ తీసుకున్న వారిపై చర్యలు తీసుకోవాలి స్వైపింగ్ ద్వారా కమీషన్ తీసుకుంటున్న వారిపై చర్యలు తీసుకోవాలి. ప్రజల అవసరాలను ఆసరాగా చేసుకోని వ్యాపారుల వద్దకు వెళ్తే స్వైపింగ్ మిషన్ ద్వారా కమీషన్ వసూలు చేస్తున్నారు. మా డబ్బులు తీసుకోవడానికి కూడా కమీషన్ ఇవ్వాల్సి వస్తోంది. –బి.శ్రీనివాస్, వరికోలు -
మార్కెట్ యార్డులకు స్వైప్ మిషన్లు
పెద్దపల్లిరూరల్ : తెలంగాణ రాష్ట్రంలోని అన్ని వ్యవసాయ మార్కెట్యార్డులలో నగదు రహిత లావాదేవీలు నిర్వహించేందుకు ప్రభుత్వం స్వైప్ మిషన్లను అందజేసింది. మార్కెట్యార్డుల్లో క్రయ, విక్రయాలకు సంబంధించిన చెల్లింపులు అప్పటికప్పుడే స్వైప్ మిషన్ల ద్వార జరుపుకునేందుకు ఈ పద్ధతిన అవకాశం ఉంటుందని పెద్దపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ గుండేటి ఐలయ్య తెలిపారు. పెద్దపల్లి యార్డుకు కేటాయించిన స్వైప్ మిషన్ ను సోమవారం ఆయన పరిశీలించి అనుసరించాల్సిన పద్ధతుల గురించి ఉద్యోగులను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర మార్కెటింగ్ శాఖ మంత్రి హరీశ్రావు తన సొంత నియోజకవర్గాన్ని నగదురహిత లావాదేవీలు జరపడంలో ముందుంచినట్టే మార్కెటింగ్శాఖలోనూ ఆ దిశగా చర్యలు తీసుకున్నారని పేర్కొన్నారు. మొదలైన ‘నామ్’ సేవలు రాష్ట్రంలోని 44 వ్యవసాయ మార్కెట్యార్డులలో ఆన్ లైన్ పద్ధతిన పంట దిగుబడుల లావాదేవీలు నిర్వహించేందుకు నామ్ సేవలను ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. ఇందులో భాగంగా పెద్దపల్లి మార్కెట్యార్డులో సోమవారం తొలిసారిగా క్రయ, విక్రయాలను ఆన్ లైన్ లో నమోదు చేశారు. మార్కెట్ యార్డుకు 51మంది రైతులు సోమవారం తెచ్చిన 218 క్వింటాళ్ల పత్తిని ఆన్ లైన్ పద్ధతిన విక్రయించారు. ఈ మేరకు రైతులకు ఆన్ లై న్ కొనుగోళ్లపై అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకున్నట్లు మార్కెట్ కమిటీ చైర్మన్ ఐలయ్య, సూపర్వైజర్ శంకరయ్య తెలిపారు. పెద్దపల్లి మార్కెట్యార్డులో పూర్తిస్థాయిలో ఆన్ లైన్ సేవలు, నగదురహిత లావాదేవీలు అమలు చేస్తామని పేర్కొన్నారు. 218 క్వింటాళ్ల పత్తి కొనుగోలు పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్యార్డు ఆవరణలో సోమవారం 218 క్వింటాళ్ల పత్తికొనుగోళ్లు జరిగాయి. 51 మంది రైతుల ద్వార యార్డుకు వచ్చిన పత్తికి క్వింటాలు ధర రూ.5460 అత్యధికంగా నమోదు కాగ, కనిష్టంగా రూ.5050 గా నమోదైందని మార్కెటింగ్ అధికారులు తెలిపారు. సరాసరి ధరను రూ.5350గా నిర్ధారించినట్లు పేర్కొన్నారు. -
స్వైప్ మిషన్.. మాకొద్దు బాబోయ్ !
