breaking news
supercomputer
-
సూపర్ కంప్యూటర్ కంటే వేగంగా గూగుల్ ఏఐ వాతావరణ సూచనలు!
ఇంతవరకు వాతావరణ సూచనలివ్వడంలో ఒక్కోసారి సైన్స్కి కూడా అంత్యంత క్లిష్టంగా ఉంటుంది. అలాంటిది ఈ గూగుల్ ఏఐ వాతావరణ సూచనలకు సంబంధించిన సమాచారాన్ని చాలా కచ్చితమైన విశ్లేషణతో ఇస్తోంది. ఒకరకంగా చెప్పాలంటే గూగుల్ ఏఐ వెదర్మ్యాన్గా వ్యవహరించనుంది. ఏకంగా పది రోజులు ముందుగానే వాతావరణ సమాచారాన్ని ఇస్తుందట. ఎలా అంచనా వేస్తుందంటే?.. సీతాకోక చిలుకలు వచ్చాయంటే వర్షం వచ్చే సూచనలున్నాయని అర్థం. ఇది అందరికీ తెలిసిందే. ఒక వారం ముందుగానే వాతావరణ సమాచారాన్ని తెలియజేయడాన్ని సాధారణ న్యూమరికల్ వెదర్ ప్రిడిక్షన్(ఎన్డబ్ల్యూపీ) అంటారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వాతావరణ పరిశీలనలను ఇన్పుట్ డేటాగా తీసుకుని సూపర్ కంప్యూటర్ సంక్లిష్ట భౌతిక సమీకరణాలను ఉపయోగించి చెప్పేది. కానీ ఇప్పుడు గూగుల్ శక్తిమంతమైన హార్డ్వేర్ల సాయంతో సంఖ్యలను తొందరగా కాలిక్యులేట్ చేయగల గ్రాఫ్ కాస్ట్ని ఆవిష్కరించింది. ఈ ఏఐ ఉపగ్రహ చిత్రాలు, రాడార్లు అందించిన 40 ఏళ్ల విలువైన వాతావరణ పునర్విశ్లేషణ డేటాపై శిక్షణ పొందింది. ఈ గ్రాఫ్కాస్ట్ ఆరుగంటల క్రితం వాతావరణ స్థితి, ప్రస్తుత స్థితిని పరిగణలోకి తీసుకుంటుంది. ఆ తర్వాత ఆరుగంటల నుంచి వాతావరణ స్థితిని అంచనావేయడానికి తన వద్ద ఉన్న డేటాను ఉపయోగిస్తుంది. దీని ఆధారంగా పది రోజుల వరకు సూచనను అందిస్తుంది. ఈ గ్రాఫ్కాస్గ్ భూమి ఉపరితలం చుట్టూ మిలియన్ల కంటే ఎక్కువ గ్రిడ్ పాయింట్లలో దీన్ని చేస్తుంది. ఇది రేఖాంశం, అక్షాంశం తోసహ ప్రతి పాయింట్ వద్ద ఉష్ణోగ్రత, తేమ, పీడనం, గాలి దిశ, వేగం అన్నింటిని పరిగణలోకి తీసుకుని విశ్లేషిస్తుంది. అంతేగాదు ఈ గ్రాఫ్కాస్ట్ ప్రస్తుత సూపర్ కంప్యూటర్లో ఉన్న హై రిజల్యూషన్ ఫోర్కాస్ట్(హెచ్ఆర్ఈఎస్) అనే అనుకరణ వ్యవస్థలా పనిచేస్తుంది కానీ పదిరోజుల నాటి వాతావరణ సూచనను ఇవ్వగలదు. అలాగే 90% హెచ్ఆర్ఈఎస్ కంటే కచ్చితమైన సూచనను అందిస్తుంది. ఇక భూమిపై ఉండే పోరల్లో ట్రోపోస్పియర్ పోర వద్ద కచ్చితమైన అంచనాలు మన రోజూ వారి జీవితానికి ఉపయుక్తంగా ఉన్నాయి. పైగా హెచ్ఆర్ఈఎస్ కంటే ముందే వాతావరణ సూచనలను అందించే సామర్థ్యాన్ని గూగుల్ ఏఐ ప్రదర్శించింది. అంతేగాదు తుపాను ఎక్కవ వస్తుందో తొమ్మిది రోజులు ముందుగానే ఏఐ కచ్చితమైన అంచనా వేసింది. ఐతే సంప్రదాయ వాతావరణ అంచనాలు కనీసం ఆరు రోజులు ముందుగానీ నిర్థారించవు. ఈ గ్రాఫ్కాస్ట్ కోడ్ ఓపెన్సోర్స్ అని గూగుల్ చెబుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న శాస్త్రవేత్తలు దానితో ప్రయోగాలు చేయడానికి, రోజూవారి వాతావరణ సూచనలు ఇవ్వడానికి అనుమతిస్తున్నట్లు పేర్కొంది. ఈ పరిశోధనకు సంబంధించిన వివరాలు సైన్స్ జర్నల్లో ప్రచురితమయ్యింది. (చదవండి: సినిమాలు చూస్తే..కేలరీలు బర్న్ అవుతాయట! పరిశోధనల్లో షాకింగ్ విషయాలు) -
సాంకేతిక పరిజ్ఞానంలో అదరగొడుతున్న చైనా
-
తైన్హె–3.. సూపర్ డూపర్ కంప్యూటర్
బీజింగ్: ఒకటి పక్కన 18 సున్నాలు పెడితే ఆ సంఖ్య ఎంతో చెప్పడానికే మనకు కొంత సమయం పడుతుంది. అలాంటిది ఒక సెకన్లో అన్ని లెక్కలను చేసేస్తే.. సూపర్ డూపర్ అనక తప్పుతుందా! ఇదంతా ఎందుకంటే.. తైన్హె–3 పేరుతో చైనా ఓ కంప్యూటర్ను తయారు చేస్తుంది. ఇప్పటిదాకా అత్యంత వేగవంతమైన కంప్యూటర్ను మనం సూపర్ కంప్యూటర్గా పిలుచుకుంటున్నాం. మరి ఆ సూపర్ కంప్యూటర్ కంటే పదిరెట్లు వేగంగా లెక్కలు చేస్తుందనే తైన్హె–3 కంప్యూటర్ను సూపర్ డూపర్ కంప్యూటర్ అని పిలుస్తున్నారు. అత్యంత శక్తిమంతంగా రూపొందిస్తున్న ఈ కంప్యూటర్ను చైనా ఈ ఏడాదిలోనే అందుబాటులోకి తీసుకురావాలని ప్రయత్నిస్తోంది. ఇప్పటిదాకా అత్యంత వేగవంతమైన కంప్యూటర్గా చెబుతున్న సన్వే తైహులిట్ కూడా చైనానే తయారు చేసింది. పైగా ఇది చైనా రూపొందించిన మొట్టమొదటి సూపర్ కంప్యూటర్. ఒక సెకన్లో 125 క్వాడ్రిలియన్ (ఒకటి పక్కన 15 సున్నాలు) లెక్కలను చేయడం దీని కెపాసిటీ. అయితే తైన్హె–3 దీనికి పదింతల స్పీడ్తో పనిచేస్తుందని చైనాకు చెందిన నేషనల్ సూపర్ కంప్యూటర్ తైంజిన్ సెంటర్ డైరెక్టర్ మెంగ్ జియాంగ్ఫీ తెలిపారు. -
సూపర్ కంప్యూటర్ షట్ డౌన్
బీజింగ్ : ప్రపంచంలోనే అత్యంత వేగమంతంగా పనిచేసే సూపర్ కంప్యూటర్ తియాన్హే-1ఏ ను షట్ డౌన్ చేశారు. ఉత్తర చైనా తీర పట్టణం టాంజిన్ లో గురువారం తెల్లవారుజామున భారీ పేలుడు సంభవించింది. ఈ కారణంతో సెకన్లో 2.57 క్వాడ్రిలియన్ ఆపరేషన్స్ పూర్తిచేసే సామర్థ్యం ఉన్న ఈ కంప్యూటర్ సేవలను తాత్కాలికంగా నిలిలివేశారు. ఈ కంప్యూటర్ తియాంజిన్ లోని నేషనల్ సూపర్ కంప్యూటింగ్ సెంటర్లో ఉంది. బాంబు దాడి దాటికి ఈ భవనం పైకప్పు పాక్షికంగా దెబ్బతిందని అధికారులు తెలిపారు. ఈ ఘటన తర్వాత కూడా సూపర్ కంప్యూటర్ పనిచేసిందని సెంటర్ డైరెక్టర్ లియూ గ్వాంగ్ మింగ్ చెప్పారు. భద్రతా కారణాల దృష్ట్యా తియాన్హే-1ఏ ను తాత్కాలికంగా షట్ డౌన్ చేసినట్లు వివరించారు. టాప్ 500 కంప్యూటర్ల జాబితాలో అగ్రస్థానంలో ఉన్న విషయం తెలిసిందే. ఉత్తర చైనా తీర పట్టణం టాంజిన్ లో జరిగిన బాంబు పేలుడులో 44 మంది మరణించగా.. 400 మందికిపైగా గాయపడినట్లు స్థానిక మీడియా కథనాలను ప్రసారం చేసింది. మృతుల సంఖ్య గంటగంటకూ పెరుగుతూనే ఉంది.