breaking news
subcidies
-
కేంద్ర ప్రభుత్వం గ్యాస్ సిలిండర్లపై అందించిన సబ్సీడీ ఎంతో తెలుసా..?
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం 2011-12 నుంచి ఇప్పటివరకు సుమారు రూ .7.03 లక్షల కోట్ల గ్యాస్ సబ్సిడీలను చెల్లించిందని పెట్రోలియం, సహజ వాయువు సహాయ మంత్రి, రామేశ్వర్ తేలి లోక్సభలో పేర్కొన్నారు. దేశంలో పెరుగుతున్న ఇంధన ధరలపై స్పందిస్తూ.. దేశంలోని పెట్రోలియం ఉత్పత్తుల ధరలు అంతర్జాతీయ మార్కెట్ ముడిచమురుల ధరలపై ముడిపడి ఉన్నాయని పేర్కొన్నారు. ఆర్థిక మంత్రిత్వ శాఖ ఎల్పీజీ సబ్సిడీ కోసం కేటాయింపులను మూడింట రెండు వంతులు తగ్గించిన విషయాన్ని వెల్లడించారు. 2022 ఆర్థిక సంవత్సరానికిగాను ఆర్థిక మంత్రిత్వ శాఖ సుమారు రూ. 12,995 కోట్లకు తగ్గించిన నేపథ్యంలో సబ్సిడీయేతర వంట గ్యాస్ ధర పెరిగిందని పేర్కొన్నారు. ఎల్పిజి అండ్ నేచురల్ గ్యాస్ సబ్సిడీ కోసం 2021-22 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ అంచనాలు రూ. 12,995 కోట్లని ప్రకటనలో పేర్కొన్నారు. భారత్లో 2021 జనవరి 1 నాటికి 28.74 కోట్ట మంది ఎల్పీజీ వినియోగదారులు ఉన్నారని తెలిపారు. ప్రధాన మంత్రి ఉజ్వల యోజన పథకం కింద నిరుపేద కుటుంబాలకు ఉచిత వంటగ్యాస్ కనెక్షన్లను అందించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఎల్పీజీ కవరేజీని 61.5శాతం నుంచి 99.5 శాతానికి పెరిగిందని వెల్లడించారు. -
మోసపు వలలో జాలరి విలవిల
ఎన్నికల వేళ జనాన్ని మాయమాటలతో ఏమార్చడం.. అధికార పీఠంపై అధిష్టించాక అంటీముట్టనట్టు వ్యవహరించడం చంద్రబాబునాయుడికి వెన్నతోపెట్టిన విద్య. నారా వారు విసిరిన మోసపు హామీల వలలో చిక్కి విలవిల్లాడుతున్న వారిలో మత్స్యకారులూ ఉన్నారు. గత ఎన్నికల సమయంలో చంద్రబాబు గుప్పించిన హామీలను గంగలో కలిపేసిన తీరును గంగపుత్రులు గుర్తు చేసుకుంటున్నారు. సాక్షి, చీరాల (ప్రకాశం): గంగపుత్రులు గంపెడు కష్టాల్లో కొట్టుమిట్టాడుతున్నారు. మత్స్యకారులపై ప్రభుత్వానికి మమకారం లేకుండా పోయింది. డీజిల్ సబ్సిడీకి సర్కారు పంగనామం పెట్టింది. ఎప్పుడో 2002 మార్చిలో నమోదు చేసుకున్న బోట్లకు తప్ప ఆ తర్వాత వచ్చిన బోట్లకు సబ్సిడీ అందడంలేదు. వేట విరామ సమయంలో చేయూతనందించాల్సిన సర్కారు మొండి చేయి చూపిస్తోంది. చివరకు ఉపాధి పనుల్లో అవకాశం కల్పించాలని మత్స్యకారులు ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం ఆ దిశగా కనీసం ఆలోచించడం