- రైతు బజార్లో స్వైప్ మిషన్ల ఏర్పాటుకు మార్కెటింగ్ శాఖ ప్రయత్నం - నిర్వహించలేమంటున్న రైతులు, పొదుపు మహిళలు - కొనుగోలుదారులకూ కష్టమే - స్వైప్ మిషన్లు ఉంటేనే అమ్మకాలకు అనుమతి అంటూ అధికారుల బెదిరింపు ఒకప్పుడు రైతు బజార్లో ఎలక్ట్రానిక్ కాటా తప్పని సరిగా ఉపయోగించాలంటే మావల్ల కాదన్న గ్రామీణ రైతులు ఇప్పుడు స్వైప్ మిషన్లు తప్పదని అధికారులు ఆదేశించడంతో మాకొద్దు బాబోయ్ అంటున్నారు. రైతు బజార్లో రూ. 1 మొదలు కొని రూ. 70..80.. ధర ఉండే ఉత్పత్తులను కొనుగోలుదారులు ఒక్కో వ్యాపారి వద్ద ఒక్కో రకం తీసుకుని చిల్లర ఇస్తుంటారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు రూ. 500ఽకు మించి వ్యాపారం జరగదు. ఇలాంటి తరుణంలో స్వైప్ మిషన్లు తప్పనిసరి అని మార్కెటింగ్ శాఖ హెచ్చరిస్తున్న నేపథ్యంలో విక్రయదారులు బెంబేలెత్తుతున్నారు. అసలు రైతుబజార్లో నగదు రహిత లావాదేవీలు నిర్వహించడం సాధ్యమేనా అనే అనుమానం వ్యక్తమవుతోంది. - కర్నూలు(అగ్రికల్చర్) మార్కెటింగ్ శాఖ కమిషనర్ అన్ని రైతుబాజర్లలో విధిగా నగదురహిత లావాదేవీలు నిర్వహించాలని మార్కెటింగ్ అధికారులు, ఎస్టేటు ఆఫీసర్లకు ఆదేశాలు జారీ చేయడంతో వీరు రైతులపై తీవ్ర స్థాయిలో ఒత్తిడి తెస్తున్నారు. కర్నూలులో మూడు, నంద్యాల, ఆదోనిలో ఒక్కొక్కటి ప్రకారం మొత్తం ఐదు రైతుబజార్లు ఉన్నాయి. వీటిన్నింటిలో నగదురహిత లావాదేవీల నిర్వహణకు రైతులు స్వైప్ మిషన్లు ఏర్పాటు చేసుకోవాలని మార్కెటింగ్ శాఖ తప్పనిసరి అని చెప్పడంతో రైతుల ఆందోళన అంతా..ఇంతా కాదు. అసలు నగదు రహిత లావాదేవీలు అంటే ఏమి? స్వైప్ మిషన్ ఎలా పని చేస్తుంది? డబ్బులు ఖాతాల్లో ఎలా జమ అవుతాయి...వాటిని ఎలా తీసుకోవాలి? ఇలా ఎన్నో అనుమానాలతో రైతులు, పొదుపు మహిళలు స్వైప్పై మొగ్గు చూపడం లేదు. రైతు బజార్లో రూ.10, రూ.20 మేర కొనుగోలు చేసే వారు స్వైప్ ఉపయోగించడం ఎలా వీలు అవుతుందని వ్యాపారులు ప్రశ్నిస్తున్నారు. నెలసరి నిత్యావసర సరుకులు ఒకే దుకాణంలో రూ.1500 నుంచి రూ2000 వరకు కొనుగోలు చేస్తారు. అక్కడ ఈ మిషన్లు ఉపయోగించడం సులువు కానీ రైతు బజార్లో సాధ్యం కాదని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. నిరక్ష్యరాస్యతతో నిర్వహణ ఎలా: రైతు బజార్లో కూరగాయలు అమ్ముకునే రైతులు, పొదుపు మహిళలు దాదాపు నిరక్షరాస్యులే. వీరికి నగదు రహితంపై అసలు కనీస అవగాహన లేదు. తూకంలో కూడా కిలో.. అర కిలో రాళ్లనే ఉపయోగిస్తారు. ఎలకా్ట్రనిక్ కాటాను ఉపయోగించలేని వారు సై్వప్ మిషన్ను ఎలా నిర్వహిస్తారనే అనుమానం వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలోనే మార్కెటింగ్ అధికారులు బలవంతంగా స్వైప్ మిషన్ల ఏర్పాటుకు రైతులపై ఒత్తిడి చేస్తున్నారు. స్వైప్ మిషన్లు లేకపోతే రైతుబజార్లో కూర్చోనివ్వమని బెదిరిస్తున్నారు. రైతుబజార్లలో దళారీలు తిష్టవేశారు. మార్కెటింగ్ అధికారులు వీరిని వదలి వారంలో కేవలం రెండు, మూడు రోజలు మాత్రమే కూరగాయలు అమ్మకునే రైతులు, పొదుపు మహిళలను స్వైప్ మిషన్ల పేరుతో