-
స్మితా సబర్వాల్ ఇంట్లో చొరబడిన నిందితుడిపై అనుమానాలు
బంజారాహిల్స్ (హైదరాబాద్): ముఖ్యమంత్రి కార్యాలయంలో కీలక పదవిలో పనిచేస్తున్న ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ ఇంట్లోకి గురు వారం రాత్రి అనుమానాస్పదంగా ప్రవేశించిన డిప్యూటీ తహసీల్దార్ చెరుకు ఆనంద్కుమార్రెడ్డి మానసిక స్థితిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. స్నేహితుడు బాబుతో కలిసి రాత్రి 11.34 గంటలకు ఆమె ఇంట్లోకి ప్రవేశించిన ఆనంద్ అక్కడినుంచి ‘ఎట్ యువర్ డోర్ స్టెప్’అంటూ ట్వీట్ చేశాడు. ఆమె నివాసముంటున్న ప్లాట్ యూసుఫ్గూడ పోలీసు లైన్స్లోని ప్లెజెంట్ వాలీ గేటెడ్ కమ్యూనిటీలో. అంతేకాకుండా 24 గంటలు పోలీసు సెక్యూరిటీ ఉంటుంది. ఇంత బందోబస్తు ఉన్న ప్లాట్లోకి అంత ధీమాతో ఎలా వెళ్లాడన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఆ సమయంలో నిందితుడు మద్యం తాగి ఉన్నాడా లేక మానసిక స్థితి కోల్పోయాడా అన్నది తేలాల్సి ఉంది. నిందితుడు పక్కాప్లాన్తోనే వచ్చినట్లుగా తెలుస్తోంది. స్నేహితుడిని బయట కారులో ఉంచి ఆనంద్ మాత్రమే లోనికి వెళ్లడం చర్చనీయాంశంగా మారింది. ఉద్యోగం విషయం మాట్లాడాలంటే పగలు రావాలిగానీ రాత్రి ఎందుకు వచ్చారు అన్నది అర్థం కావడం లేదు. మరోవైపు నిందితుడు విద్యావంతుడు. ఎమ్మెస్సీ మ్యాథ్స్, లా, జర్నలిజం చదివి న్యూఢిల్లీలో వార్త పత్రిక కరస్పాండెంట్గా, దక్కన్ క్రానికల్ ఆసియా ఏజ్ పత్రిక జర్నలిస్ట్గా, సూర్య పత్రిక న్యూఢిల్లీ జర్నలిస్ట్గా పనిచేసిన అనుభవం ఉంది. ఇంత కీలకమైన పోస్టుల్లో పనిచేసిన ఈయన ఐఏఎస్ అధికారిణి ఇంట్లోకి ఆ విధంగా వెళ్లడం విడ్డూరంగా ఉంది. ఏదేమైనా నిందితులను కస్టడీలోకి తీసుకుంటేనే పూర్తి వివరాలు వెలుగుచూసే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా స్మితా సబర్వాల్ ఇంటివద్ద ఉన్న సెక్యూరిటీ గార్డులు అంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం పోలీసుల నిర్లక్ష్యాన్ని బయటపెడుతోంది. వీరిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాల్సి ఉంది. చదవండి: తొలుత ఎస్ఏలు.. తర్వాత ఎస్జీటీలు -
ఉన్మాద దాడులు
దాదాపు రెండున్నర దశాబ్దాల క్రితం విగ్రహాలు పాలు తాగుతున్నాయన్న వదంతులు వ్యాపించి దేశవ్యాప్తంగా అనేకచోట్ల ప్రార్థనా మందిరాల ముందు వేలాదిమంది క్యూ కట్టినప్పుడు చాలామంది ఆశ్చర్యపోయారు. అప్పటికింకా సెల్ఫోన్ల వాడకం లేదు. ఇంటర్నెట్ ఇంకా అందుబాటులోకి రాలేదు. రోజంతా వార్తలు ప్రసారం చేసే చానెళ్లు కూడా పుట్టలేదు. అరకొరగా, అస్తవ్యస్థంగా ఉన్న ల్యాండ్లైన్ ఫోన్లు మాత్రమే దిక్కు. ఇప్పుడు కాలం మారింది. ఫేస్బుక్, ట్వీటర్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ వగైరా సామాజిక మాధ్యమాలు ఆవిర్భవించాయి. వీటిద్వారా ప్రపంచంలో ఏమూల ఏం జరిగినా క్షణాల్లో సెల్ఫోన్లకు దృశ్య సహితంగా వచ్చి వాలుతోంది. కానీ గుంపు మనస్తత్వంలో మార్పు రాలేదు. తమకందిన సమాచారం ఏదైనా, అందులోని