లేదు. సబ్సిడీపై అందించాల్సిన బోట్ల వ్యవహారాన్ని అటకెక్కించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 2004 సునామీ తర్వాత కట్టించిన 300 పక్కా గృహాలు తప్ప మత్స్యకారులకు కొత్తగా ఎటువంటి గృహాలు నిర్మించలేదు. రాయితీలకు ఎగనామం 2002 మార్చి అంటే 9వ ఆర్థిక ప్రణాళికా సంఘంలో నమోదు చేసుకున్న బోట్లకే డీజిల్ సబ్సిడీ అందుతుండగా ఆ తర్వాత కొనుగోలు చేసిన బోట్లకు డీజిల్ సబ్సిడీ ఇవ్వడం లేదు. అలానే రూ.10 నుంచి రూ.50 వేల విలువ చేసే వలలపై ప్రభుత్వం 50 శాతం సబ్సిడీకి ఆపేసింది. బోటు ఇంజన్ల కొనుగోలుపై 50 శాతం సబ్సిడీని ఎగ్గొట్టింది. నాబార్డు నిధులతో మత్స్యకార గ్రామాల్లో రోడ్లు, కమ్యూనిటీ హాళ్లు, మౌలిక వసతులు, ఫిష్ల్యాండింగ్ సెంటర్లు ఏర్పాటు చేయకపోవడంతో వారి కష్టాలు మరింత ఎక్కువయ్యాయి. వేటకు వెళ్లి ప్రమాదశాత్తు చనిపోతే ఇవ్వాల్సిన రూ.2 లక్షలను చంద్రన్న బీమాలో కలిపేసి చేతులు దులుపుకొన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో మత్స్యకారులు ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.2క్షలు ఎక్స్గ్రేషియా ఇచ్చే పథకాన్ని ప్రస్తుత సర్కారు తొలగించింది. అలానే ఐదుగురు మత్స్యకారులు కలిసి రూ.2.5 లక్షల విలువైన బోటు కొనుగోలు చేస్తే 50 శాతం సబ్సిడీ ఇవ్వాల్సి ఉండగా ఆ సొమ్మును దళారులే మింగేస్తున్నారు. బోటు కోనుగోలు చేసేందుకు అవసరమైన పెట్టుబడి పెట్టే సామర్థ్యం మత్స్యకారులకు లేకపోవడంతో దళారులు పెట్టుబడి పెట్టి వారి పేర్లతో బోట్లను కైవసం చేసుకుంటున్నారు. జిల్లాలో తీర ప్రాంతం 102 కి.మీ మత్స్యకార గ్రామాలు 74 మత్స్యకారుల జనాభా 80000 ఇంజన్ బోట్లు 1849 సంప్రదాయ బోట్లు 2883 మత్స్యకార సొసైటీలు 54 మెరైన్ సొసైటీలు 44 సొసైటీల్లో సభ్యులు 16,000 సంక్షేమం నామమాత్రమే.. మత్స్యకారులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ పథకాలు నామమాత్రంగానే అందుతున్నాయి. వేట సాగించే మత్స్యకారులకు కేంద్ర ప్రభుత్వం రూ.3.45, రాష్ట్ర ప్రభుత్వం రూ.7.5 అందిస్తుంది. అయితే కొన్నేళ్లుగా కేంద్రం ఇవ్వాల్సిన సబ్సిడీ ఇవ్వడం లేదు. ప్రభుత్వ గుర్తింపు పొందిన మెకనైజ్డ్ బోట్లకు నెలకు 1000 లీటర్లు అవసరం ఉండగా ప్రభుత్వం 300 లీటర్లకు మాత్రమే సబ్సిడీ ఇస్తోంది. క్యాబిన్ బోట్లకు నెలకు 6 వేల లీటర్లు డీజిల్ కావాల్సి ఉండగా నెలకు 3 వేల లీటర్లు కూడా ఇవ్వడం లేదు. ఆ అవస్థలు వర్ణనాతీతం వేటాడిన చేపలను ఒడ్డుకు