breaking news
subcollector srujana
-
కల్తీ మద్యం ఘటనపై మెజిస్టీరియల్ విచారణ
విజయవాడ: బెజవాడ కల్తీ మద్యం ఘటనపై విచారణను ప్రభుత్వం వేగవంతం చేసింది. దీనిపై మెజిస్టీరియల్ విచారణకు ఆదేశించింది. సబ్కలెక్టర్ సృజనను విచారణాధికారిగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక ఎక్సైజ్ అధికారులు దూకుడును పెంచారు. ఘటనపై పలు సెక్షన్ల కింది పోలీసులు కేసు నమోదు చేశారు. ఐపీసీ 304 ఏ, 328, ఎకై్సజ్యాక్ట్ సెక్షన్ డీ(1),(2) కింద భాగవతుల శరత్ చంద్ర, కావూరి పూర్ణచంద్రశర్మ, కె.లక్ష్మీ సరస్వతీ, మల్లాది బాల త్రిపుర సుందరీలపై కేసు నమోదు చేశారు. కల్తీ మద్యం సేవించి ఐదుగురు మృతి చెందగా, మరో 29మంది తీవ్ర అస్వస్థతకు గురైయ్యారు. వారిలో మరో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉంది. -
కల్తీ మద్యం ఘటనపై మెజిస్టీరియల్ విచారణ