నిజానిజాలేమిటో నిర్ధారణ చేసుకునే వీలు లేకపోయినా వెనకా ముందూ చూడకుండా వాటిని విశ్వసించడం, మరింతమందికి పంపడం అలవాటుగా మారింది. తమ నాయకుడికో, నాయకురాలికో ప్రయోజనం చేకూర్చే ఉద్దేశంతో తప్పుడు వార్తల్ని, దృశ్యాల్ని ప్రచారంలో పెట్టేవారు... గిట్టని నేతలను కించపరచడానికి ప్రయ త్నించే వారు ఉంటున్నారు. కానీ మరికొన్ని వదంతులు అమాయకుల ప్రాణాలతో చెలగాటమాడు తున్నాయి. మహారాష్ట్రలో తాజాగా అయిదుగురు ప్రాణాలను బలితీసుకున్న ఘటన ఇటువంటిదే. ఉన్మాదం ఆవహించిన గుంపులు వెనకా ముందూ చూడకుండా విచక్షణారహితంగా దాడులకు దిగుతున్నాయి. పలు ఉదంతాల్లో వారి ప్రాణాలకు ముప్పు తెస్తున్నాయి. ఇటీవలికాలంలో వివిధ రాష్ట్రాల్లో ఉన్మాదుల దురాగతానికి దాదాపు 20మంది బలయ్యారంటే పరిస్థితులు ఎంత ప్రమాదకర స్థాయికి చేరుకున్నాయో తెలుస్తుంది. ఉన్మాద గుంపులు తమ చేతచిక్కినవారిని కాళ్లూ, చేతులూ కట్టి నెత్తురోడేలా హింసిస్తున్న దృశ్యాలు మీడియాలో తరచుగా కనబడుతున్నాయి. అవి అత్యంత హృదయవిదారకంగా ఉంటున్నాయి. దేశంలో అసలు ప్రభుత్వాలున్నాయా, శాంతిభద్రతల పరిరక్షణపై వాటికి పట్టింపు ఉందా అనే అనుమానం కలిగిస్తున్నాయి. ఈ ఘటనల్లో ప్రాణాలు కోల్పోతున్నవారిలో అత్యధికులు దళితులు, మైనారిటీలు. ఈ వదం తుల వ్యాప్తి తీరుతెన్నులను గమనిస్తే వీటిని వ్యాపింపజేయడం వెనక ఎవరికైనా ప్రత్యేక ప్రయోజనాలున్నాయేమోనన్న అనుమానాలు కలుగుతాయి. సామాజిక మాధ్యమాల్లో ప్రచార మయ్యే వదంతులు వింతగా ఉంటున్నాయి. పిల్లల్ని ఎత్తుకుపోయే ముఠాలు బయల్దేరాయని... దోపిడీలు చేయడానికి హంతక ముఠాలు రంగంలోకి దిగాయని...గోవులను ఫలానా వాహనంలో తరలిస్తున్నారని...ఇంట్లో పశుమాంసం ఉంచుకున్నారని–ఇలా ఈ వదంతులకు అంతూ పొంతూ ఉండటం లేదు. ఇవి పదే పదే చోటు చేసుకుంటున్నా ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకోవడంలో విఫలమవుతున్నాయి. దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ అడపా దడపా జరుగుతున్న ఇలాంటి ఘటనల్ని అదుపు చేయడం కోసం ప్రత్యేకించి ఒక చట్టం తీసుకురావాలని డాక్టర్ ప్రకాష్ అంబేడ్కర్ గతంలో కోరారు. ఆయన ఆధ్వర్యంలో గుంపు దాడుల్లో బాధ్యుల్ని గుర్తించి శిక్షించడానికి వీలుగా కొందరు కార్యకర్తలు ఒక ముసాయిదా బిల్లును కూడా రూపొందించి ఏడాది కావస్తోంది. కానీ కేంద్ర ప్రభుత్వం ఇప్పుడున్న చట్టాలే సరిపోతాయని చెప్పింది. మనకు జాతీయ భద్రతా చట్టం ఉంది. కొన్ని రాష్ట్రాల్లో సంఘటిత నేరాల నియంత్రణ చట్టాల వంటి కఠిన చట్టాలున్నాయి. కానీ అవి రాజకీయ ప్రత్యర్థులపై ప్రయోగించినట్టుగా ఈ దుండగాలకు పాల్పడుతున్నవారిపై ఉపయోగిం చడం లేదు. నిందితులు సులభంగా బెయిల్ తెచ్చుకోగలుగుతున్నారు. జార్ఖండ్లో నిరుడు జూన్లో వందమంది గుంపు అన్సారీ అనే యువకుణ్ణి పశు మాంసం తీసుకెళ్తున్నాడన్న అనుమానంతో హింసించి చంపింది. ఆ కేసును ఫాస్ట్ట్రాక్ కోర్టు విచారించి ఒక బీజేపీ సభ్యుడితోసహా ఎని మిదిమందికి యావజ్జీవ శిక్ష విధించింది. అయితే వారందరికీ హైకోర్టులో బెయిల్ లభించింది. కఠినమైన చట్టాల కింద కేసులు పెట్టి ఉంటే పరిస్థితి వేరుగా ఉండేది.