చేర్చేందుకు, బోట్లు లంగరు వేసేందుకు మత్స్యకారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాడరేవు, చిన్నబరప, విజయలక్ష్మీపురం, బాపట్ల మండలంలోని దానవాయిపేట, పాండురంగాపురం గ్రామాలకు చెందిన మత్స్యకారులు ఈపూరుపాలెం స్ట్రయిట్కట్పై ఉన్న బ్రిడ్జి సమీపంలోని జెట్టీ వద్ద మాత్రమే బోట్లు నిలుపుతున్నారు. చేపలు విక్రయించేందుకు మరే ఇతర సౌకర్యాలు లేవు. దీంతో కొన్నేళ్లుగా మండలంలోని మత్స్యకారులు బాపట్ల మండలంలోని దానవాయిపేట సమీప ప్రాంతాన్ని జెట్టీగా వినియోగించుకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల మినీ హార్బర్కు రూ.432 కోట్లు కేటాయించింది. ప్రస్తుతం అది స్థల సేకరణ దశలో ఉంది. హార్బర్ నిర్మాణం పూర్తయితే మత్స్యకారులు తమ మత్స్యసంపదను దళారులకు కాకుండా నేరుగా అమ్ముకునేందుకు వీలుంటుంది. ఉపాధి ఉసేది? వేట విరామ సమయంలో తమిళనాడు, కేంద్ర ప్రభుత్వాలు ఏప్రిల్, మే నెలలో నెలకు రూ.10 వేల నగదు, 50 కేజీల బియ్యం అందిస్తున్నాయి. రెండు నెలల పాటు వేటకు వెళ్లకపోయినప్పటికీ ప్రభుత్వం ఇచ్చే చేయూతతో మత్స్యకారుల కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. కానీ టీడీపీ ప్రభుత్వం రెండు నెలలకు రూ.4 వేలు మాత్రమే ఇస్తోంది. ఆ సొమ్ము కూడా జిల్లాలో సగం మందికి అందడం లేదు. -
వాస్తవాలతో భ్రమలకు చెల్లుచీటీ
జాతిహితం మీరు అర్థరహితంగా మాట్లాడుతున్నారూ అంటే, మీ బుర్రను పరీక్ష చేయిం చుకోవాల్సిందేనని ఎవరైనా చెబుతారు. అయితే అసలా అవసరమే రాని సమయాలూ ఉంటాయి. సబ్సిడీలు లేకుండా కూడా వ్యవసాయరంగం మన గలుగుతుందని మీరు విశ్వసించేట్టయితే పిచ్చివాడని ముందుగానే మీకు ఓ సర్టిఫికేట్ ఇచ్చేస్తారు. ఈ వారం జాతిహితంలో గణాంకాల ఆధారంగా కొన్ని భ్రమలను బద్ద లుకొడతామని వాగ్దానం చేశాం. వ్యవసాయానికి చాలా అధికంగా సబ్సిడీ ఇస్తున్నారనే విస్తృతాభిప్రాయాన్ని సవాలు చేయడానికి బదులుగా మనం దాన్ని ఎందుకు సమర్థిస్తున్నాం? బహుశా మన బుర్రలను పరీక్ష చేయించుకోవాల్సి ఉండి ఉంటుంది. అయితే వాస్తవాలను ముందు చూద్దాం. జపాన్లో మొత్తం వ్యవసాయ ఆదా యంలో వ్యవసాయ సబ్సిడీల వాటా 56 శాతంగా, యూరోపియన్ యూని యన్లో 19 శాతంగా, అమెరికాలో కేవలం 7.1 శాతంగా ఉంది. ఇవి ఆర్గనై జేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ (ఓఈసీడీ) గణాం కాలు. జపాన్ విషయం నిజానికి ప్రత్యేకమైనదే అయినా, అదే ఎక్కువ చర్చ నీయాంశంగా ఉంది. బియ్యం దిగుమతులపై 778 