వేధిస్తున్నారు. మాకెందుకు కరెంట్ ఖాతాలు అంటూ చెబుతున్నా తీసుకోవాల్సిందేనంటూ ఒత్తిడి చేస్తున్నారు. వినియోగదారులు కూడా రైతుబజార్లలో స్వైప్ మిషన్లు వాడటానికి ఆసక్తి చూపటం లేదు. ఒకచోట అయితే వాడుతాము.. కూరగాయలు ఐదారుగురు దగ్గర కొంటే అందరి దగ్గర వాడాలంటే ఎలా సాధ్యం అవుతుందని ప్రశ్నించారు. నో క్యాష్ నేపథ్యంలో విత్డ్రా ఎలా: రూ.500, 1000 నోట్ల రద్దుతో ఇప్పటికే బ్యాంకుల్లో నగదు నిల్వలు పూర్తిగా పడిపోయాయి. ఖాతాల్లో ఉన్న డబ్బును తీసుకోవాలంటే చుక్కలు కనిపిస్తున్నాయి. దాదాపు అన్ని బ్యాంకుల్లోను నో క్యాష్ బోర్డులు కనిపిస్తున్నాయి. నగదు ఉన్నా... రూ.2000 నుంచి 4000 మించి ఇవ్వడం లేదు. స్వైప్మిషన్లను వినియోగించడం ద్వారా నగదు ఖాతాల్లో జమ అయితే తీసుకోవడం ఎలా అని ఆవేదన చెందుతున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు కూరగాయలు అమ్మగా వచ్చిన డబ్బును పొలం వద్ద కూలీలకు ఎలా చెల్లించాలని ప్రశ్నిస్తున్నారు. స్వైప్ మిషన్లు తప్పనిసరి: సత్యనారాయణ చౌదరి ఏడీఎం అన్ని రైతుబజార్ల్లో స్వైప్ మిషన్లు ఏర్పాటు చేసుకునే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ నెల చివరిలోగా ప్రతి ఒక్కరు కరెంట్ ఖాతాలు ప్రారంభించి స్వైప్ మిషన్లు పెట్టుకునే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. సిండికేట్ బ్యాంకు, జిల్లా సహకార కేంద్రబ్యాంకు, ఎస్బీహెచ్, ఆంధ్రాబ్యాంకు, ఏపీజీబీల్లో కరెంట్ ఖాతాలు ప్రారంభించాలని చెబుతున్నాం. ప్రస్తుతానికి 25 మంది రైతులు, 24 పొదుపు గ్రూపుల మహిళల చేత స్వైప్ మిషన్లు పెట్టిస్తున్నాం. రైతుబజార్ల్లో నగదురహిత లావాదేవీలు నిర్వహించాలనేది లక్ష్యం. స్వైప్ మిషన్ కష్టమే: శ్రీనివాసగౌడు నందనపల్లి కర్నూలు మండలం నేను వారంలో రెండుమూడు రోజులే కూరగాయలు అమ్ముకుంటాను. నాకు చదువు రాదు. మా దగ్గర ఒక్కొక్కరు ఒక్కో రకం కూరగాయలు కొంటారు. వీటికి నగదు రహిత లావాదేవీలు నిర్వహించాలని అధికారులు చెబుతున్నారు. కరెంటు ఖాతా ప్రారంభించాలం. ఉదయం నుంచి సాయంత్రం వరకు కూర్చుంటే రూ.500 వ్యాపారం జరుగదు. మాకెందుకు స్వైప్ మిషన్లు. డబ్బు పడితే తీసుకునేదెలా: విజయ, పడిదెంపాడు కూరగాయలు కొంటానికి వచ్చిన వారు ఎక్కడ ఏది బాగా ఉంటే అక్కడే కొనుక్కుంటారు. రైతుబజారుకు వచ్చిన వారు కనీసం ఐదారు మంది దగ్గర కూరగాయలు కొంటారు. అందరి దగ్గర మిషన్లను వాడాలంటే సాధ్యం కాదు. మాకు వ్యాపారాలపైనే దృష్టి ఉంటుంది. మిషన్ల ద్వారా ఎలా తీసుకుంటాము. బ్యాంకు ఖాతాల్లో డబ్బులు పడితే తీసుకోవడం ఎలా... బ్యాంకుల్లో డబ్బులు లేకపోతే ఎలా ఇస్తారు. ఈ వ్యాపారాలకు మిషన్లు సరిపోవు. ఒత్తిడి చేయడం మంచిది కాదు: మద్దమ్మ, భూపాల్నగర్ కరెంటు ఖాతాలు ప్రారంభించాలని, మిషన్లు తెచ్చుకోవాలని అధికారులు మహిళలపై ఒత్తిడి తెస్తున్నారు. మాకు చదువు రాదు. కరెంటు ఖాతాలు... స్వైప్ మిషన్ల పేర్లే వినలేదు. కనీస అవగాహన కూడ లేకపోతే వాటిని ఎలా నిర్వహించాలి. పెద్దపెద్ద వ్యాపారాల దగ్గర వాటిని పెడితే ఉపయోగం ఉంటుంది. ఇప్పటికైన ప్రభుత్వం పునరాలోచన చేయాలి. -
