breaking news
Subsidized LPG cylinder
-
సబ్సిడీ సిలిండర్పై రూ.2.89 పెంపు
న్యూఢిల్లీ: ఎల్పీజీ వినియోగదారులకు ప్రభుత్వ ఆయిల్ కంపెనీలు మరోసారి షాక్ ఇచ్చాయి. 14.2 కిలోల బరువున్న సబ్సిడీ ఎల్పీజీ సిలిండర్పై రూ.2.89, సబ్సిడీ లేని ఎల్పీజీ సిలిండర్పై రూ.59 పెంచుతున్నట్లు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్(ఐవోసీ) ఆదివారం ఓ ప్రకటనలో తెలిపింది. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు పెరగడం, డాలర్తో రూపాయి మారకం విలువ క్షీణించిన నేపథ్యంలో సబ్సిడీలేని సిలిండర్పై రూ.59 పెంచామని వెల్లడించింది. ఇక జీఎస్టీ పరిధిలోకి తీసుకురావడంతో సబ్సిడీ సిలిండర్పై రూ.2.89 అదనపు భారం పడిందని పేర్కొంది. అలాగే వినియోగదారులకు చెల్లిస్తున్న నగదు బదిలీ మొత్తాన్ని రూ.320.49 నుంచి రూ.376.6కు పెంచినట్లు ఐవోసీ తెలిపింది. -
సబ్సిడీ సిలిండర్ ధర రూ.5.57 పెంపు
న్యూఢిల్లీ: సబ్సిడీ ఎల్పీజీ సిలిండర్ ధరను ఆయిల్ కంపెనీలు రూ. 5.57లు పెంచాయి. సబ్సిడీ లేని గ్యాస్ సిలిండర్ ధరను రూ. 14.50 తగ్గించాయి. అలాగే ఏవియేషన్ టర్బైన్ ప్యూయల్ (ఏటీఎఫ్) ధర ఐదు శాతం తగ్గి కిలో లీటరు రూ. 51,428కు చేరింది. అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా ఈ మార్పులు చేసినట్లు ఆయిల్ కంపెనీలు వెల్లడించాయి.