ఘటన జరిగిన తర్వాత అరెస్టులు చేయటం, కేసులు పెట్టడం మినహా ఈ వదంతుల విష యంలో ప్రజల్ని చైతన్యవంతుల్ని చేసే కార్యక్రమాలు లేవు. ఉన్నా అవి మొక్కుబడిగా సాగుతు న్నాయి. ఈ సందర్భంగా త్రిపుర ప్రభుత్వం చేసిన ప్రయత్నం గురించి చెప్పుకోవాలి. వదంతులు నమ్మొద్దని ప్రచారం చేయడానికి రోజుకు రూ. 500 వేతనం ప్రాతిపదికన నియమించిన వ్యక్తి ఒక ఊరుకు పోయి ప్రచారం చేస్తుంటే అక్కడ కొంతమంది అతన్ని పిల్లల్ని అపహరించే ముఠాకు చెందినవాడిగా భావించి రాళ్లు, కర్రలు, గాజు సీసాలతో దాడి చేసి చంపేశారు. గ్రామంలో పలుకుబడిగలవారిని గుర్తించి ఈ ప్రచార కార్యక్రమం కోసం వెళ్లినవారిని పరిచయం చేయించినా, వారికి పోలీసు రక్షణ కల్పించినా ఇలాంటి సమస్య తలెత్తదు. ఆ మాదిరి చర్యలు తీసుకోకుండా బలికి మేకపోతును పంపినట్టు ఎవరో ఒకరిపై భారం వేసి వారిని ఒంటరిగా గ్రామాలకు పంపటం వల్ల ప్రయోజనమేమిటి? అసలు సామాజిక మాధ్యమాల్లో ఇష్టానుసారం వ్యాఖ్యలు చేస్తున్నవారి పైనా, ప్రాణం తీస్తామని, అత్యాచారాలకు ఒడిగడతామని హెచ్చరిస్తున్నవారిపైనా చర్యల మాటే మిటి? వీటి విషయంలో మౌనం పాటిస్తున్న తీరు మరికొందరు ఆకతాయిలకు ఎక్కడలేని ధైర్యా న్నిస్తోంది. దీంతో ఇష్టంలేనివారిపై లేనిపోని వదంతులు సృష్టించడంతో మొదలుపెట్టి ప్రజల్ని భయ భ్రాంతుల్ని చేసేలా సందేశాలు వ్యాప్తి చేయడం వరకూ ముదురుతోంది. ఈ ఘటనల్లో ఇప్పటి వరకూ మరణించినవారిలో ఎక్కువమంది మైనారిటీలు, అట్టడుగు వర్గాల వ్యక్తులు. బిచ్చమెత్తుకుని లేదా రోజుకూలీతో బతుకులు వెళ్లదీస్తున్నవారు. అందుకే ఘటన చోటుచేసుకున్నప్పుడు వీరి పక్షాన స్పందించే వారు, కనీసం అడ్డుకోవడానికి ప్రయత్నించేవారుండటం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం చురుగ్గా వ్యవహరించి, కఠినమైన శిక్షలతో ప్రత్యేక చట్టం తీసుకొచ్చి ఇలాంటి దుండగాలను అదుపు చేసే ప్రయత్నం చేయాలి. -
నగరంపై నిఘా
నల్లమల నుంచి నగరానికి పెద్ద సంఖ్యలో మావోయిస్టులు భూతం అన్నపూర్ణ అరెస్ట్తో పోలీసులు అప్రమత్తం నగరంలో సానుభూతిపరుల కదలికలపై ఆరా విజయవాడ : మావోయిస్టు షెల్టర్ జోన్గా ఉన్న బెజవాడ నగరంపై పోలీసులు నిఘా ఉంచారు. నగరంలోకి కొత్తగా ఎవరెవరు వస్తున్నారు. అనుమానాస్పద వ్యక్తులు ఎవరైనా ఉన్నారా, సానుభూతిపరులు అధికంగా ఉన్న ప్రాంతాల్లో పరిస్థితి ఎలా ఉంది లాంటి అంశాలపై నగర కమిషనరేట్ పోలీసులు దృష్టి సారించారు. మావోయిస్టు పార్టీ ఆంధ్ర-ఒడిస్సా బోర్డర్ దళ డెప్యూటీ కమాండర్ భూతం అన్నపూర్ణ అలియాస్ అరుణ, సృజనను గుంటూరు రూరల్ జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమెను నూతన రాజధాని కోర్ క్యాపిటల్ ప్రాంతమైన తుళ్లూరు మండలం తాళ్లాయపాలెంలో మంగళవారం అదుపులోకి తీసుకొని బుధవారం అరెస్టు చూపిన ఘటన గుంటూరు, కృష్ణా జిల్లాల్లో కలకలం రేపింది. దీంతో మావోయిస్టు సానుభూతిపరుల కదలికలపై రెండు జిల్లాల్లో