శాతం, గోధుమ దిగుమ తులపై 252 శాతం సుంకాలను విధించి జపాన్ కూడా తన రైతాంగాన్ని కాపాడుతోంది. కాబట్టి మీరు మీ రైతుల పరిరక్షణకు కూడా అడ్డు చెప్పొద్దు. ప్రతి దేశమూ ఆ పని చేయాల్సిందే. అయితే మన దేశంలోలాగా ఇతర మరే పెద్ద ఆర్థిక వ్యవస్థలోనైనా రైతు ఇలా ఆకలిగా అర్థనగ్నంగా ఉంటాడా? మన ఎరువుల సబ్సిడీలు రూ.70,000 కోట్లకు మించి పోయాయి. మన రాష్ట్రాలు వ్యవసాయ రంగానికి చెల్లించే మొత్తం విద్యుత్ సబ్సిడీ కూడా ఇంచు మంచు రూ.70,000 కోట్లుంటుంది. వీటికి విత్తనాలు, వ్యవసాయ సాధ నాలు, డీజిల్ (ఇటీవలి వరకు), ఉచిత నీరు, బోసస్ వగైరా ఉత్పత్తి కార కాలపై ప్రత్యక్ష సబ్సిడీలను కూడా కలుపుకుంటే.. మొత్తం వ్యవసాయ సబ్సిడీలు ఎంత తక్కువగా చూసినా రూ. 2,00,000 కోట్లకు దాటి పోతాయి. అయినా రైతు దయనీయ స్థితిలోనే ఉన్నాడు. మన ఆర్థిక వ్యవస్థలో వ్యవ సాయం నిరాదరణకు గురైనది, కాబట్టి దానికి మరిన్ని సబ్సిడీలను ఇవ్వాలనే గగ్గోలు ఎప్పుడూ ఉంటుంది. మేం సవాలు చేస్తున్నది ప్రధానంగా వ్యవసాయం దరిద్రపుగొట్టుదనే భ్రమను. మన దేశానికి కావాల్సింది ఇంకా ఎక్కువ వ్యవసాయ సబ్సిడీలు కావు, వివేచనాయుతమైన సబ్సిడీలు. సబ్సిడీలలో అత్యధిక భాగం బడా రైతులకే దక్కుతున్నాయనేది ప్రపంచవ్యాప్త వాస్తవం. మన దే శంలో అందుకు విరుద్ధంగా అవి బడా వ్యాపార రంగానికి చేరుతున్నాయి. మొత్తంగా ఎరు వుల పరిశ్రమే ఆ సబ్సిడీల చుట్టూ విస్తరించి ఉన్న సిగ్గు చేటైన వ్యవహారం. ఎరువుల శాఖ నేరుగా ఉత్పత్తిదారులకు రూ.70,000 కోట్ల సబ్సిడీని పంచి పెడుతోంది. అది వారికి ఒక పెద్ద ఏటీఎమ్గా మారింది. ఇదిలా ఉంటే, రైతు ఎరువుల కోసం బిచ్చగాడిలా దేబిరించాల్సి ఉంటుంది. సబ్సిడీల వల్ల ధరలు తగ్గి యూరియా అనే ఎరువు కోసం శాశ్వతంగా కొరత ఎలా ఏర్పడిందో, దాని కోసం ఎలా అల్లర్లు సైతం జరుగుతున్నాయో మరోసారి మీ దృష్టికి తీసుకొస్తున్నాం. సబ్సిడీ వల్ల భారత్లో యూరియా ధర దాని అసలు ధరలో మూడో వంతుకంటే కూడా చౌకగా మారింది. దీంతో దాన్ని పొరుగు దేశాలకు స్మగ్లింగ్ చేస్తున్నారు. సబ్బులు, పేలుడు పదార్ధాలు మొదలు పాల కల్తీ వరకు ఇతర పరిశ్రమలకు యూరియాను మరలించేస్తున్నారు. ఇటీవలి కాలంలో ఏ చైనా నుండో యూరియాను ‘‘దిగుమతి’’ చేసుకొని మన ప్రాదేశిక జలాలకు ఆవలి అంతర్జాతీయ సముద్రం ద్వారా తిరిగి ఆ దేశానికే ‘‘ఎగుమతి చేయడం’’ సైతం జరుగుతోంది. సబ్సిడీని ఇరు పక్షాలూ పంచుకుంటాయి. ఈ చెడంతా చాలదన్నట్టు ఈ అధిక సబ్సిడీ ఆవశ్యకమైన ఎన్పీకే (నైట్రోజన్, ఫాస్పేట్, పొటాషియం) మిశ్రమంలో ఇతర రెండింటినీ వదిలి యూరియా లేదా నైట్రోజన్ను మన రైతులు ఎక్కువగా వాడే స్థితికి నెడుతోంది. ఫలితంగా కోట్ల హెక్టార్ల అత్యంత సారవంతమైన భూములు నాశనమైపోతున్నా యి. రైతులకు భూసార పరీక్ష కార్డులు ఇవ్వడం మంచి ఆలోచన. కానీ కుళ్లి కంపుకొడుతున్న ఎరువుల సబ్సిడీ ఆర్థికశాస్త్రం దాన్ని ఓడించేస్తుంది. బ్రహ్మాం డమైన స్వార్థ ప్రయోజనాలు, లాభాలు చేసుకునే మాఫియా ఈ ఎరువుల సబ్సిడీల చుట్టూ నిర్మితమై ఉంది. అనాలోచితమైన వ్యవసాయ సబ్సిడీలు, వివేకరహితమైన ఆహార ఆర్థిక వ్యవస్థతో కలసి భారత వ్యవసాయ రంగాన్ని గందరగోళంగా మార్చింది. కాబట్టి మేం కూల్చివేయనున్న రెండవ అతి పెద్ద భ్రమ నయా-ఉదారవాద సంబంధమైనది. అది, పన్ను మినహాయింపులున్న రైతుకు అధిక సేకరణ ధరలను చెల్లిస్తూ ప్రభుత్వం అతిగా గారం చేస్తోంది; తద్వారా అది పన్ను చెల్లింపుదారులకు నష్టం కలిగించడమే గాక, ఆహార ద్రవ్యోల్బణానికి కూడా దారితీస్తోందనే భ్రమ. వ్యవసాయరంగంపై శాంతా కుమార్ కమిటీ ఇటీవలే వీటిలో కొన్ని అంశాలను వివరంగా పరిశీలించింది. చాలా గణాంకాలకు గానూ నేను నా రచయితలకు కృతజ్ఞుడిని. మన దేశంలో గోధుమ సేకరణ, లేదా కనీస మద్దతు ధర (ఎమ్ఎస్పీ) టన్నుకు 226 డాలర్లు. అదే పాకి స్తాన్లో 320 డాలర్లు, చైనాలో 385 డాలర్లు. వ్యవసాయం బాగా తెలిసిన ఏ రైతూ, ప్రపంచంలో ఎక్కడా తన సాగు ఏమీ బాగా లేదని అనడు. కానీ మనతో పోల్చి చూసుకునే దేశాలలో అత్యధికం మనకు భిన్నంగా తమ వ్యవసాయాన్ని సంస్కరించుకున్నాయనేది వాస్తవం. పాకిస్తాన్, చైనాలు రెండూ ఆదాయ మద్దతు రూపంలో ప్రత్యక్ష వ్యవసాయ సబ్సిడీలను అమలుచేస్తున్నాయి. రెండూ ప్రజా పంపిణీ వ్యవస్థను (పీడీఎస్) రద్దు చేశాయి. మనం మాత్రం మితవాద ధోరణితో రైతులకు ‘‘మద్దతు’’ను ఇస్తున్నాం. ఆ తక్కువ ధరకు సైతం ప్రభుత్వ సంస్థలకు తమ ఉత్పత్తులను అమ్ముకోగలిగేది. కేవలం 6 శాతం మంది రైతులు మాత్రమే. కన్నాల్లోంచి ఎక్కడికక్కడ కారిపోయే, తేలిగ్గా వచ్చి పడే డబ్బు రూపేణా వ్యవసాయ సబ్సి డీలను చెల్లాచెదురు చేసేస్తాం. ఆ మీదట ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా విని యోగదారులకు సబ్సిడీ ధరలకు అమ్మడం కోసం భారీగా ఆహార ధాన్యాల నిల్వలను పోగుచేస్తాం. ఈ పీడీఎస్ను నేను ప్రజా దౌర్భాగ్య వ్యవస్థ అని అం టాను. అందువలన మనం మన ఆహార/వ్యవసాయ ఆర్థికశాస్త్రాన్ని మొత్తం మూడు అంశాల్లోనూ వక్రీకరించాం. వికృతపరచాం: ఉత్పత్తికారకాలు (ఇన్ పుట్స్), ఉత్పత్తులను రైతే నేరుగా అమ్ముకోవడం, వినియోగం. విపరీతంగా విస్తరించిన ధరల హెచ్చు తగ్గులన్నింటి ప్రయోజనాలు చివరికి అవాంఛనీ యమైన జేబుల్లోకి, మధ్యవర్తులు, ఇన్స్పెక్టర్లు, ఫుడ్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్సీఐ) అనే బ్రహ్మాండమైన వ్యవస్థకు చేరుతాయి. అందువలన, మన దేశ ఆహార భద్రతకు మరీ మరీ ఎక్కువగా ఆహార ధాన్యాలు అవసరమేనేది తదుపరి మా హిట్లిస్ట్లో ఉన్న భ్రమ. క్షామ పరిస్థితులను స్థిరీకరించడం కోసం దేశానికి అవసరమయ్యే బఫర్ స్టాక్ కేవలం కోటి టన్నులు మాత్రమేనని, అందులో భౌతికంగానూ, మిగతా సగం అంతర్జాతీయ ఆహార ధాన్యాల ఫ్యూచర్స్, ఆప్షన్ల రూపంలోనూ ఉంటే సరిపో తుందని శాంతా కుమార్ కమిటీ తెలిపింది. కానీ వార్షిక ఆహార ధాన్యాల ఉత్పత్తిలో 15-20 శాతం (3.2 కోట్ల టన్నులు) అనే కాలం చెల్లిన ప్రమాణం అమల్లో ఉన్న దేశంలో అలాంటి ఆలోచన మరీ విప్లవాత్మకమైనది. మన ఆహారధాన్యాల ఉత్పత్తి 2014-15లో 25.1, 2013-14లో రికార్డు స్థాయిలో 26.5 కోట్ల టన్నులు. ఆహార భద్రతా చట్టం వల్ల పీడీఎస్ అదనపు అవసరాలను కూడా చేర్చితే మన బఫర్ స్టాక్ 4.2 కోట్ల టన్నులకు చేరుతుంది. కానీ నేడు మనం 6 కోట్ల టన్నులకు పైగా నిల్వలను పెట్టుకున్నాం. వాస్తవానికి మనం అతి సులువుగా కోటి టన్నుల ఆహార ధాన్యాలను ఎగుమతి చేసుకోవచ్చు. అలా అని రెండేళ్ల క్రితం నిర్ణయించినా, నాటి కాగ్, సీవీసీ, సీబీఐల కాలంలో ఆహా రశాఖ అందుకు జంకింది. ఈ అదనపు నిల్వల వ్యయం రూ. 45,000 కోట్లకు పైగానే, ఫలితాలు మాత్రం శూన్యం. ఎఫ్సీఐ రైతులకు చెల్లింపులు చేసిన తర్వాత ధాన్యాన్ని తరలించడానికి టన్నుకు రూ. 4.75 ఖర్చవుతుంది. ఈ అదనపు ధాన్య నిల్వల రవాణాకే రూ.7,500 కోట్లు అదనపు ఖర్చు. ఈ అంకెలను దయచేసి గుర్తుంచుకోండి, మరో నిమిషంలో మనం వాటి వద్దకే మళ్లీ రానున్నాం. ఇది, విస్తృతంగా ప్రచారంలో ఉన్న మన ఆహారభద్రత ప్రమాదకర స్థితిలో ఉన్నదనే భ్రమను తుత్తునియలు చేస్తుంది. ఇది ఎంతగా ప్రాచుర్యం పొందిందంటే క్రిస్టోఫ్ జఫర్లోట్ వంటి అత్యంత జాగరూకత గల అద్భుత విద్యావేత్త సైతం ఆ మాయలో పడిపోయారు. ఇటీవల ఓ పత్రిక కాలమ్లో ఆయన, గత ఏడాది మనం ‘‘80,000 టన్నుల’’ గోధుమలను దిగుమతి చేసుకోవడాన్ని ఆహార భద్రతకు తలెత్తనున్న ముప్పుగా అభివర్ణించారు. గంగా-జమునీ అలంకారిక భాషలో చెప్పాలంటే, 6 కోట్ల టన్నుల గోధుమ, బియ్యం నిల్వలు ఉండగా 80 వేల టన్నుల దిగుమతి ఒంటె నోట్లోని జీలకర్ర గింజంత. ఈ గోధుమ దిగుమతులపై పరిశోధనాత్మక దర్యాప్తు జరిపిన దరిమిలా అవి మాగీలాంటి కొన్ని బ్రాండెడ్ వస్తువుల తయారుదారులు విభిన్నమైన జిగురు, పీచు అవసరాల కోసం దిగుమతి చేసుకున్న కొద్ది మొత్తాలనీ, లేక పోతే ఉత్తర భారతంలోని ఎఫ్సీఐ గోడౌన్ల నుంచి తెచ్చుకునే కంటే ఆస్ట్రేలియా నుంచి దిగుమతి చేసుకోవడమే చౌకనుకున్న కొన్ని పిండి మిల్లుల దిగుమతులనీ తేలింది. ఇలాంటి ముక్కలు చెక్కల అర్థశాస్త్రం మీకు పిచ్చి అనిపిస్తోందా? మీకు మరిన్ని విషయాలు చెబుతాను. ఎఫ్సీఐ కోసం ఆహార ధాన్యాల సేకరణను ఎక్కువగా చేసేవి పంజాబ్, హర్యానా రాష్ట్రాలే. అవి కనీస సేకరణ ధరపై 15 శాతం సెస్ను కేంద్రంపై విధిస్తాయి. ఆహారధాన్యాలను ఎక్కువగా పండిస్తున్నందుకు కేంద్రం వాటికి నేరుగా చెల్లిస్తున్న బహుమతే ఇది. ఇక మీరు హరిత విప్లవం సాధించిన రైతు విపత్కరమైన గోధుమ/వరి విషవలయంలో చిక్కుకుపోయాడని ఫిర్యాదు చేస్తారు. గోధుమ/వరి వల యం ఆ రాష్ట్రాల బడ్జెట్లకు డబ్బులు రాల్చేది అయినప్పుడు అవి రైతును క్యాబేజీ, బెండ, గోబి, క్యాలిఫ్లవర్ లేదా దోస వేయమని ఎందుకు ప్రోత్స హిస్తాయి? భారత వ్యవసాయాన్ని చక్కదిద్దాలంటే పంజాబ్, హర్యానాలు వ్యాపార పంటలకు, మద్దతు ధరతో మొక్కజొన్నకు మారమని చెప్పాలి. బాస్మతి వరి వేస్తే మామూలు వరితో పోలిస్తే టన్నుకు మూడు రెట్లు ఆదాయా న్నిస్తాయి, మూడో వంతు తక్కువ నీటిని వినియోగిస్తాయి. మామూలు వరిని ఈశాన్య రాష్ట్రాలకు, నర్మదా నదీ జలాలతో శక్తివంతమైన మధ్య ప్రదేశ్కు బదలాయించవచ్చు. ఎంపీ రైతులు దాదాపు 20 శాతం వృద్ధిని నమోదుచేస్తున్నారు. పరిశ్రమలు, పట్టణీకరణల కోసం భూమిని సేకరిస్తే దే శంలో సాగు భూమికి కొరత ఏర్పడి ఆహార భద్రతకు ముప్పు ఏర్పడుతోందనేది తదుపరి కూల్చి పారేయాల్సిన భ్రమ. మరో మారు వాస్తవాలనే చూద్దాం. మన దేశం దాదాపు 20 కోట్ల హెక్టార్ల సాగుయోగ్యమైన భూమిలో వ్యవ సాయం చేస్తోంది. ఇంచుమించు సాలీన 26 కోట్ల టన్నుల ఆహారధాన్యాలను ఉత్పత్తి చేస్తోంది. చైనా సాగుచేస్తున్నది 15.6 కోట్ల హెక్టార్లు. కాగా, ఉత్పత్తి చేస్తున్నది (ఊపిరి బిగబట్టి వినండి!) 