వారంలోగా మద్యం దుకాణాల్లో స్వైప్ మిషన్లు
కర్నూలు: మద్యం దుకాణాల్లో వారంలోగా స్వైప్ మిషన్లు ఏర్పాటు చేయాలని ఎక్సైజ్ సీఐలను ఆ శాఖ సూపరింటెండెంట్ మహేష్కుమార్ ఆదేశించారు. కర్నూలులో సోమవారం ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. నగదు రహిత లావాదేవీలపై ప్రతి ఒక్కరూ అవగాహన కల్గిఉండాలని సూచించారు. ఎక్సైజ్ నేరాలు పాతవి, కొత్తవి అన్ని ఆన్లైన్లో పొందుపర్చాలని, ఈ విషయంలో నిర్లక్ష్యం వహించవద్దని ఆదేశించారు.ఇదిలా ఉండగా.. ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖలో పేపర్ రహిత పాలనపై ఎన్ఫోర్సుమెంటు డైరెక్టర్ వెంకటేశ్వరరావు విజయవాడ నుంచి అన్ని జిల్లాల ఎక్సైజ్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వీడియో కాన్ఫరెన్స్కు కర్నూలు ఎక్సైజ్ కార్యాలయంలో ఇన్చార్జి డిప్యూటీ కమిషనర్ శ్రీరాములు, కర్నూలు, నంద్యాల ఏఈఎస్లు ఫయాజుద్దీన్, హెబ్సిబారాణి, ఈఎస్లు ఆదినారాయణమూర్తి, మహేష్కుమార్తో పాటు జిల్లాలోని అన్ని స్టేషన్ల సీఐలు పాల్గొన్నారు. -
విద్యుత్ శాఖకు 80 స్వైప్ మిషన్లు
కర్నూలు(రాజ్విహార్): పెద్ద నోట్ల రద్దు ప్రభావం విద్యుత్ శాఖపై తీవ్రంగా పడింది. ఇకపై భవిష్యత్తులో నగదు రహిత లావాదేవీలు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం ప్రకటించడంతో విద్యుత్ బిల్లులను కూడా అదే తరహాలో వసూలు చేసేందుకు స్వైప్ మిషన్లు ప్రవేశపెట్టనుంది. ఇందులో భాగంగా కొత్తగా 80 స్వైప్ మిషన్లను కొనుగోలు చేసింది. ఇందులో హెచ్డీఎఫ్సీ బ్యాంకు నుంచి 40, యాక్సిస్ బ్యాంకు నుంచి మరో 40 మిషన్లు కొనుగోలు చేసినట్లు ఆ శాఖ అధికారులు తెలిపారు. వీటి నిర్వహణపై సిబ్బంది, అధికారులకు త్వరలో అవగాహన కల్పించి వినియోగంలోకి తీసుకురానున్నట్లు చెప్పారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఎన్నికల బరిలో బిగ్ బాస్ ‘ఖాన్’.. ఎవరితో సై అంటున్నారు?
నల్లజర్లలో అర్ధరాత్రి టీడీపీ బరితెగింపు
ఆత్మవిశ్వాసం + మనోధైర్యం..
సేవాభావం పెంపొందించుకోవాలి
భక్తిశ్రద్ధలతో శివాలయాల్లో ప్రదోష పూజలు
యువన్ శంకర్రాజా ఇండిపెండెంట్ మ్యూజికల్ ఆల్బమ్
రామేశ్వరం అగ్ని తీర్థంలో భక్తుల పుణ్యస్నానాలు
నీట్లో భిన్న ప్రశ్నపత్రాలతో గందరగోళం
వేలూరు జిల్లాలో గాలివాన
మరణంలోనూ వీడని బంధం
తప్పక చదవండి
- బాకీ తీర్చలేదని బట్టలూడదీసి.. మర్మాంగాల మీద తన్నుతూ..
- CM Jagan అంటే ఒక పాఠం: నటి శ్యామల
- యూనిసెఫ్ భారత జాతీయ అంబాసిడర్గా కరీనా : భావోద్వేగం
- ధోని ఆల్టైమ్ రికార్డు బద్దలు కొట్టిన సంజూ.. భారత తొలి క్రికెటర్గా..
- Konathala Ramakrishna: మీ సంగతి చూస్తాం
- దుబాయ్ నుంచి సెలవుపై వచ్చి ఆంబులెన్స్ ఢీ కొట్టి..
- ఎన్నికల బరిలో బిగ్ బాస్ ‘ఖాన్’.. ఎవరితో సై అంటున్నారు?
- Rafah: ఇజ్రాయెల్ దుందుడుకు చర్య.. ఐరాస ఆందోళన
- హైదరాబాద్లో విషాదం.. ఏడుగురు మృతి
- రెచ్చిపోయిన పచ్చ మూక.. హోం మంత్రి తానేటి వనితపై దాడికి యత్నం
Advertisement