పోలీస్ నిఘా పెరిగింది. మళ్లీ కలకలం... విజయవాడ నగరం ఎన్నో ఏళ్లుగా మావోయిస్టులకు షెల్టర్ జోన్గా ఉంది. నగరంలో మావోయిస్టు సానుభూతిపరులు అధికంగా ఉన్నారు. ముఖ్యంగా సింగ్ నగర్, వాంబే కాలనీ, కృష్ణలంక, భవానీపురం తదితర ప్రాంతాల్లో, నగర శివారు గ్రామాల్లో కొందరు ఉన్నారు. ముఖ్యంగా మావోయిస్టులు నగరంలో తలదాచుకోవటంతో పాటు వైద్య సేవల కోసం ఎక్కువగా వస్తుంటారు. కృష్ణా జిల్లాలో దట్టమైన అటవీ ప్రాంతం లేకపోవటంతో మొదటి నుంచి ఎక్కడా మావోయిస్టు కార్యకలాపాలు లేవు. జిల్లాలో, నగరంలో మావోయిస్టు సానుభూతిపరులు ఉన్నారు తప్ప ఒకస్థాయి మావోయిస్టు నాయకులు ఎవరూ లేరు. ఈ క్రమంలో 2004కు ముందు విజయవాడలో వెంకటేశ్వర్లు అనే మావోయిస్టు లొంగిపోవటం మినహా ఇతర ఘటనలు చోటుచేసుకోలేదు. తాజాగా రాజధాని ప్రాంతంలో మావోయిస్టు నేత సంచరించటం కలకలం రేపింది. ముఖ్యంగా ఇక్కడి గుంటూరు, కృష్ణా జిల్లాలో అధికార పార్టీ నేతల ఆగడాలు, ఇసుక మాఫియా ఆగడాలపై మావోయిస్టు పార్టీ స్పందించి కొందరు నేతలకు అల్టిమేటం ఇచ్చింది. ఈ క్రమంలో పోలీసులు భద్రతాపరంగా చర్యలు తీసుకుంటూ దీనిపై దృష్టిసారించారు. పోలీసులకు సవాలే... రాష్ట్ర విభజనతో విజయవాడ రాజధాని నగరంగా మారింది. నగరంలో సీఎం సహా అనేకమంది వీవీఐపీల కార్యక్రమాలు నిత్యంగా జరుగుతున్నాయి. ఇలాంటి తరుణంలో మావోయిస్టు కార్యకలాపాలు నగరంలో మొదలైతే పోలీసులకు భద్రతాపరంగా సవాలుగా మారే అవకాశం ఉంది. దీంతో అన్నపూర్ణ అరెస్ట్ ఘటనతో మరింత అప్రమత్తం అయ్యారు. నల్లమలతో పాటు రాష్ట్రంలోనే మావోయిస్టుల కీలక షెల్టర్ జోన్గా ఉన్న విజయవాడపై పోలీస్ నిఘా పెంచారు. స్పెషల్ బ్రాంచ్ పోలీసులు ముఖ్యంగా సానుభూతిపరులు, వారికి మద్దతు పలికే ప్రజాసంఘాలు, పౌరహక్కుల సంఘాలు, రాజకీయ పార్టీలపై నిఘా ఉంచారు. బస్టాండ్, రైల్వే స్టేషన్, జనసమ్మర్ధం అధికంగా ఉన్న ప్రాంతాలపై పోలీస్ నిఘా పెరిగింది.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
రాహుల్ తెలంగాణ మహిళలకు క్షమాపణలు చెప్పాలి: హరీశ్రావు
కేకేఆర్తో లక్నో పోరు.. తుది జట్లు ఇవే! స్టార్ బౌలర్ దూరం
జడేజా ఆల్రౌండ్ షో.. పంజాబ్ను చిత్తు చేసిన సీఎస్కే
సీను సీతారైంది సాంబడా
సందడిగా వస్త్ర దుకాణం ప్రారంభోత్సవం (ఫొటోలు)
మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
ఆ పూలు స్టార్స్లా అందంగా ఉన్నా..వాసన మాత్రం భరించలేం!
IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
ఉద్యోగం వెతుక్కునే క్రమంలో ఇలా చెయ్యొద్దు!: గూగుల్ ఉద్యోగి
తప్పక చదవండి
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- 'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
- చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీపై బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
- ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హిట్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
Advertisement