60 కోట్ల టన్నులు. ఎందువల్ల? దానికి సాగునీరుంది. అక్కడి వరిలో 63 శాతం సంకర వంగడాలు. కాగా, మన దేశంలో అది కేవలం 3 శాతమే. ఎందుకు? ఆ విషయాన్ని మీరు వామపక్ష, మితవాద ‘‘సేంద్రియ వ్యవసాయ’’ లుడ్డైట్లను (19వ శతాబ్దపు యంత్ర విధ్వంసకులు-అను.) అడగండి. స్థూలంగా పైన ఇచ్చిన గణాంకాలన్నీ వ్యవ సాయ ఆర్థిక శాస్త్రవేత్త అశోక్ గులాతీ నుంచి సేకరించినవే. మీరు వ్యవసాయరంగాన్ని చక్కదిద్దగలగాలంటే ఏమేం చేయాలో స్వల్ప జాబితా ఇది. ఒకటి, సబ్సిడీల మొత్తానికంతటికీ సువ్యవస్థితం చేసి, వాటిని నేరుగా రైతుకే భూకమతం ఆధారంగా చెల్లించండి. రెండు, వ్యవ సాయ ఉత్పత్తుల ధరలను స్వేచ్ఛగా మార్కెట్లో నిర్ణయం కానివ్వండి. మూడు, మద్దతు ధరను నగదు రూపంలో చెల్లించి, విద్యుత్తు సహా అన్ని ఉత్పాదితాలకు మార్కెట్టు ధరలను వసూలు చేయాలి. నాలుగు, పొదుపులు, అదనపు మదుపులన్నీ నీటి పారుదల, సాంకేతికత ఉన్నతీకరణ, నూతన విత్తనాలు, జీఎమ్ సహా పరిశోధనపై పెట్టాలి. నీటిపారుదల మధ్యప్రదేశ్లో ఎలాంటి అద్భుతాన్ని చేసిందో చూడండి. అయితే, మహారాష్ట్రలో నీటిపారుదలపై 2000-01 నుంచి 2010-11 మధ్య రూ.81,206 కోట్లు ఖర్చు చేసినా నీటి వసతి ఉన్న పత్తి సాగు 5.1 శాతానికి మించలేదని కూడా విస్మరించరాదు. అందులో సగం ఖర్చుతో గుజ రాత్లో 67 శాతం సాగు అదనంగా పెరిగింది. దీన్ని మీరు విదర్భ, గుజరాత్ పత్తి రైతుల పరిస్థితులను పోల్చి చూడటం ద్వారా చూడవచ్చు. ఐదు, దుర్భిక్షం అనివార్యం అని, అలాగే వాతావరణ మార్పుల వల్ల విపరీత వాతావరణ పరిణామాలు చోటు చేసుకుంటాయని అంగీకరించాలి. భారత్లో ప్రతి నాలుగైదు ఏళ్లకు ఒకసారి దుర్భిక్షం ఏర్పడుతుందని గత వందేళ్ల గణాంక సమాచారం చెబుతోంది. కాబట్టి మనకు నిజమైన వ్యవ సాయ బీమా వ్యవస్థ, దేశంలోని 70 శాతం సాగుకంతటికీ పూర్తి బీమాను కల్పించే వ్యవస్థ. కానీ దానికి ఏటా రూ.15,000 కోట్లు అవసరం. ఎఫ్సీఐ ఆ మిగులు ఆహారధాన్యాల బరువు మోయకుండా ఉంటే చాలు అందులో సగం మొత్తం లభిస్తుంది. ఇంతకు ముందు చెప్పిన ఆ రూ.7,500 కోట్ల అంకెను గుర్తు తెచ్చుకోండి. ఎలాంటి బీమా? అందుకు అమలులో ఉన్న చాలా నమూనాలే ఉన్నాయి. నిజంగానే అద్భుతమైన నమూనా పీకే మిశ్రా (ప్రధాని కార్యాలయం ప్రస్తుత అదనపు ప్రధాన కార్యదర్శి) నేతృత్వంలోని పంటల బీమా పథకాల సమీక్ష, అమలు కమిటీ వద్ద సిద్ధంగా ఉంది. స్మార్ట్ ఫోన్లు, జీపీఎస్, ద్రోన్ల సమ్మేళనంతో సత్వర చెల్లింపులు చేయడంపై ఇతర నిపుణులు కూడా ఆ విష యంలో చాలా కృషే చేశారు. గులాతీ అన్నట్టు, కెన్యా చేయగా, మనం చేయ లేమా? అంతకంటే ముందుగా రైతును బిచ్చగాడిగా దిగజార్చి, అతనికి బిచ్చం వేస్తూ, దాన్ని కూడా ఆకలితో కాక దురాశతో నకనకలాడుతున్న వంచ కులు కాజేస్తున్నా బూటకపు సంతృప్తిని కలిగిస్తున్న ఈ భ్రమలను చెత్త బుట్టలో వేయాలి. - శేఖర్ గుప్తా shekhargupta653@gmail.com